Wednesday, October 31, 2012

ఉక్కు మనిషి,  సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి నేడు..హైదరాబాద్ తో పటు ఐదు వందలకు పైగా సంస్థానాలను భారత దేశంలో విలీనం చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించిన నవభారత నిర్మాత సర్దార్ పటేల్.. పటేల్ ప్రధాన మంత్రి అయ్యుంటే కాశ్మీర్ తో సహా దేశ సమస్యలు అన్నింటిని సమర్ధంగా పరిష్కరించి ఉండేవారు.. సర్దార్ పటేల్జిని స్మరించుకోవడం భారతీయులుగా మన విధి..

Friday, October 26, 2012

కమలం బురద తొలగేనా?




1980లో భారతీయ జనతా పార్టీ (గతంలో జన సంఘ్) ఏర్పడ్డప్పుడు బురదలో పుట్టిన పార్టీ అని ప్రత్యర్థులు ఎద్దేవా చేసారు.. ఎందుకంటే కమలం ఆ పార్టీ చిహ్నం.. కమలం బురదలో పుడుతుంది.. అప్పుడు అటల్ బిహారి వాజపేయి ఒక మాట చెప్పారు.. 'కమలం బురదలో బుట్టిన స్వచంగా ఉంటుంది.. అలాగే బురదగా మారిన రాజకీయాల్లో బి.జె.పి. తన ఆదర్శాలతో స్వచ్చమైన రాజకీయ పార్టీగా కొనసాగుతుంది..' 
కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి? కర్ణాటకలో అవినీతి అనే పందిలా పొర్లాడిన యడ్యురప్ప కారణంగా బిజెపి ప్రతిష్టకు మచ్చ పడింది.. అప్పను ఆలస్యంగా అయిన ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించినా, కొత్త పార్టీ పెట్టేందుకు సిద్దమై పక్కలో బల్లెంగా మారాడు.. కర్ణాటక యవ్వారం ఇలా ఉంటే ఇప్పుడు బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారి గతంలో చేసిన ఘన కార్యాలు బయట పడుతున్నాయి.. అవినీతి, అసమర్థ విధానాలతో కాంగ్రెస్ నేతృత్వ యు.పి.ఎ. ప్రభుత్వ ప్రతిష్ట దిగజారడంతో 2014లో అధికారం తమదే అని బి.జె.పి. ధీమాగా ఉంది.. కానీ ఇప్పుడు కేజ్రివాల్ గారి పుణ్యమా అని గడ్కారి బి.జె.పి.కి గుడి బండగా మారారు.. 
గడ్కారి అవినీతికి నిజంగా అవినీతికి పాల్పడ్డారా లేదా అన్నది తేల్చాల్సింది న్యాయస్థానమే అయినా, అది తేలేది 2014 ఎన్నికల తర్వాతే.. మరి ఈలోగా బి.జె.పి. ప్రజలకు ఏమి సమాధానం చెప్పుకుంటుంది? పార్టీ అద్వానితో సహా పార్టీ అగ్ర నాయకులంతా గడ్కారిని వెనుకేసుకు వస్తున్నారు.. కానీ బి.జె.పి. కార్యకర్తలు ఓటర్లకు ఏమి సమాధానం చెబుతారు? కాంగ్రెస్ కు, బి.జె.పి. మధ్య ఎలాంటి తేడా ఉందని నిరూపిస్తారు? 

గుడ్డిలో మెల్ల ఏమిటంటే.. కాంగ్రెస్ పార్టీకి సోకాల్డ్ గాంధీలు తప్ప ఇతరులు అధినాయకులు కాలేరు.. ప్రజాస్వామ్య విధానాలు ఉన్న బి.జె.పి.కి ఆ పరిస్థితి లేదు.. బి.జె.పి.కి నాయకత్వ సమస్య లేదు.. కానీ ఎవరు ఆధ్యక్ష పదవి చేపడతారు? ఎవరు ప్రధాని అభ్యర్థి అన్నదే సమస్య..  

Wednesday, October 24, 2012

హిందువులకు మనోభావాలు ఉండవా?


ఈ దేశంలో హిందువులకు ఎలాంటి మనోభావాలు ఉండవు.. మనోభావాలు ఉండేవి హైందవేతర మతస్తులకే.. విజయదశమి సందర్భంగా కొందరు వ్యక్తులు జరిపిన ప్రచారం ఆశ్చర్యాన్ని కలిగించింది.. దసరా రోజున రావణ దహనం బదులు రావణ వర్దంతి జరపాలట.. రావణుడు మంచివాడేనట.. అణువణువునా హిందూ మతంపై ద్వేషం పెంచుకున్న కొందరు వ్యక్తులు చేసిన రాద్దాంతం ఇది.. వాస్తవానికి వీరు హిందువులు కాదు.. హిందూమతం పై విశ్వాసం లేని వారు, హిందువుల విశ్వాసాలతో ఆటలాడే ఇలాంటి చర్చలు జరపడంలోని అంతర్యం ఏమిటి?.. హైందవేతర మతస్తుల విశ్వాసాలపై ఇలాంటి చర్చ జరిపే ధైర్యం వీరికి ఉందా?.. 
కొద్ది నెలల క్రితం ఉస్మానియా విశ్వ విద్యాలయంలో జరిపిన పెద్ద కూర పండుగను ఒక్క సరి గుర్తు తెచ్చుకోండి.. గొడ్డు మాంసం తినాలనుకుంటే తినొచ్చు.. అది వారి ఇష్టం.. కానీ ఇందు కోసం హడావిడి చేయాల్సిన అవసరం ఏముంది? హిందూ మత విశ్వాసాలను ద్వేషించే వారు, నాస్తికులు, అన్య మతస్తులే పెద్ద కూర పండుగ సూత్రధారులు.. ఇది అబద్దం అని నిరుపించాగలరా?  
ఎక్కడో కార్టున్ గీసారని, తమ విశ్వాసాలకు భంగం కలిగించారని ఒక మతం వారు చేసిన విధ్వంసాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.. హిందువులు ఉదార స్వభావులు కాబట్టే ఇలాంటి వారి ఆటలు సాగుతున్నాయి.. ఈ ప్రపంచంలోని ప్రతి మతం విశ్వాసాల ఆధారంగా ఏర్పడిందే.. ఇష్టం లేకపోతె మాట విశ్వాసాలను పాటించాల్సిన అవసరం లేదు.. కానీ పైకి హిందువులుగా చలామణి అవుతూ, గుట్టుగా అన్య మతాలను పాటిస్తూ, హిందూమతంపై బురద చాల్లే హక్కు వీరికి ఎవరు ఇచ్చారు.. 
విశ్వాసాలను నిష్టగా పాటించే వారిని అట పట్టించడం, మతోన్మాదులని ద్వేషించడం ఫ్యాషన్ అయిపొయింది.. హిందువులు ఉదార వాదులుగా ఉండటమే పాపమా? 

Tuesday, October 23, 2012

జయ జయ హే.. మహిషాసుర మర్ధిని.. విజయ దశమి శుభాకాంక్షలు..

Monday, October 22, 2012

దుర్గాష్టమి శుభాకాంక్షలు

Sunday, October 21, 2012

ఇంకా నేర్చుకోని గుణపాఠం

 చైనాతో జరిగిన యుద్ధంలో మమమన దేశం ఓటమిపాలై ఏళ్లు గడచిపోయాయి.. హిందీ-చీనీ భాయ్ భాయ్ అనే గుడ్డి విధానంతో నాటి భారత ప్రధాని నెహ్రూ, చైనా ప్రధాని చౌ ఎన్ లై మనస్సులో ఉన్న కుట్రను గ్రహించలేకపోయారు.. దానికి తోడు మన దేశం ఆనాడు అనుసరించిన అంతర్జాతీయ విధానంలోని లోపాలు కొంప ముంచాయి.. నాటి కేంద్ర రక్షణ మంత్రి కృష్ణ మీనన్ ను గుడ్డిగా నమ్మిన నెహ్రూ ఈ యుద్దంలో ఓటమితో ఎంతో వ్యధ చెందారు.. 1947లో మన దేశానికి స్వాతంత్రం రాగే నెహ్రూ చేసిన తప్పు అప్పటి వరకూ బ్రిటిష్ ఇండియా రక్షణలో ఉన్న టిబెట్ నుండి సైన్యాన్ని ఉపసంహరించడమే.. రెండో తప్పు టిబెట్ దేశాన్ని చైనా ఆక్రమించినప్పుడు ఖండించక పోవడం.. పైనా చైనాలో టిబెట్ అంతర్భాగమని అంగీకరిస్తూ, ఐక్యరాజ్య సమితిలో ఛైనాకు శాశ్వత సభ్యత్వం ఇప్పించే ప్రయత్నం చేశారు నెహ్రూ.. రక్తం రుచి మరగిన తోడేలు లాంటి చైనా అదను చూసి 1962 అక్టోబర్ 20న భారత దేశంపై దాడి చేసింది.. ఆనాటి యుద్దంలో చిత్తుగా ఓడిపోయాం..
ఆనాటి ఓటమి తాలూకూ పీడ కలలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి.. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని కబలించిన చైనా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం తమదేనంటూ క్లెయిమ్ చేస్తోంది.. భారత దేశాన్ని సైనిక, ఆర్థిక దిగ్భందనాలతో కబలించే ప్రయత్నం చేస్తున్న చైనా విషయంలో మన దేశం ఇంకా తప్పిదాలు చేస్తూనే ఉంది.. ఆనాడు సైనిక పరంగా విజయం సాధించిన చైనా ఇప్పడు, తన పనికిరాని చవక చెత్త వస్తువులతో ఇండియా మార్కెట్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది.. మన దేశానికి మొదటి శత్రువు పాకిస్తాన్ అని అందరూ భావిస్తారు.. నిజానికి చైనాయే మన ప్రథమ శత్రువు.. ఈ విషయాన్ని ఎన్డీయే ప్రభుత్వ హయంలో రక్షణ మంత్రిగా పని చేసిన జార్జ్ ఫెర్నాండెజ్ ను ప్రతిపక్షాలు వెర్రి నాగన్నలా చూశాయి.. కానీ ఆయన చెప్పింది వాస్తవం అనే నిజం నిలకడమీదే అర్థం అవుతోంది..
చైనా యుద్దంలో మన దేశం కోసం పోరాడిన వీర జవానుల సేవలను గుర్తించేందుకు ఘనత వహించిన భారత ప్రభుత్వానికి 50 ఏళ్లు పట్టింది.. ఆనాటి జవాన్ల వీరోచిన పోరాటాన్ని గౌరవించి వారికి సల్యూట్ చేయడం భారతీయులుగా మన విధి.. అలాగే చైనాతో తస్మాత్ జాగ్రత్త..

పూరీల సినిమాల చిచ్చు

సినిమాలను సమాజంతో వేరు చేయలేం.. అందునా మన రాష్ట్రంలో.. సినిమాలే లోకంగా జీవించే వారెందరో ఉన్న రాష్ట్రం మనది.. దిన పత్రికలు సినిమా వార్తలకు ప్రత్యేకంగా పేజీని కేటాయించడమే ఇందుకు ఉదాహరణ.. ఇటీవల రెండు చిత్రాలు పెట్టిన చిచ్చు అంతా ఇంతా కాదు.. కెమెరామెన్ గంగతో రాంబాబు, ఎ ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజం సినిమాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి.. ఈ రెండు చిత్రాలు పూరీలవే కావడం విశేషం.. కెమెరామెన్ గంగతో రాంబాబు ద్వారా పూరీ జగన్నాధ్ తెలంగాణ వాదుల మనోభావాలను, ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజంతో జీటీ పూరీ బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బ తీశారు.. ఈ పూరీలు ఆశించిన సామాజిక ప్రయోజనం ఏమిటో తెలియదు కానీ అశాంతిని సృష్టించారు.. సమాజంలో ప్రతి ఒక్కరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది.. దీన్ని కాదనలేం.. కానీ ఈ స్వేచ్ఛకూ పరిమితులు ఉన్నాయి.. స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తాం అంటే కుదరదు.. నచ్చకపోతే తిరస్కరించే స్వేచ్ఛ కూడా అవతలి పక్షానికి ఉంటుంది.. అది ఏ రూపంలో అయినా ఉండొచ్చు..  తమ భాష, సంస్కృతి, కట్టుబొట్టులపై ప్రతి ఒక్కరికీ సెంటిమెంట్లు ఉంటాయి.. తమ వాదనే కరెక్టరనే మొండి వాదనతో తమ వ్యాపార ప్రయోజనాల కోసం తమ పెంటను అందరూ భరించాలంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి?

Tuesday, October 16, 2012

సర్కారీ దుబారా..

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత విద్యుత్తు సంక్షోభం నెలకొంది.. పల్లెలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు తీసేస్తున్నారు..  పరిశ్రమల్లో పనులు స్థంభించి పారిశ్రామిక ప్రగతి కుంటుపడింది.. రైతన్నలు పొలాలకు నీరు ఇచ్చుకోలేని పరిస్థితి నెలకొంది.. ముందు చూపులేక, చేతగాని విధానాలతో చేతులెత్తేసిన ప్రభుత్వం విద్యుత్తును ఆదా చేయమంటూ ప్రజలకు ఉచిత సలహా ఇచ్చేసింది.. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో మన ప్రభుత్వం విద్యుత్తును ఎలా దుర్వినియోగం చేస్తోందో చూడండి.. ఆంధ్రప్రదేశ్ సచివాలయం రంగుదీపాల తోరణాలతో విద్యుత్ కాంతులతో ఎలా దగదగలాడిపోతోందో చూడండి.. ఈ ఫోటో నిన్న(15.10.2012) రాత్రి సరిగ్గా 9 గంటల 49 నిమిషాలకు తీసినది.. రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించినట్లుంది కదూ.. అసెంబ్లీ భవనం కూడా ఇలాగే వెలిగిపోతోంది.. జీవ వైవిధ్య సదస్సుకు వచ్చిన ఎందరు విదేశీ పర్యాటకులు రాత్రి వేళ నగర అందాలు తిలకిస్తున్నారో తెలియదు కానీ.. కష్ట పరిస్థితుల్లో విద్యుత్తును ఇలా దుబారా చేయడం మాత్రం దారుణం..

Monday, October 15, 2012

మన బతుకమ్మ.. మన పండుగ..

సినిమా పాటలు, డ్యాన్సులే మన కల్చర్ అని భ్రమపడుతున్న ఈ రోజుల్లో, నిజమైన సంస్కృతి, సంప్రదాయాలు పల్లెల నుండి పట్నాల దాకా ఇంకా బతికే ఉన్నాయనేందుకు బతుకమ్మే ఉదాహరణ.. కల్తీలేని అచ్చమైన తెలుగు భాషా సౌందర్యం జన పదుల నోట బతుకమ్మ పాటల రూపంలో కదలాడుతోంది.. ప్రజల కష్టాలు, సుఖాలు, చరిత్ర కలగలసి గౌరమ్మకు భక్తితో నివేదించుకునే తీరు అపురూపం, అనిర్వచనీయం.. నిన్న మొన్న హఠాత్తుగా పుట్టుకొచ్చిన పండుగ కాదిది.. తర తరాలుగా తొమ్మిది రోజుల పాటు నాలుగు కోట్ల తెలుగు ప్రజలు జరుపుకునే బతుకమ్మ పండుగను గుర్తించాలని ప్రభుత్వాన్ని దేబిరించాల్సిన అవసరం లేనేలేదు.. చరిత్రలో ఏ ప్రభుత్వం గుర్తించడం వల్ల ఇంతకాలం బతుకమ్మ మనుగడ కొనసాగింది?.. బతుకమ్మ పేరులేనే శాశ్వతమైన గుర్తింపు ఉంది.. మన సంస్కృతి, మన సాంప్రదాయం.. మన బతుకమ్మ.. మన పండుగ.. ఇంతటి జీవవైవిధ్యం ఇంకెక్కడైనా ఉందా.. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలతో..

Sunday, October 14, 2012

కాంగ్రెస్ పచ్చడి..

ఆవకాయ పచ్చడి అంటే మనలో ఇష్టపడంది ఎవరో చెప్పండి?.. అయితే కాంగ్రెస్ మాత్రం భ్రష్ట్ అచార్ (భ్రష్టాచార్=అవినీతి, అచార్=పచ్చడి) అంటే పడి చస్తారు.. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పాలకులు అవినీతి కంపును అంటించుకున్నారు.. రోజు రోజుకూ కొత్త కొత్త కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి.. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మొదలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా దాకా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.. ఇంకా ఎంతకాలం మీరిని భరించాలి? ఎన్నికల దాకా వీరి లూఠీ కొనసాగాల్సిందేనా?

గాంధీజీ ఊరి ఎంపీ ఈయన

విఠల్ భాయ్ హన్స్ రాజ్ భాయ్ రదాడియా అలియాస్ విఠల్ రదాడియా.. గుజరాత్ లోని పోరుబందర్ ఎంపీ.. అంటే మహాత్మగాంధీ పుట్టిన ప్రాంతం.. గాంధేయ వాదం(?)కు హోల్ అండ్ సోల్ పేటెంట్ హోల్డర్ అయిన కాంగ్రెస్ పార్టీ టికెట్ పై లోక్ సభకు ఎన్నికయ్యాడాయన.. ఇలాంటి శుద్ధ గాంధేయవాది పయనించే కారును వదోదర దగ్గర టోల్ గేట్ సిబ్బంది ఆపారు.. ఇది ఎంపీ వాహనం అని చెబితే గుర్తింపు కార్డు చూపమన్నారు.. కానీ గౌరవనీయులైన రదాడియా గారికి కోపం తన్నుకొచ్చేసింది.. ఒక చెంపపై కొడితే మరో చెంప చూపమన్న గాంధీ మాటను మరచిపోయాడేమో? వెంటనే గున్ను చూపించి బెదించాడు.. తన చర్యను రదాడియా సమర్దించుకోగా, సోకాల్డ్ గాంధీల పార్టీ మౌనం వహించింది..

Friday, October 12, 2012

కలంపై సర్కారు పగ

రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులపై పగబట్టినట్లు కనిపిస్తోంది.. జర్నలిస్టుల ఆరోగ్య బీమా పథకాన్ని ఎత్తివేసే కుట్రలో భాగంగా పావులు కదుపుతోంది.. ఈ ఏడాది ఇన్స్యూరెన్స్ కోసం జర్నలిస్టుల దగ్గర వారి వంతు ప్రీమియంలో కట్టించుకున్న ప్రభుత్వం తన వంతు వాటా చెల్లించకుండా, ఏకంగా ఫైలునే మాయం చేసింది.. ఫలితంగా వేలాది మంది జర్నలిస్టుల కుటుంబాల ఆరోగ్యం ప్రమాదంలో పడింది.. ఈ విషయంలో ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, సమాచార శాఖ అధికారులు కుంటి సాకులు చెబుతున్నారు.. గతంలో జర్నలిస్టులందరి ఆరోగ్య బీమా ఒకే బీమా కంపెనీ కింద ఉండేది.. ప్రభుత్వం తెలివిగా రెండు కంపెనీల కింద విభజించింది.. ఫలితంగా ఎందరో జర్నలిస్టులు ఇన్స్యూరెన్స్ కంపెనీ సీనియారిటీ కోల్పోయారు.. ఈ విషయంలో అప్పుడే జర్నలిస్టు సంఘాలు అభ్యంతర పెట్టాల్సింది.. కానీ వారు నోరు మెదపక పోవడంతో కుట్ర సంపూర్ణమెంది.. ఏకంగా జర్నలిస్టుల ఆరోగ్య బీమా పథకానికే ఎసరొచ్చింది.. సమాజంలో అన్ని వర్గాలను దూరం చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పడు జర్నలిస్టుల కుటుంబాలకు కూడా శత్రువైపోయింది.. వినాశ కాలే విపరీత బుద్ధి అంటే ఇదేనేమో?..

Wednesday, October 10, 2012

నైవేధ్యమా?.. వైధవ్యమా?

హైదరాబాద్ జీవ వైవిధ్య నగరంమంటూ ముఖ్యమంత్రి ఫోటోతో పత్రికల్లో వచ్చిన ప్రకటనలు చూసి నిజమేనేమో అనుకున్నా.. కానీ వైవిధ్యం అంటే అడ్డగోలు పనులతో కాంట్రాక్టర్లకు నైవేధ్యం అని ఈ ఫోటో చూశాక తెలిసొచ్చింది.. పాపం ఓ విదేశీయుడు ఫుట్ పాత్ పై డ్రైనేజీలోకి ఎలా పడిపోయాడో చూడండి.. జీవ వైవిధ్యం పేరిట నగరంలో కాంట్రాక్టర్లు, అధికారులు, నాయకులు అరకొర పనులు చేసి కోట్లాది రూపాయలు కాజేశారు.. ఈ పనుల పుణ్యమా అని నగర వాసులకు వైధవ్యం వచ్చేలా ఉంది..
జీవ వైవిధ్య సదస్సు కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు చేస్తోంది.. కానీ భాగ్యనగర వాసులకు ఆ సదస్సు ప్రాంగణంలోకి ప్రవేశమే లేదు.. నగర ప్రజలు సదస్సు గురుంచి తెలుసుకునే అవకాశమే లేకుండా ఒకవైపు.. సదస్సు పేరిట జేబులు నింపుకునే పనిలో మరోవైపు మన పాలకులు బిజీగా ఉన్నారు..

Monday, October 8, 2012

మన ప్రజాస్వామ్యానికి కాపలాగా..

అల్లుడా మజాకా..

అల్లుడు గారి గిల్లుడు అదిరింది.. అత్తగారి రిమోట్ కంట్రోల్ పాలనలో ఇళ్లు బాగానే చక్కబెట్టుకున్నాడు.. ఇంకా నయం అల్లుడు గారికి కట్నంగా పవర్ రాసిచ్చేస్తే?.. దోపిడీ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోండి?.. అల్లుడా మజాకా..


Sunday, October 7, 2012

జైరామ్.. నీది నోరేనా?..

ఇండియాలో మరుగుదొడ్ల కన్నా మొబైల్ ఫోన్లే ఎక్కువున్నాయనే పొంతన లేని వితండ వాదులను ఇప్పటి దాకా మనం భరిస్తూ వచ్చాం.. ఓ తిక్క కేంద్ర మంత్రి వీరిని మించిపోయాడు.. ఆలయాలకన్నా టాయిలెట్లే ముఖ్యం అంటున్నాడు జైరామ్ రమేశ్.. ఇదేమి పోలిక?.. ఈ కేంద్ర మంత్రి గారిది నోరేనా? పాయఖానా?.. ప్రజల మత విశ్వాసాలు, మనోభావాలను దెబ్బ తీసే హక్కు ఎవరిచ్చారు ఇతగాడికి? జైరామ్ రమేశ్ మానసిక ప్రశాంతత కోసం టాయిలెట్లో ప్రార్ధన చేసుకుంటారా? అక్కడే భోజనం చేస్తున్నారా?

పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు ప్రజల కనీస అవసరాలు.. దేశంలో 64 శాతం ప్రజలు మల విసర్జన కోసం ఇంకా బహిర్భూమికే వెళ్లుతున్నారంటే అది జైరామ్ రమేశ్ లాంటి పాలకుల చేతగాని తనమే.. ఇందు కోసం కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నా, అవన్నీ ఎక్కడికి చేరుతున్నట్లు? ఇవన్నీ పక్కన పెట్టి మరుగదొడ్లకు, ప్రార్థనాలయాలకు, సెల్ ఫోన్లకు లంకె పెట్టడం ఎందుకు?

Friday, October 5, 2012

మన వైవిధ్యం మాటేమిటి?

నా చిన్నప్పుడు ఎక్కడంటే అక్కడ కనిపించిన ఈ ప్రాణులు ఇప్పుడు కనిపించడమే అరుదైపోయింది.. మన ఇళ్ల చూరులోని పిచ్చుకలు.. చెట్లు, కరెంటు స్థంబాలపై గూడు కట్టుకునే కాకులు ఏమయ్యాయి.. సెల్ ఫోన్ల టవర్ల నుండి విడుదలయ్యే రేడియేషనే ఇందుకు కారణమేమో?.. నగరీకరణ గాడిదలను మింగేసింది.. గద్దలు అసలున్నాయా అనే అనుమానం కలుగుతోంది.. భాగ్యనగరంలో పుట్టి పెరిగిన నా అనుభవాలు ఇవి.. మన తరం ఈ ప్రాణులను చూసింది.. కాని భవిష్యత్తు తరం వీటిని చూడాలంటే జూపార్క్ వెళ్లాల్సిందేనేమో? లేదంటే పుస్తకాలే గతి..
జీవ వైవిధ్య సదస్సు పేరిట మన ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటం అంతా ఇంతా కాదు.. ఎంత మంది నగరవాసులకు, రాష్ట్ర ప్రజలకు ఈ సదస్సులో పాల్గొనే అవకాశం దక్కింది? మన ప్రజలకు కలిగిన ప్రయోజనం ఏమిటి? వారు పొందిన స్పూర్తి ఏమిటి? గుంతలు తేలిన రోడ్ల మీద తారు కార్పెట్లు వేసి, ఫ్లైఓవర్ల దగ్గర శిల్పాలు పెట్టి, గోడలపై బొమ్మలు వేసినంత మాత్రాన వైవిధ్యం కనిపిస్తుందా?.. అంతరిస్తున్న మన ప్రాణులపై కూడా కాస్త దృష్టి పెట్టాలి.. ఇతి ప్రభుత్వం చేయాల్సిన పని మాత్రమే కాదు.. మన వంతు భాగస్వామ్యం కూడా ఉండాలి..

Tuesday, October 2, 2012

జై జవాన్.. జై కిసాన్

మిత్రులారా.. ఈ రోజు గాంధీజీతో పాటు శాస్త్రీజీని కూడా గుర్తు తెచ్చుకొండి.. లాల్ బహద్దూర్ శాస్త్రి భారత దేశ గొప్ప ప్రధానుల్లో ఒకరు.. జై జవాన్, జైకిసాన్ నినాదాన్ని అందించిన నాయకుడు.. పాకిస్తాన్ పై మన దేశం విజయం సాధించాక, తాష్కెంట్ ఒప్పందం సమయం...లో అనుమానాస్పద స్థితిలో మరణించారు.. గాంధీజీ సిద్దాంతాలను అసలు, సిసలు వారసుడాయన.. అవినీతికు దూరంగా నిరాడంబరంగా జీవించడం ఎలాగో ఆచరణలో చూపించారు శాస్త్రీజీ.. ఆయనే జీవించి ప్రధానిగా కొనసాగి ఉంటే భారత దేశం ఈ దుస్థితిలో ఉండేది కాదని నేను కచ్చితంగా చెప్పగలను.


గాంధీజీని మరచిపోయిన కాంగ్రెస్..

మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానాయకుల్లో ప్రముఖులు.. భారతమాత గర్వించదగ్గ మహా పుత్రుల్లో ఆయన ఒకరు.. (జాతిపిత అనడం తప్పు) భారత స్వాతంత్ర్య సమరంలో ఆయన చూపిన సత్యాగ్రహ మార్గం ప్రపంచ ప్రసిద్ది పొందింది.. సత్యం, అహింస ఆయన ఆయుధాలు.. స్వదేశీ వస్తువులనే వాడాలని పిలుపునిచ్చిన గాంధీజీ, స్వయంగా వడికిన నూలు బట్టల ధరించారు.. ఒంటిపై రెండే వస్త్రాలు ధరించి జీవితాంతం నిరాడంబరంగా బతికారు.. అంటరానితనం, మద్యంపానం తదితర సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడారు.. రామ రాజ్యం రావాలని కలలు కన్నారు.. దేశం పాడి పంటలతో కళకళలాడాలంటే గోవధపై నిషేధం విధించాలని సూచించారు.. మహిళలు అర్ధరాత్రి రోడ్డుపై ధైర్యంగా తిరిగే రోజునే ఆ దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లుని గాంధీజీ చెప్పారు..

మరి గాంధీజీ బోధనలు ఆచరణలో ఉన్నాయా? ఈ దేశాన్ని పాలస్తున్నది ఆయన వారసులమని చెప్పుకునేవారే కదా? దీనికి సమాధానం చెప్పుకోవడానికి కాంగ్రెస్ పాలకులు సిగ్గు పడాలి.. కానీ వారికి ఈ విషయంలో పట్టింపు లేదు.. ఎందుకంటే వారికి తెలిసిన గాంధీలు వేరే ఉన్నారు.. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ(వద్రా).. వీరంతా మహాత్మగాంధీ కుటుంబ సభ్యులని నమ్మే అమాయక కార్యకర్తలు కాంగ్రెస్లో చాలా మందే ఉన్నారు..
ఇప్పడు మన దేశాన్ని పాలిస్తున్న సోకాల్డ్ గాంధీ వారసులు మహాత్ముని సిద్దాంతాలకు ఏనాడో పాతర పెట్టేశారు.. సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పేరిట స్వదేశీని గాలికొదిలారు.. మద్యపానం, గోవధ నిషేధం మన పాలకులకు గిట్టని అంశాలు.. గాంధేయ వాదులమని చెప్పుకునే అర్హత వీరికి ఎక్కడిది? అవినీతి, కుంభకోణాలతో ఇందిర, రాజీవ్ కాలంలోనే కాంగ్రెస్ ప్రతిష్ట మంటగలిసింది సత్యం, అహింస వీరికి హాస్యాస్పదమైన విషయాలు.. ఎందుకంటే గాంధీగిరి కన్నా గుండాగిరిని నమ్ముకున్న పార్టీ ఇది..
మహత్మాగాంధీ ఈ విషయాలను ముందే ఊహించారు.. అందుకే స్వాతంత్ర్యం రాగానే కాంగ్రెస్ పార్టీని రద్దు చేసి కొత్త పార్టీతో ప్రజల మందుకు వెళ్లాలని సూచించారు.. కానీ ‘గాంధీ బ్రాండ్’ను సొమ్ము చేసుకోవాలనే దురాశతో ఆనాటి కాంగ్రెస్ నేతలు ఆయన సూచనను పెడచెవిన పెట్టారు.. దాని ఫలితమే ఇప్పడు దేశ ప్రజలమైన మనం అనుభవిస్తున్నేం.. మహాత్మా మీరిని క్షమించు..

Monday, October 1, 2012

సాగర కెరటానికి జయహో..

కొందరికి వినిపించదు.. కొందరికి కనిపించదు..వీరి సమస్య అర్థం చేసుకోవచ్చు.. కానీ కళ్లుండీ, చెవులుండీ కనిపించనట్లు, వినిపించనట్లు నటించే వారిని ఏమనాలి?.. కేంద్ర, రాష్ట్ర కాంగ్రెస్ పాలకుల పరిస్థితి ఇది.. రగులుతున్న తెలంగాణ సమస్యను పరిష్కరించకుండా ఇంకా ఎంత కాలం కాలాయాపన చేస్తారు?.. ప్రభుత్వం రైళ్లు, బస్సులు నిల్పివేసి ఎంత దిగ్భందం చేసినా ఆటంకాలను తట్టుకొని తరలి వచ్చిన జనం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డుపై నిర్వహించిన సాగర హారాన్ని విజయవంతం చేశారు.. ఇది చూసైనా ప్రభుత్వం కదలాల్సిన అవసరం ఉంది.. తెలంగాణ ఎక్కడ అని ఎక్కెసెక్కాలాడిన కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు ఇకనైనా సమస్యను పరిష్కరించక తప్పదు.. తమ స్వార్థ వ్యాపార ప్రయోజనాల కోసం ప్రధాన పార్టీల నాయకులు చేస్తున్న వ్యర్ధ ప్రయత్నాలు కట్టి పెట్టాల్సిన అవసరం ఉంది.. ఈ సమస్యను పరిష్కరించకుండా, కాలమే నిర్ణయిస్తుందని భావిస్తే అంతకన్నా ప్రమాదం మరొకటి ఉండదు..