Sunday, October 7, 2012

జైరామ్.. నీది నోరేనా?..

ఇండియాలో మరుగుదొడ్ల కన్నా మొబైల్ ఫోన్లే ఎక్కువున్నాయనే పొంతన లేని వితండ వాదులను ఇప్పటి దాకా మనం భరిస్తూ వచ్చాం.. ఓ తిక్క కేంద్ర మంత్రి వీరిని మించిపోయాడు.. ఆలయాలకన్నా టాయిలెట్లే ముఖ్యం అంటున్నాడు జైరామ్ రమేశ్.. ఇదేమి పోలిక?.. ఈ కేంద్ర మంత్రి గారిది నోరేనా? పాయఖానా?.. ప్రజల మత విశ్వాసాలు, మనోభావాలను దెబ్బ తీసే హక్కు ఎవరిచ్చారు ఇతగాడికి? జైరామ్ రమేశ్ మానసిక ప్రశాంతత కోసం టాయిలెట్లో ప్రార్ధన చేసుకుంటారా? అక్కడే భోజనం చేస్తున్నారా?

పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు ప్రజల కనీస అవసరాలు.. దేశంలో 64 శాతం ప్రజలు మల విసర్జన కోసం ఇంకా బహిర్భూమికే వెళ్లుతున్నారంటే అది జైరామ్ రమేశ్ లాంటి పాలకుల చేతగాని తనమే.. ఇందు కోసం కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నా, అవన్నీ ఎక్కడికి చేరుతున్నట్లు? ఇవన్నీ పక్కన పెట్టి మరుగదొడ్లకు, ప్రార్థనాలయాలకు, సెల్ ఫోన్లకు లంకె పెట్టడం ఎందుకు?

No comments:

Post a Comment