Friday, October 12, 2012

కలంపై సర్కారు పగ

రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులపై పగబట్టినట్లు కనిపిస్తోంది.. జర్నలిస్టుల ఆరోగ్య బీమా పథకాన్ని ఎత్తివేసే కుట్రలో భాగంగా పావులు కదుపుతోంది.. ఈ ఏడాది ఇన్స్యూరెన్స్ కోసం జర్నలిస్టుల దగ్గర వారి వంతు ప్రీమియంలో కట్టించుకున్న ప్రభుత్వం తన వంతు వాటా చెల్లించకుండా, ఏకంగా ఫైలునే మాయం చేసింది.. ఫలితంగా వేలాది మంది జర్నలిస్టుల కుటుంబాల ఆరోగ్యం ప్రమాదంలో పడింది.. ఈ విషయంలో ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, సమాచార శాఖ అధికారులు కుంటి సాకులు చెబుతున్నారు.. గతంలో జర్నలిస్టులందరి ఆరోగ్య బీమా ఒకే బీమా కంపెనీ కింద ఉండేది.. ప్రభుత్వం తెలివిగా రెండు కంపెనీల కింద విభజించింది.. ఫలితంగా ఎందరో జర్నలిస్టులు ఇన్స్యూరెన్స్ కంపెనీ సీనియారిటీ కోల్పోయారు.. ఈ విషయంలో అప్పుడే జర్నలిస్టు సంఘాలు అభ్యంతర పెట్టాల్సింది.. కానీ వారు నోరు మెదపక పోవడంతో కుట్ర సంపూర్ణమెంది.. ఏకంగా జర్నలిస్టుల ఆరోగ్య బీమా పథకానికే ఎసరొచ్చింది.. సమాజంలో అన్ని వర్గాలను దూరం చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పడు జర్నలిస్టుల కుటుంబాలకు కూడా శత్రువైపోయింది.. వినాశ కాలే విపరీత బుద్ధి అంటే ఇదేనేమో?..

No comments:

Post a Comment