Friday, December 4, 2015

ఔట్ లుక్.. జూట్ లుక్ అయింది..

నిజం నిద్రలేచేలోపు అబద్దం లోకం చుట్టి వస్తుందంటారు.. ఔట్ లుక్ పత్రిక బాధ్యతారహిత వ్యవహారం అలాగే ఉంది.. 
దేశానికి 800 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ రూపంలో హిందూ పాలకుడు వచ్చారని హోంమంత్రి రాజనాథ్ సింగ్ అన్నట్లుగా ఔట్ టుక్ పత్రిక రాసింది.. ఈ అంశాన్ని సీపీఎం ఎంపీ మహ్మద్ సలీం పార్లమెంట్ లో ప్రస్థావించగా, తాను అలా అన్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని రాజనాథ్ సవాలు విసిరారు.. దీంతో ఔట్ లుక్ నాలిక కరుచుకుంది.. ఈ మాటలు రాజనాథ్ అనలేదని, అశోక్ సింఘాల్ అన్నారని ఇప్పుడు బొంకుతోంది.. అంటే ఇప్పుడు దివంగత సింఘాల్జీ వచ్చి వివరణ ఇచ్చుకోవాలా.. 
చిన్న చిన్న ఘటనలను చిలువలు పలువలుగా చేసి 'అసహన మంటలు' రాజేసి చలి కాచుకోవడం సమంజసమేనా?

No comments:

Post a Comment