Tuesday, October 2, 2012

గాంధీజీని మరచిపోయిన కాంగ్రెస్..

మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానాయకుల్లో ప్రముఖులు.. భారతమాత గర్వించదగ్గ మహా పుత్రుల్లో ఆయన ఒకరు.. (జాతిపిత అనడం తప్పు) భారత స్వాతంత్ర్య సమరంలో ఆయన చూపిన సత్యాగ్రహ మార్గం ప్రపంచ ప్రసిద్ది పొందింది.. సత్యం, అహింస ఆయన ఆయుధాలు.. స్వదేశీ వస్తువులనే వాడాలని పిలుపునిచ్చిన గాంధీజీ, స్వయంగా వడికిన నూలు బట్టల ధరించారు.. ఒంటిపై రెండే వస్త్రాలు ధరించి జీవితాంతం నిరాడంబరంగా బతికారు.. అంటరానితనం, మద్యంపానం తదితర సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడారు.. రామ రాజ్యం రావాలని కలలు కన్నారు.. దేశం పాడి పంటలతో కళకళలాడాలంటే గోవధపై నిషేధం విధించాలని సూచించారు.. మహిళలు అర్ధరాత్రి రోడ్డుపై ధైర్యంగా తిరిగే రోజునే ఆ దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లుని గాంధీజీ చెప్పారు..

మరి గాంధీజీ బోధనలు ఆచరణలో ఉన్నాయా? ఈ దేశాన్ని పాలస్తున్నది ఆయన వారసులమని చెప్పుకునేవారే కదా? దీనికి సమాధానం చెప్పుకోవడానికి కాంగ్రెస్ పాలకులు సిగ్గు పడాలి.. కానీ వారికి ఈ విషయంలో పట్టింపు లేదు.. ఎందుకంటే వారికి తెలిసిన గాంధీలు వేరే ఉన్నారు.. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ(వద్రా).. వీరంతా మహాత్మగాంధీ కుటుంబ సభ్యులని నమ్మే అమాయక కార్యకర్తలు కాంగ్రెస్లో చాలా మందే ఉన్నారు..
ఇప్పడు మన దేశాన్ని పాలిస్తున్న సోకాల్డ్ గాంధీ వారసులు మహాత్ముని సిద్దాంతాలకు ఏనాడో పాతర పెట్టేశారు.. సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పేరిట స్వదేశీని గాలికొదిలారు.. మద్యపానం, గోవధ నిషేధం మన పాలకులకు గిట్టని అంశాలు.. గాంధేయ వాదులమని చెప్పుకునే అర్హత వీరికి ఎక్కడిది? అవినీతి, కుంభకోణాలతో ఇందిర, రాజీవ్ కాలంలోనే కాంగ్రెస్ ప్రతిష్ట మంటగలిసింది సత్యం, అహింస వీరికి హాస్యాస్పదమైన విషయాలు.. ఎందుకంటే గాంధీగిరి కన్నా గుండాగిరిని నమ్ముకున్న పార్టీ ఇది..
మహత్మాగాంధీ ఈ విషయాలను ముందే ఊహించారు.. అందుకే స్వాతంత్ర్యం రాగానే కాంగ్రెస్ పార్టీని రద్దు చేసి కొత్త పార్టీతో ప్రజల మందుకు వెళ్లాలని సూచించారు.. కానీ ‘గాంధీ బ్రాండ్’ను సొమ్ము చేసుకోవాలనే దురాశతో ఆనాటి కాంగ్రెస్ నేతలు ఆయన సూచనను పెడచెవిన పెట్టారు.. దాని ఫలితమే ఇప్పడు దేశ ప్రజలమైన మనం అనుభవిస్తున్నేం.. మహాత్మా మీరిని క్షమించు..

No comments:

Post a Comment