Monday, November 27, 2017

వేదాల మీద విషం కక్కుడు ఎందుకు?

వేదాలు కర్ణకఠోరం.. ఎవరు వింటారు వాటిని.. కంపు.. అన్ హ్యూమన్.. న్యూసెన్స్.. ఇళ్ల మధ్య వేద పాఠశాల పెడతారా?.. లొల్లితో సాటి మనుషులను బాధ పెడతారా?.. ఇంగిత గ్నానం ఉందా?.. అడవుల్లో పెట్టుకొని నేర్పించవచ్చు కాదా.. తక్షణం ఖాళీ చేయడండి.. లేకపోతే ఏం చేయాలో అది చేస్తా.. వేదాలు నేర్చుకునే ఆ విద్యార్థులను ఏట్లోకి పంపండి..
ఒక రాజకీయ పార్టీకి చెందిన అడ్డ గాడిద కూతలు ఇవి.. వేద పాఠశాల నిర్వాహకులను ఫోన్లో అనరాని మాటలు అని, బండ బూతులతో బెదిరించాడు.. ధర్మ రక్షణ కోసం వేదాలను భావితరాలకు అందించడమే ఆ పండితుడు చేసిన నేరం మరి..
మీ పెళ్లిళ్లు వేద మంత్రాల సాక్షిగా జరగాలి.. ఇంట్లో శుభ కార్యాలకు, గుడిలో అర్చనలు, సన్మానాలు, సత్కారాలకు వేద పండితుల ప్రార్ధనలు, ఆశీస్సులు కావాలి.. కానీ వేద పాఠశాలు అక్కర లేదు.. ఇళ్ల మధ్య వేద పాఠశాలలు ఉండరాదు..
అన్యమతాల ప్రార్ధనాలయాలు, విద్యాసంస్థలు మాత్రం నిరభ్యంతరం ఉండొచ్చా?.. వాటి వల్ల ఎలాంటి న్యూసెన్స్ లేదా?..
వాహ్వా.. క్యాబాత్ హైజీ.. తాలీ భజావ్.. సెక్యులరిజమా వర్ధిల్లు.. సనాతన ధర్మం, సంస్కృతి ఇంతగా హేళనలకు గురవుతున్నా, భరిస్తున్న మొద్దు చర్మం హిందువులు ఉన్నంత కాలం ఈ దేశంలో ఇలాంటి కూతలు భరించాల్సిందే.. నపుంసక రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాలతో స్వధర్మాన్నే నిర్వీర్యం చేస్తుంటే ప్రేక్షక పాత్ర పోషించాల్సిందే.. ఎందుకంటే ఎదిరిస్తే కమ్యూనల్ అవుతాం..

Sunday, November 19, 2017

ఇది ఇవాంక కథ కాదు

అనగనగా ఒక మహారాజు. ఆయనకు ఒక కూతురు పుట్టింది. ఆమె భవిష్యత్తులో బిచ్చగాన్ని పెళ్లి చేసుకుంటుందని జ్యోతిష్యుడు చెప్పాడు. దీంతో అప్రమత్తమైన మహారాజు ముందు జాగ్రత్తగా తన రాజ్యంలో యాచక వృత్తిని నిషేధించారు. బిచ్చగాళ్లను అరెస్ట్ చేశారు. శిక్షలకు భయపడ్డ కొందరు దేశం వదిలి పారిపోయాడు. 
కొన్నేళ్ళకు మహారాజు గారి ముద్దుల రాకుమారి లోక సంచారం తలపెట్టింది. ఎందుకైనా మంచిదని మహారాజు గారు రాకుమారి వెళ్లే దేశాలకు లేఖలు పంపారు. ' మీ దేశానికి వస్తున్న నా కూతురుకు బిచ్చగాళ్లు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోగలరు..' అని ఉందా ఉత్తరాల్లో..
ఈ లేఖను చూసిన దేశాల పాలకులు వెంటనే అప్రమత్తమయ్యారు.. ఎంతైనా అవతలి మహారాజు బలవంతుడు. ఆయన కోరికను మన్నించి సామరస్యంగా వ్యవహరిస్తే మనకే ప్రయోజనం కదా అనుకున్నారు. మొత్తానికి దేశాల్లో 'ఆపరేషన్ యాచక' అమలైంది..ఇదఇమహారాజు గారి కూతురు వెళ్లిన ఒక దేశంలో పొరపాటున ఆమెకు ఓ బిచ్చగాడు కనిపించాడు. వాడు అప్పుడే ఊరు నుంచి రాజధానికి వచ్చాడు. ఆపరేషన్ యాచక అమలులో ఉన్న సంగతి తెలియదట.
తర్వాత ఏమైంది?..
సినిమాలు చూడలేదా?.. షరా మాములే.. రాకుమారి వాడితో లవ్వులో పడింది.. కొన్ని రీళ్ల కథ నడిచాక కైమాక్స్ లో మహారాజు గారు బిచ్చగాడికి తన కూతురుని ఇచ్చి పెళ్లి చేశాడు.
గమనిక: ఇవాంక హైదరాబాద్ పర్యటనకు, ఈ కథకు ఎలాంటి సంబంధం లేదు.

(15.11.2017)

Wednesday, November 8, 2017

వీరితోనే మనకు ముప్పు

ఇటీవలి కాలంలో కొందరు వ్యక్తులు జన్మనిచ్చిన భారత దేశంపై, జాతీయ గీతంపై, హిందూ మతంపై అదే పనిగా విషం కక్కుతున్నారు.. అదే సమయంలో పార్లమెంట్ మీద దాడి చేసిన, ముంబై బాంబు పేలుళ్ల దోషులకు మరణ శిక్ష వేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలకు దిగింది ఈ బ్యాచే.. కశ్మీరీ వేర్పాటు వాదులకు, తీవ్రవాదులకు, విచ్ఛిన్నకర శక్తులకు బాహటంగా మద్దతు ఇస్తున్నారు.. బీఫ్ ఫెస్టివల్స్, కిస్ ఆఫ్ లవ్, లవ్ జిహాదీ గాళ్లకు వంతపాడుతున్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి ఆనందిస్తున్నారు.. భారత దేశ సార్వభౌమత్వం, రాజ్యాంగంపై ఏమాత్రం నమ్మకం లేదు వీరికి.. కానీ వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు.. ఎందుకు ఇంత అసహనం వీరికి?
అసలు వీరంతా ఎవరు? ఆరా తీస్తే విచిత్రమైన వ్యక్తిత్వాలు కనిపిస్తున్నాయి కొందరివి.. ఈ జాబితాలో స్వయం ప్రకటిత మేధావులు (మేతావులు), కవులు - కళాకారులు - ప్రజాసంఘాలు - విద్యావంతులం అని గప్పాలు కొట్టుకునేవారు, చట్ట విరుద్దంగా హిందూ మత కులాల రిజర్వేషన్లు పొందిన అన్య మతస్తులు, మిషనరీలు-విదేశీ నిధులతో పని చేస్తున్న సోకాల్డ్ ఎన్జీవోలు.. రకరకాల సంస్థలు, బ్యానర్లు, లెటర్ ప్యాడ్ల మీద పని చేస్తున్న ఈ పేపర్ టైగర్లన్నీ ఒకే లక్ష్యంతో పని చేస్తున్నాయి. అన్నట్లు ఈ జాబితాలో ఇటీవల కొందరు సినీ నటులు కూడా చేరి తమాషా రక్తి కట్టిస్తున్నారు.
వీరిలో కొందరి వ్యక్తిగత జీవితాలు పరమ అసహ్యం.. విలువలు, సామాజిక కట్టుబాట్లు గాలికి వదిలేసి విచ్ఛల విడిగా జీవిస్తున్నారు. అదేమంటే వ్యక్తిగతం అని నంగనాచి కబుర్లు చెబుతారు. పైకి మాత్రం సిద్దాంతాలు, నీతులు వళ్లిస్తారు.. మైకులు పట్టుకొని స్పీచులు దంచుతారు..
ఇలాంటి వారికి కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు ఇస్తున్నాయి. ఈ భిన్న ధృవ పార్టీలకు ఏ సైద్ధాంతిక ప్రాతిపదికన అవగాహన కుదిరిందో, ఎలా డీఎన్ఏ మ్యాచ్ అయిందో దేవుడెరుగు.. సారీ వీరు దేవున్ని నమ్ముతారో తేదో తెలియదు.. నమ్మినా ఏ దేవున్ని నమ్ముతారో అసలు తెలియదు..
నాకు అర్థం అయింది ఏమిటంటే.. వీరంతా మోదీ ఫోబియాతో బాధ పడుతున్నారు.. అయ్యా.. మీకు మోదీ మీద, బీజేపీల మీద కోసం ఉంటే రాజకీయంగా తీర్చుకోండి.. అంతే కానీ దీన్ని అడ్డు పెట్టుకొని ఈ దేశం, మెజారిటీ ప్రజల విశ్వాసాలతో మాత్రం ఆటలాడుకోండి.. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి సమాజంలో విధ్వేషం రగిలించే పనులు చేయకండి.. మేం ఇలాగే చేస్తాం (కుక్క తోక వంకర) అంటారా? మూల్యం మీరే చల్లించుకోవాల్సింది ఉంటుంది.. ఈ దేశ ప్రజల సహనానికి కూడా హద్దు ఉంటుందని గుర్తుంచుకోండి..
ఇది చదివి ఎవరైనా భుజాలు తడుముకుంటున్నారా?.. అందుకు నేను బాధ్యున్ని కాదు.. అది వారి కర్మ..

నల్లధనంపై చారిత్రక పోరాటం

ప్రమాదానికి గురైన ఒక వ్యక్తి పట్టించుకునే దిక్కులేక అవిటివాడై చేతి కర్రలతో కుంటుతున్నాడు.. ఒక డాక్టర్ అతని అవస్థను గుర్తించి శస్త్ర చికిత్స చేశాడు.. ఆ వ్యక్తి కోలుకుని నడవాలంటే కొన్ని వారాలు, నెలలు పడుతుంది.. ఇదే పరిస్థితి దేశ ఆర్థిక రంగానికి వస్తే..
నల్లధనంపై పోరులో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ₹.500, 1000 నోట్లను రద్దు (Demonetisation) చేసి ఏడాది అవుతోంది.. దేశ ఆర్థిక చరిత్రలో ఇది సాహసోపేతమైన నిర్ణయం.. దశాబ్దాలుగా పేరుకు పోయిన నల్లధనం ఒక్కసారిగా మాయం అవుతుంది అని ఎవరూ భావించలేరు. కానీ ఈ దిశగా ఒక అడుగు పడింది..
పురాతనకాలంలో మంచి పని చేపట్టినప్పుడు రాక్షసులు అడుగడుగునా అడ్డుపడేవారు.. ఇప్పుడు మోదీజీ చేపట్టిన యజ్ఞానికి కూడా ఇదే పరిస్థితి.. ప్రశంసించడం ఇష్టం లేకుంటే గమ్మున ఉండి ఫలితం ఎలా ఉంటుందో వేచి చూసి స్పందించాలి.. కానీ ఆరంభం నుంచే తుమ్మలు మొదలయ్యాయి. ఈ వ్యక్తులు, శక్తుల దుష్ప్రచారం కారణంగా ప్రజల్లో ఆందోళన మొదలైంది. అవసరం లేకున్నా ఏటీఎంల ముందు గంటలు, రోజుల తరబడి క్యూలు కట్టించారు.. ఫలితంగా బ్యాంకుల్లో కరెన్సీ చెలామనికి ఇబ్బందులు కలిపించారు..
నిజానికి పెద్దనోట్ల రద్దువల్ల సామాన్యుని పెద్దగా ఇబ్బంది వచ్చింది ఏమీ లేదు.. పెద్ద ఎత్తున నగదు నిల్వలు ఉన్నవారే కష్టాలకు గురయ్యారు.. అది సహజం..
ఒక సాహసోపేతమైన భారీ కార్యక్రమం చేపట్టినప్పుడు ఫలితాలు అంత తొందరగా కనిపిస్తాయని ఆశించడం మూర్ఖత్వం.. ఉదాహరణకు మనం ఏదైనా వ్యాపారం మొదలు పెట్టగానే తక్షణ లాభాలు వచ్చేస్తాయా?.. ప్రమాదానికి గురైన రోగి చికిత్స జరిగిన వెంటనే లేచి పరుగెడతాడా?.. కొన్ని వారాలు, నెలలు కూడా పట్టవచ్చు.. మరి దశాబ్దాలుగా రోగగ్రస్థమైన దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగే చికిత్సకు ఇంత తక్కువ వ్యవధిలో జడ్జిమెంట్ అవసరమా?..
ఒక చారిత్రాత్మక నిర్ణయానికి దేశ ప్రజలమంతా అండగా ఉందాం.. నల్లధనంపై పోరులో మనవంతు పాత్రను విజయవంతం చేద్దాం.. జై స్వచ్ఛ్ భారత్..

Friday, November 3, 2017

హిందువులపై ద్వేషం ఎందుకయ్యా నీకు?

హిందూ తీవ్రవాదం లేదని చెప్పలేం.. ఎక్కడైనా ఓ హిందూ తీవ్రవాదిని చూపించండనే సవాలును ఇకపై వారు (హిందువులు) విసరలేరు.. ఆ స్థాయిలో వారి వర్గంలోనే తీవ్రవాదం వ్యాపించింది.. అంటున్నాడాయన..
తమిళనాట కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి, ముఖ్యమంత్రినైపోవాలని పగటి కలలు కంటున్నాడాయన.. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు హఠాత్తుగా రాజకీయాల్లోకి వచ్చేశాను.. పార్టీ పెడతాను.. అంటూ హడావుడిగా రోజుకో ప్రకటన చేస్తున్నాడు. ఏదేదో వాగేస్తూ నిత్యం వార్తల్లో నిలిచి పబ్లిసిటీ పొందాలని ప్రయత్నిస్తున్నాడు కమల్ హాసన్.. సత్యమేవ జయతే అన్న నినాదంపై హిందువులు విశ్వాసం కోల్పోయి, హింసా మార్గం ఎంచుకున్నారట.. ఇలా కమల్ తాను హైందవేతరున్ని అన్నట్లుగా వికట హాసం చేశాడు ఆనంద వికటన్లో.. ఓకే.. ఇలాగైనా హిందువును కాను అని ఒప్పుకున్నాడు..  
క‌మ‌ల్ ముందు తానేమీ మాట్లాడుతున్నాడో ఆత్మ విమ‌ర్శ చేసుకుంటే మంచిది.. ఆయ‌న చెబుతున్న‌హిందూ తీవ్రవాదం ఎక్క‌డ ఉంది? ఆ తీవ్రవాద సంస్థ‌లు ఏమిటో చెబితే బాగుంటుంది.. ఆధారాలు ఉంటే చట్టపరంగా పోరాటం చేయొచ్చు.. గాలిలో రాయి విసిరి ఎక్క‌డో త‌గులుతుంది క‌దా అనే ఎత్తుగ‌డ రాజ‌కీయంగా ఆయ‌న‌కే బెడిసికొడుతుంద‌ని అర్థం చేసుకోవాలి..
తీవ్రవాద కలాపాలతో దేశ ద్రోహం చేయడానికి హిందువులు ఏ దేశం నుంచో ఊడి పడలేదు.. ఈ దేశమే వారిది.. యే హిందుస్తాన్ హై.. హిందువోంకా హిందూ దేశ్.. ఈ దేశం అసలు పేరు హిందుస్తాన్.. సారే సహాజే అచ్చా హిందూ సితాహ్ హమారా అని ఎందుకు పాడుతారో తెలుసా? తెలియకుంటే చరిత్ర పుస్తకాలు చదువుకో..
హిందూ తీవ్రవాదాన్ని అరిక‌ట్ట‌డంలో కేర‌ళ ముఖ్య‌మంత్రి స‌మ‌ర్ధ‌వంతంగా ప‌ని చేస్తోంద‌ని కితాబిస్తున్నాడు క‌మ‌ల్ హాస‌న్‌.. అయ్యా.. (ప‌ర‌)లోకనాయ‌కా! కేర‌ళ‌లో జ‌రుగుతున్న వామ‌ప‌క్ష రాజ‌కీయ‌ హింసోన్మాదం నీకు క‌నిపించ‌డం లేదా?.. అక్క‌డి వామ‌ప‌క్ష ప్ర‌భుత్వం వందలాది మంది బీజేపీ, ఆరెస్సెస్ కార్య‌క‌ర్త‌ల‌ను హతమారుస్తున్న వైనంపై దేశ వ్యాప్త చ‌ర్చ నీ దృష్టికి రాలేదా?.. స్వ‌యంగా నీవు కలిసి వచ్చిన పినరయి విజయన్ సైతం హ‌త్యారోప‌ణ‌ ఎదుర్కోవడం నీకు తెలియ‌క‌పోతే తెలుసుకో.. కేర‌ళ ల‌వ్ జిహాదీ ఘ‌ట‌న‌లు నీకు చూడ ముచ్చ‌ట‌గా క‌నిపిస్తున్నాయా?.. త‌మిళ‌నాడులో హిందూ అతివాదం విస్త‌రించింద‌ని బాధ ప‌డుతున్నావుగా క‌మ‌ల్.. ఇలాంటి వాఖ్య‌లు చేస్తున్న నీకు త‌మిళ‌నాడు హిందూ ఓట‌ర్లు వాత పెట్ట‌డం ఖాయం..

క‌మ‌ల్ హాస‌న్ మాన‌సిక స్థితి బాగా లేద‌ని  అంటున్నారు కొంద‌రు నాయ‌కులు.. నేను ఈ వ్యాఖ్య‌ల‌తో ఏకీభ‌వించ‌డం లేదు.. ఎందుకంటే క‌మ‌ల్ (అతి) తెలివైన వాడిన‌ని క‌ల‌లు కంటూ ఏదేదో మాట్లాడేస్తున్నాడు.. ఎంతైనా రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాడు క‌దా?.. ఈయ‌నా ఒక సూడో సెక్యుల‌ర్ - పెక్యుల‌ర్ నాయ‌కుడు అని ముందుగానే తేలిపోయింది. దిగితే కానీ లోతు తెలియదు.. దిగాడుగా రాజకీయాల్లోకి.. ఇక‌ మూల్యం చెల్లించుకోడానికి ఆయ‌న సిద్దంగా ఉండాలి..  

దేశభక్తికి అర్థం మారిపోతోందా?

దేశమును ద్వేషించుమన్నా
చెడు యన్నది పెంచుమన్నా 
మంచి మాటలు కట్టిపెట్టోయ్
గట్టి కీడు తలపెట్టవోయి.. 
..ఇకపై మనతో ఇలా పాడించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.. 
దేశభక్తిని ప్రదర్శించాల్సిన అవసరం లేదు అంటారు కొందరు అడ్డ గాడిదలు.. వారు మున్ముందు మనకు బోధించే సుభాషితాలు ఇలా ఉండబోతున్నాయి..
' తల్లిదండ్రులను, గురువులను గౌరవించమని చెప్పకండి.. నైతిక విలువలు అనవసరం.. విచ్చల విడిగా జీవించండి.. మందు కొట్టినా, డ్రగ్స్ తీసుకున్నా, వ్యభిచరించినా తప్పులేదు.. తోటివారిని ద్వేషించండి.. '
ఇవాళ దేశభక్తిని, జాతీయ గీతాన్ని వద్దంటున్నవాడు రేపు ఈ దేశమే అక్కరలేదంటాడు..
ఇలాంటి వారి కారణంగానే కదా మన దేశంలో గజానికో గాంధారి పుత్రుడు పుడుతున్నది?.. కొత్త కొత్త వాదాలను సృష్టిస్తూ దేశంలోని ప్రాంతాలు, భాషలు, మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతున్న గుంట నక్కలను ఓ కంట కనిపెట్టండి.. ప్రజల మనోభావాలు, సనాతన ధర్మ సంస్కృతి సంప్రదాయాల మీద జరుగుతున్న దాడిని అర్థం చేసుకోండి..
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశ ద్రోహులు, ఉగ్రవాదులకు మద్దతు పలుకుతున్న పార్టీలకు బుద్ది చెప్పకపోతే మన దేశ అస్థిత్వానికే ప్రమాదం.. ప్రతి భారతీయుడు జాగరుకుడై ఉండాల్సిన సమయం ఇది..
వీరందరినీ తన్ని తరిమేద్దాం మన భారతదేశం నుంచి.. (27.10.2017)