Tuesday, October 16, 2012

సర్కారీ దుబారా..

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత విద్యుత్తు సంక్షోభం నెలకొంది.. పల్లెలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు తీసేస్తున్నారు..  పరిశ్రమల్లో పనులు స్థంభించి పారిశ్రామిక ప్రగతి కుంటుపడింది.. రైతన్నలు పొలాలకు నీరు ఇచ్చుకోలేని పరిస్థితి నెలకొంది.. ముందు చూపులేక, చేతగాని విధానాలతో చేతులెత్తేసిన ప్రభుత్వం విద్యుత్తును ఆదా చేయమంటూ ప్రజలకు ఉచిత సలహా ఇచ్చేసింది.. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో మన ప్రభుత్వం విద్యుత్తును ఎలా దుర్వినియోగం చేస్తోందో చూడండి.. ఆంధ్రప్రదేశ్ సచివాలయం రంగుదీపాల తోరణాలతో విద్యుత్ కాంతులతో ఎలా దగదగలాడిపోతోందో చూడండి.. ఈ ఫోటో నిన్న(15.10.2012) రాత్రి సరిగ్గా 9 గంటల 49 నిమిషాలకు తీసినది.. రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించినట్లుంది కదూ.. అసెంబ్లీ భవనం కూడా ఇలాగే వెలిగిపోతోంది.. జీవ వైవిధ్య సదస్సుకు వచ్చిన ఎందరు విదేశీ పర్యాటకులు రాత్రి వేళ నగర అందాలు తిలకిస్తున్నారో తెలియదు కానీ.. కష్ట పరిస్థితుల్లో విద్యుత్తును ఇలా దుబారా చేయడం మాత్రం దారుణం..

No comments:

Post a Comment