Thursday, December 31, 2015

భారతీయ కాలమానమే ప్రమాణికం

డిసెంబర్ 31 రోజున అందరికీ ఎక్కడ లేని హడావుడి.. ఎందుకంటే న్యూ ఇయర్ అట.. అర్ధరాత్రి 12 గంటలకు కొత్త సంవత్సరం మొదలవుతుందని సంబరాలు చేసుకుంటారు.. మీరంతా సంబరాలు చేసుకుంటే ఎలాంటి అభ్యంతరాలు లేవు.. కానీ మనం సమగ్రమైన భారత కాలమానాన్ని మరచిపోయి, అర్థంలేని గ్రెగోరియన్ (ఆంగ్ల) క్యాలండర్ ను అనుసరిస్తున్నాం అని గమనించాలి..

భారతీయ కాలమానం ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుంది.. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకృతికి విరుద్ధం.. ఎలాగో గమనించండి..
భారతీయ కాలమానం ప్రకారం సూర్యోదయంతో దినం మొదలవుతుంది.. మనకు ఒక రోజు అంటే ఇవాళ తెల్లవారుఝాము నుండి మరునాటి తెల్లవారు వరకూ.. కానీ గ్రెగోరియన్ క్యాలండర్ మాత్రం అర్ధరాత్రి పూట దినం మొదలవుతుంది.. అది తిరిగి అర్ధరాత్రి వరకూ కొనసాగుతుంది..
సృష్టిలో ఏ ప్రాణి అయినా తెల్లవారు ఝామునే నిద్ర లేస్తుంది.. మనుషులంతా ఉదయాన్నే నిద్ర లేని దైనందిన కార్యక్రమాలకు సిద్ధమవుతాం.. పక్షుల కిలకిలరావాలు సుమధురంగా వినిపించేది.. తోటల్లో పూవులు వికసిస్తాయి.. ఆవులు దూడలకు పాలను ఇస్తాయి.. మరి ఈ చర్యలన్నీ అర్ధరాత్రి జరగడం మీరెప్పుడైనా చూశారా? ప్రకృతి నియమాల ప్రకారం సాగే ఈ చర్యలు గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అర్ధరాత్రి పూట జరగడం మీరు ఎక్కడైనా చూశారా?
మనం ఆలయాల్లో సుప్రభాత ప్రార్ధనలు తెల్లవారునే ఎందుకు చేస్తాం? అర్ధరాత్రి ఎందుకు చేయం.. మన పండుగలు భారతీయ కాలమానం ప్రకారమే జరుపుకుంటున్నం.. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఎప్పుడైనా జరుపుకుంటున్నామా?
భారతీయ సాంప్రదాయం ప్రకారం ఉగాదితో నూతన సంవత్సరం ఆరంభం అవుతుంది.. సూర్యమానమైనా, చంద్రమానమైనా గ్రహాల గమనం, ప్రకృతి ధర్మాల ప్రకారం మన కాలమానం రూపుదిద్దుకుంది.. జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం అని చెప్పడానికి సరైన ప్రమాణాలు లేవు.. రోమన్లు, గ్రీకులు పాటించే గ్రెగోరియర్ క్యాలెండర్ కాలగమనంలో అనేక మార్పులకు లోనైంది.. యూరోప్ దేశాల వలస పాలన ద్వారా ప్రపంచ దేశాలన్నిటిపైనా బలవంతాన రుద్దబడింది.. ఆంగ్లేయుల ద్వారా మన దేశానికి దాపురించింది..
నిజానికి స్పష్టమైన కాలగణన ఉన్నభారతీయ కాలమానమే ప్రపంచానికి ఆదర్శం.. గ్రెగేరియన్ క్యాలండర్లో ఎన్నో లోపాలు కనిపిస్తాయి..
మనం నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాల్సింది ఉగాది రోజునే.. జనవరి 1వ తేదీన జరుపుకోవాలని నియమం ఏమీ లేదు.. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా గ్రెగోరియన్ క్యాలెండర్ ను అనుసరిస్తున్నాయి.. దీన్ని మనం క్యాలెండర్ మార్పుగానే గుర్తించాలి.. 

Wednesday, December 30, 2015

నిజాలను దాచగలరా?

నిజం ఎప్పటికీ నిప్పు లాంటిదే.. కొన్ని నిజాలను మసి పూసినా దాచి పెట్టలేం.. ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కారణంగా దేశానికి కలిగిన నష్టాలను తొక్కి పెట్టే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ.. సోనియా గాంధీ విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరించింది..
సోషల్ మీడియా విస్తృతం అయ్యాక దేశ ప్రజలందరి దృష్టికీ ఈ విషయాలు చేరి పోయాయి..
అయినా ఉష్ట్రపక్షిలా గంభీరంగా వ్యవహరిస్తోంది ఆ పార్టీ.. ఇప్పుడు స్వయంగా కాంగ్రెస్ పార్టీ సొంత పత్రిక కాంగ్రెస్ దర్శన్ ఈ వాస్తవాలను ప్రముఖంగా ప్రచురించడం సంచలనం సృష్టించింది..
అవాక్కయిన కాంగ్రెస్ పెద్దలు పత్రిక కంటెంట్ ఎడిటర్ ను తొలగించారు.. కానీ దేశ ప్రజల మనసులోంచి వాస్తవాలను తొలగించడం సాధ్యమా? నిజం ఎప్పటికీ నిప్పులాంటిదే కదా..

Saturday, December 26, 2015

ప్ర‌ధాని మోదీ ఆక‌స్మిక పాక్‌ ప‌ర్య‌ట‌న దౌత్య విజ‌యమే..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్లో జరిపిన ఆకస్మిక పర్యటన దౌత్య పరంగా పొరుగు దేశంపై మన విజయంగా భావించాలి.. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనే పొరుగు దేశాల అధినేతలతో పాటు పాకిస్తాన్ను కూడా ఆహ్వానించి తన విధానాన్ని స్పష్టం చాటుకున్నారు.. పాకిస్తాన్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడటంతో ఆ దేశంలో పర్యటనను వాయిదా వేసుకున్నారు మోదీ..  ఇప్పుడు పరిస్థితులు కాస్త కుదుట పడగానే పాకిస్తాన్లో హఠాత్తుగా పర్యటించడం వ్యూహాత్మకమే అని భావించాలి.. ఇందుకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట్లో శుభకార్యాన్ని ఉపయోగించుకున్నారు.. అయితే అంతకు కొద్ది గంటల ముందే ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన కార్యక్రమంలో పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఊతం ఇవ్వడాన్ని మోదీ స్పషంగా ఎండగట్టారు.. ఆది ఆయన దౌత్య చతురతకు అద్దం పడుతోంది.. 
ఏడాదిన్నర క్రితం ఇరుగు పొరుగుతో పాటు ప్రపంచ దేశాలతో మన దేశ ద్వైపాక్షిక సంబంధాలు క్షీణిస్తూ వచ్చాయి.. ఈ నేపథ్యంలో మోదీ మన విదేశాంగ విధానాన్ని తిరగరాస్తున్నారు.. ఈ రోజున అగ్ర దేశాలతో పాటు ప్రపంచంలోని పలు దేశాలు భారత్ విషయంలో సానుకూల దృక్పథం పెంచుకోవడం దేశ ప్రజలందరికీ గర్వకారణకమైన విషయం.. ప్రధాని దేశంలోకన్నా విదేశాల్లోనే ఎక్కువగా పర్యటిస్తున్నారని నోరు పారేసుకుంటున్నవారు ఈ విషయాన్ని గుర్తించాలి.. 
తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1953,1960 సంవత్సరాల్లో పాకిస్తాన్లో పర్యటించారు.. రాజీవ్ గాంధీ 1988,1989 సంవత్సరాల్లో ఆ దేశానికి వెళ్లారు.. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి 1999, 2004 సంవత్సరాల్లో పాక్ పర్యటనకు వెళ్లారు.. మధ్యలో ప్రధాని మన్మోహన్ సింగ్కు తీరిక దొరకలేదు.. ఈయన హయాంలో మన భారత దౌత్య విధానం పూర్తిగా దెబ్బతిన్నది..  మళ్లీ ఇన్నాళ్లకు ప్రధాని మోదీ పాకిస్తాన్కు వెళ్లారు..
భారత దేశ విదేశాంగ విధానంలో సరికొత్త అధ్యాయానికి మోదీ నాంది పలికారు..

ప్రజాస్వామ్యం, వారసత్వ రాజకీయాలకు తేడా..

2014లో భారత్, బ్రిటన్ దేశాల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి.. బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీ పరాజయం పాలైంది.. అంతకు ముందు ఎన్నికల్లో ఆ పార్టీకి 256 సీట్లు రాగా, తాజ ఎన్నికల్లోల 24 సీట్లు క్షీణించి 232 సాట్లు వచ్చాయి..
భారత దేశంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది.. ఆ పార్టీకి గతంలో 206 సీట్లు ఉంటే 2014 ఎన్నికల్లో ఘోరంగా 44కి పడిపోయాయి..
ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తే బ్రిటన్ లేబర్ పార్టీ అధ్యక్ష పదవికి తక్షణ రాజీనామా చేశారు.. మరి ఇండియాలో?.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పదవి పదిలం..
మన దేశంలో 2004, 2009 ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలైనప్పుడు ఆ పార్టీ అధ్యక్షులు రాజీనామా చేశారు.. ప్రధాని అభ్యర్ధిగా ఉన్నఅగ్ర నాయకుడు లాల్ కృష్ణ అడ్వానీ సైతం ప్రజాభిప్రాయానికి తలొంచక తప్పలేదు..
అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న  రాజకీయ పార్టీలకు, వారసత్వ రాజకీయ పార్టీలకు ఉన్న తేడా ఇదే.. 

Monday, December 21, 2015

నేరానికి వయసుకు సంబంధం ఏల?

పాము చిన్నదైనా, పెద్దదైనా విష పూరితమే.. నేరాలకు వయసుతో ముడిపెట్టే ముందు వారి స్వభావాన్ని కూడా గమనించాలి.. దేశ ప్రజలందరినీ కదిలించిన నిర్భయ అత్యాచార కేసులో ఓ నేరగాడు మైనర్ అనే కారణంతో విడుదల చేయడంలోని ఔచిత్యం ఏమిటో న్యాయస్థానాలే చెప్పాలి.. ఈ కేసులోని ఈ వ్యక్తి పేరుకే బాలుడు. కానీ బాధితురాలి పట్ల ఇతర నిందితులందరికన్నా అత్యంత ప్రవర్తించాడని విచారణ సందర్భంగా తేలిందటున్నారు.. ఇతర నేరగాళ్లకు కఠిన శిక్షలు పడ్డా, మైనర్ అనే కారణంతో ఇతన్నిప్రత్యేక పరివర్తన సదనంలో ఉంచారు.. కానీ ఈ సమయంలో అతనిలో ఎలాంటి పశ్చాతాపం కనిపించలేదని, పైగా మరింత తీవ్ర భావాలను ప్రదర్శించాడని న్యాయవాదులు చెబుతున్నారు.. నేరగాడి ప్రవర్తనను పరిగణనలోని తీసుకోకుండా విడుదల చేయాలని న్యాయస్థానం నిర్ణయించడం దేశ ప్రజలెవరూ జీర్ణించుకోలేక పోతున్నారు.. మన న్యాయ వ్యవస్థలోని లొసుగులను ఈ కేసు మరోసారి నిరూపించింది..

అందరికీ శ్రీమహా విష్ణువు కరుణా కటాక్షాలుకలగాలి..


Saturday, December 19, 2015

హెరాల్డ్ ఆస్తులు అమ్ముకునే హక్కు ఉందా?

తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జ్ఞాపకాలను ప్రజల స్మృతిపథం నుండి తొలగిస్తున్నారని మోదీ సర్కారుపై కొద్ది రోజుల క్రితం గయ్యిన లేచారు కాంగ్రెస్ నాయకులు.. మరి నెహ్రూ స్థాపించిన కాంగ్రెస్ పార్టీ సొంత పత్రిక నేషనల్ హెరాల్డ్ ను మూసేసి, దాని ఆస్తులను తెగనమ్ముకొని సొంత ఖాతాలో వేసుకున్న సోనియా గాంధీ, రాహుల్ రాహుల్ గాంధీలను ఎలా వెనుకేసుకు వస్తున్నారు వీరు?.. నెహ్రూ వారసులు అయినంత మాత్రాన కుంభకొణానికి పాల్పడేందుకు వీరికి పేటెంట్ రైట్స్ ఉన్నాయా?.. పైగా వీరేదో ఘన కార్యం చేసినట్లు అండగా నిలుస్తున్నారు.. చివరగా అర్థం అయింది ఏమిటంటే నెహ్రూ జ్ఞాపకాలను నిర్మూలించే హక్కు ఆయన వారసులదే.. ఈ విషయంలో మోదీకి ఎలాంటి చట్టబద్దమైన హక్కూ లేదు..

అవార్డులు.. కండిషన్లు

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు అందుకోనున్న వారందరికీ అభినందనలు.. ఈ సందర్భంగా నాదో వినతి.. మీరు సాహితీ రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా లభిస్తున్న ఈ అవార్డులు మీకే కాకుండా దేశ ప్రతిష్టకు కూడా గర్వకారణం.. కాబట్టి అవార్డుల విషయంలో రాజకీయాలను ముడిపెట్టకండి.. అసహనకారుల ప్రభావంలో పడకండి..

ఇక కేంద్ర ప్రభుత్వానికి కూడా నాదో మనవి.. అవార్డులు ఇచ్చేప్పుడు ముందే షరతులు విధించండి.. రాజకీయ కారణాలతో అవార్డులు తిరిగి ఇవ్వొద్దని స్పష్టంగా చెప్పండి.. ఒకవేళ అవార్డు వాపసు ఇస్తే, దానితో పార్టు ఇచ్చే నగదును కూడా తిరిగి ఇవ్వాలనే షరతు విధించండి..

Thursday, December 17, 2015

వదంతులు ప్రచారం చేయకండి

నమ్మే వాడుంటే చేవిలో పువ్వు పెట్టేవాడు ఎప్పుడూ సిద్దంగానే ఉంటాడు. ఇటీవల వాట్సప్, ఫేస్ బుక్, తరతర సోషల్ మీడియా మెసెంజర్ సర్వీసుల్లో వస్తున్న వదంతులు ఈ తరహాలోనివే.
నరేంద్ర మోదీ ప్రభుత్వం డిజిటల్ ఇండియా పథకం కోసం 12 జీబీ డాటా, రూ.1029 టాక్ టైమ్ ఇస్తోంది.. దీన్ని 10 మంది మిత్రులకు షేర్ చేయాలి.. 5 నిమిషాల తర్వాత బ్యాలన్స్ వస్తుంది. ఇందు కోసం కింది మొబైట్ నెట్ వర్క్ నెంబర్స్ డయల్ చేయండి. ఇది చూసి నేను కూడా షాక్ అయ్యాను.. కానీ ఇది నిజం. ప్రయత్నించండి..
ఈ మెసేజ్ చూసి వారంతా నిజమేనని గుడ్డిగా నమ్మేస్తూ అందరికీ ఫార్వర్డ్ చేస్తున్నారు. కనీసం నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. ప్రధాని మోదీ ప్రజలకు ఏమైనా లబ్ది చేకూర్చే పథకం ప్రారంభిస్తే బహిరంగంగా ప్రకటిస్తారు.. పత్రికల్లో, టీవీల్లో ప్రకటనలు ఇచ్చి అందరికీ తెలిసేలా చేస్తారు. కానీ ఇలా రహస్యంగా సోషల్ మీడియాలో మెజేజ్ వదంతులు వ్యాపింపజేయరు. కాస్త ఇంగితంతో ఆలోచించండి. మీకు ఇలాంటి మెజేస్ వస్తే పంపిన వాడిని నిలదీయండి.. కనీసం వాడు ప్రయత్నించి చూశాడా అపి ప్రశ్నించడండి.. ప్రయత్నించలేదని చెబితే, మరి ఎందుకు మెజేస్ పంపావని అడగండి..

ఇలాంటి వదంతులను కట్టడి చేయడానికి ఇదొక్కటే మార్గం..

స్నేహ హస్తం వెనుక మతలబు ఇదేనా?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీతో సంబంధాల విషయంలో వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు.. ఇటీవలి కాలంలో రెండు సార్లు విజయవాడ వెళ్లడం, ఏపీ సీఎం చంద్రబాబును తాను తలపెట్టిన యాగానికి ఆహ్వానించడం పక్కా స్కెచ్ ప్రకారమే జరిగింది.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఉంది కేసీఆర్ ఎత్తుగడ.. స్నేహ హస్తం అందించడం ద్వారా ఆంధ్రా ప్రజలను సంతోషపరచడమే కాదు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్లోని సీమాంధ్రుల ఓట్లు సాధించాలని ఆయన భావించినట్లు తెలుస్తోంది.. పొరుగు రాష్ట్రంతో సఖ్యతగా మెలగాలని కేసీఆర్ భావిస్తే మంచిదే.. అది జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కూడా కొనసాగాలి..

Wednesday, December 16, 2015

కేజ్రీ చట్టపట్టాల్ ఎవరితో?

మొన్న పాట్నాలో పశుగ్రామ కుంభకోణ నిందితుడు లాలూ ప్రసాద్ యాదవ్ ను కౌగలించుకున్నాడు.. ఇవాళ ఏకంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ముఖ్యకార్యదర్శి రాజేంద్ర కుమార్ పై సీబీఐ దాడులను తప్పు పట్టాడు.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎందుకిలా మారిపోయాడు.. లోక్ పాల్ బిల్లు కోసం జరిగిన అన్నా హజారే పోరాటాన్ని రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకొని సీఎం పదవిని సంపాదించాడు కేజ్రీవాల్.. తన హద్దులను ఢిల్లీకే పరిమితం చేసుకొని ఉద్యమాన్ని గాలికొదిలేశాడు.. ఇప్పుడు ఏకంగా అవినీతి పరులైన అధికారులకు అండగా నిలుస్తున్నాడు..
తనకు ముందుగా చెప్పి దాడులు చేయలేదని తప్పు పడుతున్నాడు కేజ్రీవాల్.. సర్జీ మేము దాడులకు వస్తున్నాం, అంతా సర్దుకొని సిద్దంగా ఉండండి అని సీబీఐ ముందుగానే సమాచారం ఇవ్వాలా?.. కేజ్రీవాల్ తో బంధం తెంచుకోవడం మంచిదైందని ఇటీవల అన్నా హజారే వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి..

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై తన రాజకీయ వ్యతిరేకతను చాటుకోవడానికి కేజ్రీవాల్ కు అనేక మార్గాలు ఉన్నాయి.. కానీ అవినీతి విషయంలో ఇలా ద్వంద్వ వైఖరి ప్రదర్శించడం ఆయన విశ్వసనీయను ప్రశ్నార్ధకం చేస్తోంది..

Tuesday, December 15, 2015

దేశం కన్నా కుటుంబమే మిన్న..

1978 డిసెంబర్ మాసంలో లక్నో నుండి ఢిల్లీ వెళ్లుతున్న ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం హైజాక్ అయింది. కారణం: ఇందిరా గాంధీని అరెస్టు చేశారని.. 2015 డిసెంబర్ మాసంలో పార్లమెంటు సమావేశాలకు ఆటంకం. కారణం: సోనియా గాంధీని తన ఎదుట హాజరు కమ్మని న్యాయ స్థానం ఆదేశించినందుకు.. రెండు ఘటనలకు 37 ఏళ్ల తేడా.. కానీ రెండు చర్యలకు కారణం కాంగ్రెస్ పార్టీయే.. నాడు, నేడూ ఒక కుటుంబాన్ని రక్షించడానికి చేసిన పనే..
ఆనాడు కేంద్రంలో జనతా పార్టీ అధికారంలో ఉంది.. రాజకీయ ప్రేరిత కుట్రలో భాగంగా ఇందిరను అరెస్టు చేశారని కాంగ్రెస్ నాయకుల ఆరోపణ.. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది.. సోనియా గాంధీ విషయంలోనూ రాజకీయ కుట్రే అని కాంగ్రెస్ వాదన.. ఏది నిజం? ఏది అవాస్తవం?..
1978, 2015.. ఈ రెండు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నవారు ఒక కుటుంబానికి చెందిన వారు.. వారిపై చర్యలు చేపట్టింది న్యాయస్థానమే.. రెండింటిలోనూ ప్రభుత్వాల ప్రమేయం ఏమాత్రం లేదు.. వారు చేసిన తప్పుల ఫలితం కారణంగానే కేసుల్లో ఇరుక్కున్నారు.. కానీ కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది..
మరీ విచిత్రం ఏమిటంటే ప్రస్తుత నేషనల్ హెరాల్డ్ కేసు 2013లో నమోదైంది.. నాడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే.. న్యాయ స్థానాలపై అధికార పార్టీల ప్రభావం ఉందని వారు భావించనట్లయితే, ఆనాడే కేసు నమోదు కాకుండా అడ్డుకోవచ్చుకదా?.. బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కేసు నమోదు చేసినంత మాత్రాన, దాన్ని ప్రభుత్వానికి ఆపాదించడానికి ప్రయత్నించడమేనా?

ఇంతకీ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ స్థాపించిన కాంగ్రెస్ అధికార పత్రిక ఆస్తులను ఒక కుటుంబం అడ్డగోలుగా అమ్ముకొని తమ వ్యక్తిగత ఖాతాల్లో వేసుకుంటే ఆ పార్టీ నాయకులు వెనుకేసుకురావడం ఎంత వరకూ సమంజసం?.. కాంగ్రెస్ పార్టీ ఆ వ్యక్తుల కుటుంబ ఆస్తిగా భావిస్తున్నారా?.. దేశంకన్నా కుటుంబమే మిన్న అని కాంగ్రెస్ పార్టీ నమ్ముతోందా?.. ఏప్రిల్ ఇంకా నాలుగు నెలల దూరంలో ఉంది.. మరి ఎవరిని ఫూల్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.. దేశ ప్రజలనా?.. ప్రజలు అంత అమాయకులుకాదు మోసపోవడానికి..

Saturday, December 12, 2015

1857 నాటి కుట్రలు కొనసాగుతున్నాయి..

భారత స్వాతంత్ర్య సమర పోరాటానికి క్రీ.శ.1857సం.లో అంకురార్పణ జరిగింది.. బ్రిటిష్ వారు దీన్ని సిపాయిల తిరుగుబాటు (Sepoy Mutiny) అన్నారు.. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ దామోదర్  సావర్కర్ 1857లో జరిగింది ప్రథమ స్వాతంత్ర్య సమరం (First war of Independence) అని ఆధార సహితంగా చాటి చెప్పారు.. ప్రథమ స్వాతంత్ర్య సమరంలో సిపాయిల తిరుగుబాటు ఒక భాగం.. ఇంతకీ సిపాయిల తిరుగుబాటు ఎందుకు జరిగిందో తెలుసా?
ఈస్టిండియా కంపెనీ సైన్యంలోని సిపాయిలకు ఎన్ ఫీల్డ్ అనే కొత్త తుపాకులు సరఫరా చేశారు.. సిపాయిలు ఈ తుపాకుల్లో లోడ్ చేసే తూటాల సీల్ ను పంటితో తొలగించాలి.. అయితే ఈ తూటాల సీలును ఆవు, పంది మాంసం నుండి తీసిన కొవ్వుతో తయారు చేయడం బయట పడింది.. కంపెనీ సైన్యంలో అత్యధికులు హిందువులు, ముస్లింలు.. బ్రిటిష్ వారు తమ మత విశ్వాసాలను అవహేళన చేయడాన్నివారు తట్టుకోలేకపోయారు.. మంగళ్ పాండే నేతృత్వంలో సైన్యంలో తిరుగుబాటు వచ్చింది..
ఒకటిన్నర శతాబ్దం క్రితం జరిగిన ఈ ఘటన బ్రిటిష్ వారి విభజించి పాలించు అనే కుటిల నీతిలో భాగం.. దేశ ప్రజలంతా ఏకమై దాన్నితిప్పికొట్టి ఐక్యతను చాటుకున్నారు.. ఆ తర్వాత జరిగిన జాతీయ ఉద్యమానికి ఈ ఐక్యత దారి చూపింది.. బ్రిటిష్ వాడు పోతూ పోతూ మన దేశాన్ని విభజించడంతో పాటు సమాజంలో చిచ్చు పెట్టి పోయాడు.. విదేశీ భావదాస్యతను జీర్ణించుకున్న కొన్ని శక్తులు ఈ నాటికి మన దేశాన్ని, సమాజాన్ని విచ్ఛినం చేసే దిశగా కుట్రలు పన్నుతూనే ఉన్నాయి..

ఇప్పుడు కొన్ని సంస్థలు నిర్వహిస్తున్న కూరల పండుగలను మనం ఏ దృష్టితో చూడాలి? తాము కోరుకుంటున్న ఆహారం తినే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుంది.. కానీ ఆహార స్వేచ్ఛ అంటూ వీధినపడి, మత పరమైన సెంటిమెంట్లను రెచ్చగొట్టడం ఎంత వరకూ న్యాయం? ప్రజల మత విశ్వాసాలతో ఆడుకొని వారిలో ఒకరిపట్ల మరొకరికి అపనమ్మకం, విధ్వేషాలను సృష్టించడం ఏ రకమైన స్వేచ్ఛకు ప్రతీక?.. ఆలోచించండి..

Wednesday, December 9, 2015

ఈ కూర పండుగ లొల్లి ఏంది?


అత్తను మించిన కోడలు..

తాను ఇందిరా గాంధీ కోడలినని, ఎవరికీ భయపడనని ప్రకటించుకున్నారు సోనియా గాంధీ.. ఈ విషయంలో ఎవరికీ అనుమానం లేదు.. రాజీవ్ గాంధీ భార్య నిస్సందేహంగా ఇందిరకు కోడలే అవుతుంది కదా?.. సోనియా ఎవరికీ భయపడనంటున్నారు.. అదే కదా దేశ ప్రజలకు భయం..
ఇందిరా గాంధీ ప్రధాని పదవిలో ఉన్నప్పుడు  అలహాబాద్ హైకోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే సహించలేక ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, పౌర హక్కులను కాలరాసి దేశంలో ఎమర్జెన్సీ విధించారు.. కొడుకు సంజయ్ గాంధీ అరాకచాలతో ఆమెకు అండగా నిలిచారు..  చరిత్రలో నియంతగా పేరు తెచ్చుకున్నారు ఇందిర..

ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ పత్రిక కుంభకోణంలో ఢిల్లీ హైకోర్టు తన ముందు హాజరు కమ్మని సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీలను ఆదేశించింది.. దీనికి గగ్గోలు పెడుతూ విషయం ఏమిటో చెప్పకుండా పార్లమెంటును అడ్డుకున్నారు కాంగ్రెస్ ఎంపీలు.. ఈ సందర్భంగా తాను ఇందిర కోడలినని గుర్తు చేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు సోనియా.. తాటాకు చప్పుళ్లకు మోదీ సర్కార్ భయపడుతుందంటారా?

Friday, December 4, 2015

చెన్నై గుణ పాఠం..

చెన్నపట్నం చిన్నబోయింది.. చెరువైపోయింది. భారీ వర్షాలకు నీట మునికి అతలాకుతలమైంది.. భారత దేశంలోని మెట్రోనగరాల్లో దక్షిణాదికే తలమానికంగా నిలచిన ఈ నగరానికి ఎందుకీ దుస్థితి? మానవ తప్పిదాల కారణంగానే ప్రకృతి కన్నెర్రజేసిందా?
ఒక్కప్పుడు చెన్నై నగరంలో పెద్ద సంఖ్యలో చెరువులు ఉండేవి.. మూడు ప్రధాన నదులు ఉన్నాయి.. వర్షం నీరు కాలువల ద్వారా చెరువుల్లో చేసి అక్కడి నుండి నదుల్లో చేరేది.. ఆ తర్వాత ఈ నీరంతా సముద్రంలో కలిసేది.. శివారు ప్రాంతంలో విచ్చల విడిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగిపోయి పొలాలు కనుమరుగయ్యాయి.. ఆ తర్వాత చెరువులను కబ్జా చేశారు.. చెన్నై శరవేగంగా అభివృద్ధి చెందుతూ కాంక్రీట్ జంగల్ అయిపోయింది..
చెన్నైలో గత వందేళ్లుగా ఇంతటి భారీ వర్షం కురవలేదు.. ఒక్కసారిగా పెద్ద వానలు పడే సరికి వాననీరు నగరాన్ని ముంచెత్తింది.. చెరువులు, కాల్వలు కనుమరుగవడంతో వరద నీరంతా వీధుల్లోకి వచ్చింది. వేల సంఖ్యలో ఇళ్లూ, భవనాలు మునిగాయి.. ప్రణాళికాబద్దంగా లేని నగరాభివృద్ధి కారణంగా డ్రైనేజీలు వరద నీటిని తట్టుకోలేకపోయాయి.. దీనికి తోడు విచ్ఛల విడిగా ప్లాస్టిక్ వాడకం కారణంగా చెత్తా చెదారం డ్రైనేజీల్లో ప్రవాహానికి అడ్డు పడింది.. ఉన్న కొద్ది పాటి కాలువల్లో భవన నిర్మాణ వ్యర్ధాలను పడేస్తున్నారు.. ఇక వరద నీరు ఎక్కడికి పోవాలి.. దీని ఫలితమే ఈ జల విలయం..

ప్రకృతి చెన్నైకి నేర్పిన గుణపాఠం ఇతర నగరాలకు కనువిప్పు కావాలి.. ప్రకృతికి వ్యతిరేకంగా పోతే వినాశనమే అని ఇకనైనా మనమంతా అర్థం చేసుకోవాలి..

ఔట్ లుక్.. జూట్ లుక్ అయింది..

నిజం నిద్రలేచేలోపు అబద్దం లోకం చుట్టి వస్తుందంటారు.. ఔట్ లుక్ పత్రిక బాధ్యతారహిత వ్యవహారం అలాగే ఉంది.. 
దేశానికి 800 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ రూపంలో హిందూ పాలకుడు వచ్చారని హోంమంత్రి రాజనాథ్ సింగ్ అన్నట్లుగా ఔట్ టుక్ పత్రిక రాసింది.. ఈ అంశాన్ని సీపీఎం ఎంపీ మహ్మద్ సలీం పార్లమెంట్ లో ప్రస్థావించగా, తాను అలా అన్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని రాజనాథ్ సవాలు విసిరారు.. దీంతో ఔట్ లుక్ నాలిక కరుచుకుంది.. ఈ మాటలు రాజనాథ్ అనలేదని, అశోక్ సింఘాల్ అన్నారని ఇప్పుడు బొంకుతోంది.. అంటే ఇప్పుడు దివంగత సింఘాల్జీ వచ్చి వివరణ ఇచ్చుకోవాలా.. 
చిన్న చిన్న ఘటనలను చిలువలు పలువలుగా చేసి 'అసహన మంటలు' రాజేసి చలి కాచుకోవడం సమంజసమేనా?

ఈ కూర గోల ఏల?

ఇవాళ పెద్ద కూర పండుగ, పంది కూర పండుగ.. రేపు కుక్క కూర, గాడిద కూర పండుగలు..  అ తర్వాత మనుషుల్ని కూడా కోసుకుతింటారేమో.. ఎవడి తిండి వాడు ఇంట్లో తినక వీధినపడటం ఎందుకు?.. ఎవడి తిండి వాడిష్టం.. మరి ఇలా పండుగల పేరుతో అవతలి వారి మనోభావాలను గేలి చేయడం ఎందుకు?..

Tuesday, November 24, 2015

అసహనం ఉందట.. దేశం విడిచిపోతారట..

భారత్ లో అసహనం పెరిగిపోతోందట.. అందుకే దేశం విడిచిపోదామని తన భార్య కిరణ్ రావు ప్రతిపాదించిందని బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ వాపోయాడు.. నిజంగా ఈ దేశ ప్రజల్లో అసహనమే ఉంటే వీరి సినిమాలు ఇంత స్వేచ్ఛగా ఎలా ఆడుతున్నాయి.. ఈ సినిమాలను చూస్తున్నది ఎవరు? మన దేశ ప్రజలు కాదా? తమ సినిమాలకు కోట్లాది మంది భారతీయుల ఆదరణను సొమ్ము చేసుకొని, కోటాను కోట్లు రూపాయల ధనం ఆర్జించడం వాస్తవం కాదా?.. మరి అమీర్ ఖాన్ కుటుంబానికి అసహనం ఎక్కడ కనిపించింది?.. అసహనానికి సంబంధించిన ఉదాహరణ ఇవ్వకుండా, దుష్ప్రచారానికి దిగడం దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీయడం దేశ ద్రోహం కాదా?.. ఇంతకీ వీరు భారత్ ను విడిచి ఏ దేశానికి పోతారు?.. ఆ దేశాలు భద్రమైనవేనా?.. వీరి భద్రతకు అక్కడ పూచీ ఎవరు?.. అసలు సామాన్య ప్రజలకు ఎక్కడా కనిపించని అసహనం ఈ సెలబ్రిటీలకే ఎందుకు కనిపిస్తోంది.. ఇందులో ఏమైనా కుట్ర ఉందా?.. రాజకీయ ప్రేరితమా?.. ఆలోచించండి..

Saturday, November 21, 2015

వారసత్వ రాజకీయమా వర్ధిల్లు..

ఇద్దరూ ఇద్దదే.. చదువుల్లో, ఆటల్లో అత్తెసరు.. ఓ రాష్ట్రానికి మంత్రులైపోయారు.. వారి అర్హత లాలూ ప్రసాద్ యాదవ్ తనయులు కావడమే.. వారసత్వ రాజకీయమా వర్ధిల్లు..
తేజస్వీ యాదవ్(26) అర్హత తొమ్మిదో తరగతి ఫెయిల్.. ఇంక ఒల్ల, క్రికెట్ ఆడతా అంటే పెద్దాయన వాకే అనేశాడు.. బ్యాట్ పట్టిన చిన్నబ్బాయికి అదీ చేతగాలేదు.. అక్కడా రాణించలేదు.. వీడు రాజకీయాలకే సరి అనుకున్నారు అయ్యగారు.. ఎమ్మెల్యేగా గెలిపించి, ఏకంగా బిహార్ ఉప ముఖ్యమంత్రిని చేశారు.. ఇక పెద్దబ్బాయిగారి సంగతి కొద్దాం.. తేజ్ ప్రతాప్ యాదవ్ (28) ఇంటర్మీడియట్ లోనే డుంకీ కొట్టేశాడు.. ఎమ్మెల్యే అయి నితిష్ క్యాబినెట్లో మంత్రిగా చేరాడు.. ఇతని ప్రమాణ స్వీకారం మరో తమాషా.. గవర్నర్ గారు అపేక్షిత్(ఆకాంక్ష) అని చదివిస్తే ఉపేక్షిత్(నిర్లక్ష్యం) అని ఉచ్చరించాడు..(ఇక ఆయన ప్రజలకు చేయబోయేది అదే కాదా..) తబ్(అప్పుడు) అనమంటే జబ్(ఎప్పుడు) అన్నాడు.. అందుకే నేమో లాలూ గారికి పెద్దబ్బాయి గారి మీద అంత నమ్మకం లేక చిన్నబ్బాయికే ఉప ముఖ్యమంత్రి పదవి ఇప్పించాడు..

బహారీలు వద్దు బిహారీలనే ఎన్నుకోండి అంటూ నితిష్ కుమార్ గారు ఎన్నికల్లో స్లోగన్ ఇచ్చారు.. బిహారీలు మరోలా అర్థం చేసుకొని బాణం పార్టీకన్నా లాంతరు పార్టీకి ఎక్కువ సీట్లు ఇచ్చారు.. కట్ చేస్తే.. రిమోట్ కంట్రోల్ లాలూ చేతికి వచ్చింది.. ఇక ఆయన ఆడిందే ఆట పాటిందే పాట.. బిహారీయా.. ఆప్ లోగ్ హార్ గయే భయ్యా.. 

Thursday, November 19, 2015

ఇదండీ కిస్ ఆఫ్ లవ్ మతలబు..

వీళ్లు కిస్ ఆఫ్ అవ్ అనే ఉద్యమకారులట.. అంటే బహిరంగ ప్రదేశాల్లో ప్రేమ పేరిట బరితెగించి తిరిగే వారికి అండగా నిలిచే ఉద్యమం.. వాస్తవానికి నిజమైన ప్రేమికులు ఇలాంటి పనులు చేయరు.. కేరళలో అనైతిక కార్యకలాపాలు పెరిగిపోతున్న నేపథ్యంలో నైతిక వాదులు తీవ్రంగా వ్యతిరేకించారు.. కొన్ని చోట్ల బహిరంగ ప్రదేశాల్లో ఊర కుక్కల్లా ప్రవర్తించిన వారిని పట్టుకొని కొట్టారు.. దీంతో ప్రేమికులపై ఆంక్షలు విధిస్తారా అంటూ కిస్ ఆఫ్ లవ్ పేరిట ఉద్యమం లేవదీశారు రాహుల్,  రేష్మీ.. బహిరంగంగా ముద్దులు పెట్టుకొని, మీడియా ముందు ఫోజులు ఇచ్చి ఏమి చేసుకుంటారో చేసుకోండి.. అంటూ సవాలు విసిరారు.. వీరిని ఆదర్శంగా తీసుకొని దేశంలోని మరి కొందరు తిక్కోళ్లు కిస్ ఆప్ అవ్ అంటూ ఊళ్ల మీద పడ్డారు.. వీరికి మన సోకాల్డ్ గాళ్లుమద్దతు ఇచ్చారు..
..కట్ చేస్తే..

తాజాగా కేరళ పోలీసులు సెక్స్ రాకెట్ కేసులో ఈ జంటతో పాటు మరి కొందరిని అరెస్టు చేశారు.. వీరు ఆన్ లైన్లో ఈ తతంగం నడిపిస్తున్నారట.. ఇప్పుడు అర్థమైందా కిస్ ఆఫ్ లవ్ మతలబు ఏమిటో..

Wednesday, November 18, 2015

ధర్మరక్షణే శ్వాసగా తుది వరకూ జీవించిన భరతమాత ముద్దు పుత్రుడు అశోక్ సింఘాల్.. సింఘాల్జీకి ఘన నివాళి అర్పిద్దాం..


మితిమీరిన అయ్యర్ అసహనం..


ప్రధాని నరేంద్ర మోదీని పదవిలో నుండి తొలగిస్తేనే ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతాయట.. పాకిస్తాన్ టీవీ ఛానల్ దునియాలో కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ వాక్రుచ్చాడిలా.. అదెలా సాధ్యం అని ఆ ఛానెల్ ప్రతినిధి అడిగితే, అయితే భారత్, పాక్ సంబంధాలు మెరుగయ్యేందుకు నాలుగేళ్లు ఆగాల్సిందే అంటాడీయన.. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన భారత ప్రధాని మీద, అందునా పాక్ ఛానల్లో అసహనం ప్రదర్శించిన ఇతని విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా స్పందిస్తుందో చూడాల్సిందే.. గతంలో నరేంద్ర మోదీ చాయ్ అమ్ముకొని బతకాలని ఈసడించిందీ ఈ పెద్ద మనిషే.. చాయ్ వాలా ప్రధాని అయితే తప్పా అని ప్రశ్నించిన మోదీ, అంత పని చేసే సరికి అయ్యరోరు ఇంతకాలం మొహం ఎక్కడ దాచుకున్నాడో?..  

Sunday, November 15, 2015

ఈ పాపం ఎవరిది?

ప్రపంచంలో భద్రమైన చోటంటూ ఉందా?.. సురక్షితం అనుకున్న ప్రాంతాలే ఇప్పుడు టార్గెట్ అయిపోతున్నాయి..  పారిస్ నగరంలో ఉగ్రవాదులు దారుణ మారణకాండకు పాల్పడటం ప్రపంచాన్ని మరోసారి భయపడిపోయింది.. ముంబైతో పాటు ఎన్నో ఉగ్రదాడులను చూసిన మనకు ఇవి కొత్తగా కనిపించకపోవచ్చు.. ప్రపంచాన్ని శాసించాలని చూస్తున్న సోకాల్డ్ అగ్ర దేశాలన్నీ ఇప్పుడు ఉగ్ర భూతాలను చూసి జడుసుకుంటున్నాయి.. మరి ఇవన్నీ వారు పోషించిన పాములే కదా?.. అందుకే అంటారు మన పెద్దలు, చేసుకున్న వారికి చేసుకున్నంత అని..
రెండు ప్రపంచ యుద్దాల తర్వాత వలసవాద దేశాలు స్వాతంత్ర్యం పొందాయి.. కానీ అగ్రరాజ్యాలుగా అవిర్భవించిన అమెరికా, సోవియట్ యూనియన్ల చుట్టూ ప్రపంచ దేశాలు చేరిపోయాయి.. నడుమ అలీన విధానమంటూ హడావిడి చేసిన మన నెహ్రూ మహానుభావుడు, మధ్యలోనే జెండా ఏత్తేసి బలవంతంగా మన దేశాన్ని సోవియట్ శిబిరంలో దించాడు.. దీంతో మన దాయాది పాకిస్తాన్ అమెరికా పంచన చేరింది.. ఈ రెండు అగ్ర దేశాలు తమ ప్రాభల్యం, ప్రయోజనాల కోసం మధ్యప్రాచ్య దేశాల్లో చిచ్చు పెట్టాయి.. కాలక్రమంలో సోవియట్ యూనియన్ పతనం తర్వాత అమెరికా కేంద్రంగా ఏకదృవ ప్రచంచం ఏర్పడింది.. ఒకప్పడు అమెరికా మిత్ర దేశాలు రగిల్చిన ఆ చిచ్చు ఫలితమే ఈ ఉగ్ర భూతాలు..

తన దాకా వస్తే కాని తెలియదన్నట్లు, ట్విన్ టవర్లపై దాడి తర్వాత ఉగ్రవాదంపై యుద్దం అంటూ చెలరేగిపోయింది అమెరికా.. వారి స్థావరాలపై దాడులకు దిగింది.. చల్లా చెదురైన ఈ మూకలే ఇప్పుడు ప్రపంచ దేశాలపై పడ్డాయి.. చంపిన కొద్దీ పుట్టుకొస్తున్నాయీ పాములు.. నిన్న అల్ ఖైదా, ఇవాళ ఐఎస్ఐఎస్.. రేపు మరో సంస్థ ఏదైనా రావచ్చు.. మన దేశం విషయానికి వస్తే ఓటు బ్యాంకు రాజకీయాలు ఉగ్రవాదులకు వరంగా మారాయి.. సమస్యను మతం కోణంలో చూస్తూ, టాడా, పోటా వంటి కఠిన చట్టాలను నీరు గారుస్తున్నాం.. మన దేశంలో ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్న పాకిస్తాన్ కు సాయం చేస్తున్నది ఎవరు?.. సోవియట్ శిబిరాన్ని వదిలి, అమెరికా పంచన చేరితే సమస్య పరిష్కారం కాదు.. మన దేశం స్వతంత్ర శక్తిగా ఎదగాలి.. హనుమంతునిలా మన శక్తిని మనం గుర్తించక పోవడమే అసలు సమస్య.. ఆలోచించండి..

Saturday, November 14, 2015

నవంబర్ 14నే బాలల దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి?

నవంబర్ 14వ తేదీని చాలా మంది అంతర్జాతీయ బాలల దినోత్సవం అని భ్రమ పడుతున్నారు.. వాస్తవం ఏమిటంటే నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకునే సాంప్రదాయం మన దేశంలో మాత్రమే ఉంది.. బాలల దినోత్సవాన్ని ఒక్కో దేశంలో ఒక్కో తేదీన జరుపుకుంటారు. ప్రపంచంలోని 47 దేశాలు జూన్ 1, 24 దేశాలు నవంబర్ 20వ తేదీన బాలల దినోత్సవాన్ని నిర్వహించుకుంటాయి.. జూన్ 1వ తేదీన బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా పాటిస్తారు.. ఐతే ఐక్య రాజ్య సమితి నవంబర్ 20వ తేదీని అంతర్జాతీయ బాలల దినోత్సవంగా ప్రకటించింది.. అమెరికాలో మాత్రం జూన్ రెండో ఆదివారం ఈ ఉత్సవం జరుపుకుంటుంది.. 

Thursday, November 12, 2015

కెంపెగౌడ జోలికి వెళ్లి భంగపడ్డ కర్నాడ్

హిరియ కెంపెగౌడ (క్రీ.శ.1510-1569) యలహంకనాడు పాలకుడు.. శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో విజయనగర సామ్రాజ్య సామంతునిగా పని చేశారు. కెంపెగౌడ 1537సం.లో బెంగళూరు నగర నిర్మాణానికి పునాది వేశారు. విద్యావంతుడైన, సమర్ధపాలకుడిగా పేరు తెచ్చుకున్న కెంపెగౌడ అంటే కన్నడ ప్రజలు ఎంతో అభిమానిస్తారు.. బెంగళూరు విమానాశ్రయానికి ఆయన పేరే ఉంది.. కెంపెగౌడ పేరు తొలగించి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని గిరీష్ కర్నాడ్ సూచిస్తున్నారు.. దీంతో అన్ని వర్గాల ప్రజలు ఒక్కసారిగా ఆయనపై మండి పడ్డారు.. కొందరైతే బెదిరించారు.. ఆందోళనకు గురైన గిరీష్ కర్నాడ్, తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పుకోక తప్పలేదు.. చేతుల కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే..

సీఎం సిద్దూకి ఏమైంది?

మొన్న గోమాంసం తినాలనిపిస్తుందని ప్రకటించాడు.. నిన్న టిప్పు సుల్తాన్ జయంతి అంటాడు.. ఏమైంది సిద్దూకు?..  సిద్ద రామయ్యకు ఏది తినాలనిస్తే అది తినొచ్చు.. ఎముకల గూడు మెడలో వేసుకొని తిరగొచ్చు.. టప్పుసుల్తాన్ ఫోటోను ఇంట్లో పెట్టుకొని పూజించుకోవచ్చు.. కానీ మతాల మధ్య చిచ్చుపెట్టడం.. ప్రజలను రెచ్చగొట్టడం ఎందుకు?.. బాధ్యత గల పదవిలో ఉండి అసహనంగా ప్రవర్తిస్తున్న కర్ణాటక సీఎంను కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు భరిస్తోంది?.. సిద్దూను ఇలాగే వెనకేసుకొస్తే, కన్నడ ప్రజలు మరోసారి ఆ పార్టీకి బుద్ది చెప్పుతారు..

Tuesday, November 10, 2015

దీపం జ్యోతి పరబ్రహ్మం..

దీపారాధన మన సంస్కృతిలోని విశిష్ట సాంప్రదాయం.. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వత మోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే..అంటూ ప్రార్ధిస్తాం.. ప్రతి రోజూ భగవంతుని ముందు దీపం వెలిగిస్తాం.. మరి దీపావళి నాడు వెలిగించే దీపాల ప్రత్యేకత ఏమిటి?..
చీకటి దారిద్రం, అజ్ఞానానికి.. వెలుగు సందప, జ్ఞానానికి చిహ్నం.. అంధకారంలోంచి వెలుగులోకి ప్రదేశించడానికి నిదర్శనంగా దీపావళిని జరుపుకుంటాం.. దీపం త్రిమూర్తి స్వరూపం.. ఎరుపు బ్రహ్మను, నీలం విష్ణువును, తెలుపు శివున్ని సూచిస్తుంది.. మూడు వత్తుల దీపం ముల్లోకాల్లోని అంధకారాన్ని పారద్రోలి మన ఇంటిని లక్ష్మీ నిలయంగా మారుస్తుంది..
దీపావళికి పౌరాణిక, చారిత్రిక విశిష్టత కూడా ఉంది.. లోక కంఠకుడైన నరకాసురున్ని శ్రీకృష్ణ పరమాత్ముడు సహరించిన సందర్భంగా ప్రజలంతా దీపాలు వెలిగించారు.. అలా దీపావళి జరుపుకోవడం ప్రారంభించారు. అంతకు ముందు త్రేతాయుగంలో రావణున్ని వధించిన శ్రీరామ చంద్రుడు సీతా సమేతుడై అయోధ్యలోకి ప్రవేశించింది ఇదే రోజున.. అయోధ్య వాసులంతా దీపాలు వెలిగించి స్వాగతం పలికారు.. పాండవులు దీపావళి రోజునే అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని హస్తినాపురంలోకి ప్రవేశించారు.. వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి పంపింది కూడా ఇదే రోజున..
ఇక చరిత్రలో గమనిస్తే విక్రమాధిత్యుడు సింహాసనం అధిష్టించింది దీపావళి నాడే.. అలాగే తొలి తెలుగు రాజు శాలివాహనుడు విక్రమార్కున్ని ఓడించి సింహాసం అధిష్టించింది కూడా దీపావళి రోజునే.. జైనులు, సిక్కులకు కూడా దీపావళి పవిత్రమైన రోజు..

దీపావళి ఐదు రోజుల పండుగ.. లక్ష్మీదేవికి పూజలు, నోములు చేస్తాం.. ఈరోజున భక్తి శ్రద్దలు, నియమనిష్టలతో పూజలు  చేస్తే లక్ష్మీ దేవి సిరిసంపదలు ప్రసాదిస్తుంది.. దీపావళి రోజున టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది.. ఇన్ని విశిష్టతలు ఉన్న దీపావళిని మనమంతా ఆనందంగా జరుపుకుందాం.. మీ క్రాంతి దేవ్ మిత్ర.

జాగ్రత్తలు పాటించండి.. ఆనందంగా దీపావళి జరుపుకోండి..

దీపావళి పండుగ నాడు టపాకాయలు కాలుస్తున్నారా?.. సంతోషం.. అయితే ఈ క్రింది సూచనలు పాటించండి.. 

టపాకాయలు కాల్చేటప్పుడు వీలైనంత దూరం ఉండండి.. అంటించిన వెంటనే దూరంగా జరగండి..
అగర్ బత్తీకి బదులు పొడువైన వెదురు బత్తీని మాత్రమే టపాకాయలు కాల్చేందుకు ఉపయోగించండి..
చిచ్చుబుడ్లు, భూచక్రాలతో, రాకెట్లతో సహా ఇతర బాంబులు ఏమీ చేతిలో పట్టుకొని కాల్చకండి..
టపాకాయలు అందించేటప్పుడు వాటిపై మొహాన్ని పెట్టడండి.. వాటి రవ్వలు కళ్లలో పడితే శాశ్వత అంధత్వం వచ్చే ప్రమాదం ఉంది.. చేతిలో బాంబు వెలిగించి పడేసే ప్రయత్నం కూడా ప్రమాదకరమే..
ఒకటికన్నా ఎక్కువ టపాసులు ఒకేసారి కాల్చే ప్రయత్నం చేయకండి.. వత్తి సరిగ్గా తెరిచి అంటించండి. పేలని టపాసులను వదిలేయండి.. మళ్లీ వెలిగించే ప్రయత్నం చేయవద్దు..
ఐదేళ్లలోపు పిల్లలను టపాకాయలకు దూరంగా ఉంచండి.. పిల్లలు టపాకాయలు కాల్చేటప్పుడు దగ్గర ఉండి ఓ కంట కనిపెట్టండి..
టపాకాయలు కాల్చేప్పుడు వదులైన దుస్తులు ధరించకండి.. అంటుకునే ప్రమాదం ఉంది.. 
ఇళ్లలో టపాకాయలు అసలు కాల్చవద్దు. అలాగే వీధుల్లో వాహనాలపై వెళ్లు వారికి టపాకాయలు కాల్చి ఇబ్బంది కలిగించకండి.. వీలైనంత వరకై మైదానాల్లో టపాకాయలు కాల్చండి..
అగ్నిప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా బకెట్లలో నీరు అందుబాటులో పెట్టుకొండి.. అలాగే బర్నాల్ లాంటి ప్రథమ చికిత్స సామాగ్రిని దగ్గర పెట్టుకోండి..
పెద్ద శబ్దాలు వచ్చే బాంబులతో చిన్నారులు, వృద్ధులు, రోగులు ఇబ్బందులు పడతారు.. వీలైనంత వరకూ ధ్వని, వాయు కాలుష్యం లేకుండా చూసుకోండి.. 
లక్ష్మీ దేవితో సహా దేవతా చిత్రాలు ఉన్న టపాసులను కొనుగోలు చేయకండి, కాల్చకండి.. మతపరమైన మనోభావాలను గౌరవించండి..
నాణ్యమైన టపాసులు మాత్రమే కొనుగోలు చేయండి.. 

వీలైనంత వరకూ దీపాలు వెలిగించి పండుగ జరుపుకుంటే చాలు.. టపాకాయలు కొని, కాల్చి డబ్బులు వృధా చేసే బదులు, ఆ సొమ్మును అనాధల సంరక్షణ, పేదల విద్య, వైద్యం తదితర సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం ఉత్తమం..
దీపావళిని భద్రంగా జరుపుకోండి.. ఆనందంగా ఉండండి.. దీపావళి శుభాకాంక్షలతో.. మీ క్రాంతిదేవ్ మిత్ర

Monday, November 9, 2015

శుభాలనిచ్చే ధన త్రయోదశి

ధన త్రయోదశి.. దీపావళికి ముందుగా వస్తుంది.. ఉత్తర భారతంలో ధన్ తెరాస్ పేరుతో ప్రసిద్ది.. ఈ రోజున  బంగారం కొనడం సాంప్రదాయం.. బంగారు వ్యాపారుల పుణ్యమా అని దక్షిణాదికీ ఈ పండుగ వచ్చింది.. వ్యాపారులు  రోజున బంగారం కొనడం శుభం అంటూ తెగ ప్రచారం చేస్తుంటారు.. కానీ కచ్చితంగా కొనాల్సిన అవసరం ఏమీ లేదు.. అప్పులు చేసి బంగారం కొనాల్సిన అవసరం అసలే లేదు.. లక్ష్మీ దేవికి చక్కగా మొక్కుకుంటే చాలు, ఆ తల్లి కరుణా కటాక్షాలు మనపై ఉంటాయి.. అందరికీ ధన్ తెరాస్ శుభాకాంక్షలు..

ఎవరికీ అనుకూలం కాని బీహారీ తీర్పు..

బిహారీ ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా విలక్షణం.. నితిష్ కుమార్ సమర్ధ నాయకత్వంపై వారు మొగ్గు చూపారని ప్రచారం జరుగుతున్నా, అక్కడ కుల, మత ఓట్ల సమీకరణే ప్రధానంగా కనిపిస్తోంది.. మహాకూటమిలోని నితిష్ కుమార్ పార్టీ జేడీయూకు గతంలో కన్నా ఓట్ల శాతం, సీట్ల శాతం తగ్గడమే ఇందుకు ఉదాహరణ.. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ గణనీయంగా సీట్లను సాధించినా, ఓట్ల శాతం తగ్గింది.. అలాగే బీజీపీకి సీట్లు తగ్గినా ఓట్ల శాతం పెరిగింది.. కింగ్ మేకర్ లాలూ వల్ల నితిష్ కష్టాలు ఎదుర్కోక తప్పేట్లు లేదు..
బీజేపీకి స్థానికంగా సమర్ధ నాయకత్వం లేకపోవడం శాపంగా మారింది.. ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందే ప్రకటించి ఉంటే ఫలితాలు మెరుగ్గా ఉండేవి.. మరోవైపు బీజీపీలో శతృఘ్న సిన్హా లాంటి నాయకులు సైందవ పాత్ర పోశించి పార్టీకి నష్టం కలిగించారు. దీనికి తోడు బీజేపీ నేతల అతి వాగాడంబరం కూడా ఇబ్బంది కలిగించింది.. బిహారీలు ఢిల్లీ ఓటర్ల తరహాలోనే కేంద్రంలో మోదీ, స్థానికంగా నితిష్ ఉండాలని భావించారు..
కాంగ్రెస్ పార్టీ గతంలోకన్నా మెరుగ్గా రెండంకెల సీట్లు సాధించినా, అది మహాకూటమి దయాదాక్షిణ్యాల వల్లే.. దీనివల్ల ఆ పార్టీకి బిహార్లో దక్కే దీర్ఘకాల లాభం ఏదీ లేదు.. ఇక ఎంఐఎం ఎన్ని పగల్బాలు పలికినా ఓటర్ల ఆదరణ పొందలేదు.. ఎంఐఎం సఫలం అయ్యుంటే ఆలాభం బీజేపీకే సీట్లు రూపంలో దక్కేది..
సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ బల్ల గుద్ది చెబుతున్నట్లుగా జాతీయ రాజకీయాల ప్రభావం బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఏ మాత్రం కనిపించలేదు..

Thursday, November 5, 2015

ఏమిటీ అసహనం?..

దేశంలో అసహనం పెరిగిపోతోందా?.. ఇదెప్పటి నుండి?.. ప్రధానిగా నరేంద్ర మోదీ అధికారం చేపట్టినప్పటి నుండే ఈ అసహనం మొదలైందా?.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అసహనం లేదా?.. అసహన ఘటనలన్నీ బీజేపీలో జరిగాయా?. కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో అంతా సవ్యంగా ఉందా?.. ఇంతకీ నరేంద్ర మోదీపై వీరికి ఎందుకు అంత అసహనం?.. ఇప్పుడు యాగీ చేస్తున్నా వారంతా కాంగ్రెస్ హయాంలో ఎందుకు నోరు మెదపలేదు?.. అప్పుడు గాఢ నిద్రలో ఉండి ఇప్పుడే నిద్ర లేచారా?.. సోకాల్డ్ మేధావులంతా తమ పురస్కారాలను ఎందుకు తిరిగి ఇచ్చేస్తున్నారు?.. అవార్డులు మాత్రమే ఇచ్చేసి దాని వెంట వచ్చిన నగదు మాత్రం ఎందుకు దాచుకుంటున్నారు?.. ఇంతకీ వీరంతా ఎవరు?.. అవార్డులు ఎలా వచ్చాయి?.. వీరి భావజాలం ఏమిటి?.. ఎవరు ప్రేరేపిస్తున్నారు?.. వీరికి ఎందుకింత పబ్లిసిటీ కల్పిస్తున్నారు?.. అసహన ప్రచారం వెనుక కుట్ర కోణం ఉందా?..

ఈ అంశాలన్నింటిపై సమగ్ర విచారణ జరగాలి.. ఈ అసహన దుమారం వెనుక అసలు వాస్తవాలు ఏమిటో నిగ్గు తేలాల్సిందే.. 

Sunday, November 1, 2015

తెగులు సోకిన తెలుగు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తర్వాత ఆంధ్రప్రదేశ్ అవతరణ దినమైన నవంబర్ 1వ తేదీ ప్రాధాన్యత కోల్పోయింది.. అన్నదమ్ములైన తెలంగాణ, ఆంథ్రప్రదేశ్ లు వేరు కుంపట్లు పెట్టుకున్నందుకు ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికీ అభ్యంతరాలు లేవు.. కానీ మన కన్న తల్లి అయిన తెలుగును అనాధగా మార్చేస్తున్నాం.. 01.11.2002నాడు ఆంధ్రజ్యోతిలో నేను రాసిన వ్యాసమిది.. నాటికి, నేటికి తెలుగు భాష దుస్థితి ఏమాత్రం మారకపోగా మరింత దిగజారింది..

Saturday, October 31, 2015

ఆధునిక భారత నిర్మాత

బ్రిటిష్ వారు దేశానికి స్వాతంత్ర్యం ఇస్తూ పాకిస్తాన్ చిచ్చు పెట్టారు.. అంతే కాదు 552 సంస్థానాలకు భారత్ లేదా పాకిస్తాన్లో చేరే స్వేచ్ఛ ఇచ్చారు.. భారత దేశం అఖండంగా ఉండొద్దని, కుక్కలు చింపిన విస్తరిలా ఉండాలని వారు కుట్ర పన్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో స్వతంత్ర భారత ప్రథమ హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు సర్ధార్ వల్లభాయ్ పటేల్..
పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశ భవిష్యత్తుకు ఏర్పడే ముప్పును అంఛనా వేశారు పటేల్.. వెంటనే సంస్థానాలన్నింటినీ భారత దేశంలో విలీనం అయ్యేందుకు ఒప్పించారు.. తాము భారత దేశంలో చేరకుండా స్వతంత్రంగా ఉంటామని చెబుతూనే పాకిస్తాన్ వత్తాసుతో కుట్రలు పన్నుకున్న హైదరాబాద్, జునాగఢ్ సంస్థానాలపై దండోపాయం ప్రయోగించి దారికి తెచ్చారు పటేల్.. అయితే జమ్మూ కాశ్మీర్ విషయంలో ప్రధాని నెహ్రూ స్వయంగా జోక్యం చేసుకోవడంతో ఆ సమస్య ఇప్పటికీ రావణ కాష్టంలా రగులుతూనే ఉంది..
సర్ధార్ వల్లభాయ్ పటేల్ ముందు చూపు, దృఢ వైఖరి వల్లే భారత దేశాన్ని మనం ఈ రోజున నిండుగా చూడగలుగుతున్నాం.. అందుకే పటేల్ ఉక్కు మనిషిగా దేశ ప్రజల మన్ననలు అందుకుంటూ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచారు..
నిజానికి స్వతంత్ర్య భారత దేశానికి సర్ధార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వం వహించాలని దేశ ప్రజలు కోరుకున్నారు.. కాంగ్రెస్ పార్టీలో నాయకులు, కార్యకర్తలంతా పటేల్ ప్రధాని కావాలని భావించారు.. కానీ గాంధీజీ నెహ్రూ వైపు మొగ్గు చూపారు.. పటేల్ కేవలం 40 నెలలు హోంమంత్రిగా ఉన్నా అద్భుతాలు చూపించారు.. ఆయనే కనక ప్రధాని అయ్యుంటే చరిత్ర గతి మరోలా ఉండేది.. కాశ్మీర్ సమస్యకు అప్పుడే శాశ్వత పరిష్కారం దొరికి ఉండేది.. పాకిస్తాన్తో సుధీర్ఘ శతృత్వం కొనసాగేది కాదు.. పాకిస్తాన్, చైనా యుద్ధాలు వచ్చి ఉండేవే కాదు.. భారత్ ఏనాడో శక్తి వంతమైన దేశంగా రూపొంది ఉండేదని భావించడంలో అనుమానమే లేదు..

నేడు (అక్టోబర్ 31) సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతి ఐక్యతా దినోత్సవం పాటిస్తున్నాం.. దేశ సమగ్రత, ఐక్యత, భద్రత కోసం చిత్తశుద్దితో పని చేస్తూ, పటేల్ ఆశయాల సాధన కోసం మనం ప్రతినబూనాల్సిన తరుణమిది..

Friday, October 30, 2015

పందిని మార్కు పాలు

దక్షిణాదికి చెందిన ఓ ముఖ్యమంత్రి హఠాత్తుగా గోమాంస భక్షణపై మక్కువ పెంచుకున్నారు.. ఇందుకు నిరసనగా ఆ రాష్ట్ర పాడి పరిశ్రమకు చెందిన చిహ్నంలో ఉన్న గోమాత అతన్ని అసహ్యించుకొని వాకౌట్ చేసింది.. దీంతో సదరు సీఎంగారు పందిని మార్కు పాలనే తాగుతున్నారు.. ఎవరి తిండి వారిష్టం.. అంత వరకూ అభ్యంతరం లేదు.. కానీ బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తులు మెజారిటీ ప్రజల మనోభావాలను కించ పరచడం ఎంత వరకూ సమంజనం?.. అందుకే నా ఈ వినూత్న నిరసన..

Thursday, October 29, 2015

నన్ను మాత్రం పీక్కు తినకు..

నా రుచి నా ఇష్టం.. నాకు ఇష్టమైన తిండి నేను తింటాను.. నా మెనూకు, ఆహార స్వేచ్ఛకు అడ్డు చెప్పేందుకు నీవెవరు?.. అంటూ గయ్యిన లేచాడు నా మిత్రుడు..
తిను నాయనా.. నీకు ఇష్టమైనవే తిను.. లోకో భిన్న రుచి.. కానీ నర మాంస భక్షకునిగా మారి నన్ను మాత్రం పీక్కు తినకు..’ అంటూ శాంతింపజేశానతన్ని.. 

Friday, October 2, 2015

మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినోత్సవాల సందర్భంగా వారిని స్మరించుకుందాం.. ఈ మహనీయుల స్పూర్తిని కొనసాగిద్దాం..

Thursday, September 17, 2015

పటేల్ గారిని స్మరించుకోవడం మన విధి..

హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో సంపూర్ణంగా విలీనమై ఇక్కడి ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు.. ఇందుకు కారణం ఎవరో తెలుసా?.. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్..
స్వతంత్ర భారత దేశ తొలి హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సర్ధార్ పటేల్, ముందుగా స్వదేశీ సంస్థానాలపై దృష్టి సారించారు.. బ్రిటిష్ వారు పోతూ పోతూ మెలిక పెట్టి పోయారు.. సంస్థానాలు భారత్, పాకిస్తాన్ ఎందులైనా విలీనం కావచ్చట.. లేదా స్వతంత్రంగా ఉండొచ్చట.. ఇది దేశ సమగ్రతకు మప్పు అని గ్రహించారు పటేల్.. ఐదు వందల పైచిలుకు సంస్థానాలను విలీనం చేయడలో విజయం సాధించారు.. ఈ క్రమంలో మొండి కేసిన హైదరాబాద్, జునాగడ్ లను సైనిక చర్య ద్వారా దారికి తెచ్చారు..
హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ ప్రాంతం కాలక్రమంలో ఆంధ్ర్రప్రదేశ్ లో కనిసింది.. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలోగా ఆవిర్భవించింది.. కానీ ఈ పరిణామాలన్నింటికీ మూలం ఉక్కు మనిషి సర్ధార్ పటేల్.. పటేల్ ఆ రోజున హైదరాబాద్ సమస్యను ప్రధాని నెహ్రూకు అప్పగించి ఉంటే?.. జమ్మూ కాశ్మీర్ సమస్యలా ఈనాటికీ రగులుతూనే ఉండేది.. హైదరాబాద్ విమోజన సందర్భంగా ఉక్కు మనిషిని స్మరించుకోవడం తెలంగాణ ప్రజల విధి..