Sunday, October 21, 2012

ఇంకా నేర్చుకోని గుణపాఠం

 చైనాతో జరిగిన యుద్ధంలో మమమన దేశం ఓటమిపాలై ఏళ్లు గడచిపోయాయి.. హిందీ-చీనీ భాయ్ భాయ్ అనే గుడ్డి విధానంతో నాటి భారత ప్రధాని నెహ్రూ, చైనా ప్రధాని చౌ ఎన్ లై మనస్సులో ఉన్న కుట్రను గ్రహించలేకపోయారు.. దానికి తోడు మన దేశం ఆనాడు అనుసరించిన అంతర్జాతీయ విధానంలోని లోపాలు కొంప ముంచాయి.. నాటి కేంద్ర రక్షణ మంత్రి కృష్ణ మీనన్ ను గుడ్డిగా నమ్మిన నెహ్రూ ఈ యుద్దంలో ఓటమితో ఎంతో వ్యధ చెందారు.. 1947లో మన దేశానికి స్వాతంత్రం రాగే నెహ్రూ చేసిన తప్పు అప్పటి వరకూ బ్రిటిష్ ఇండియా రక్షణలో ఉన్న టిబెట్ నుండి సైన్యాన్ని ఉపసంహరించడమే.. రెండో తప్పు టిబెట్ దేశాన్ని చైనా ఆక్రమించినప్పుడు ఖండించక పోవడం.. పైనా చైనాలో టిబెట్ అంతర్భాగమని అంగీకరిస్తూ, ఐక్యరాజ్య సమితిలో ఛైనాకు శాశ్వత సభ్యత్వం ఇప్పించే ప్రయత్నం చేశారు నెహ్రూ.. రక్తం రుచి మరగిన తోడేలు లాంటి చైనా అదను చూసి 1962 అక్టోబర్ 20న భారత దేశంపై దాడి చేసింది.. ఆనాటి యుద్దంలో చిత్తుగా ఓడిపోయాం..
ఆనాటి ఓటమి తాలూకూ పీడ కలలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి.. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని కబలించిన చైనా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం తమదేనంటూ క్లెయిమ్ చేస్తోంది.. భారత దేశాన్ని సైనిక, ఆర్థిక దిగ్భందనాలతో కబలించే ప్రయత్నం చేస్తున్న చైనా విషయంలో మన దేశం ఇంకా తప్పిదాలు చేస్తూనే ఉంది.. ఆనాడు సైనిక పరంగా విజయం సాధించిన చైనా ఇప్పడు, తన పనికిరాని చవక చెత్త వస్తువులతో ఇండియా మార్కెట్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది.. మన దేశానికి మొదటి శత్రువు పాకిస్తాన్ అని అందరూ భావిస్తారు.. నిజానికి చైనాయే మన ప్రథమ శత్రువు.. ఈ విషయాన్ని ఎన్డీయే ప్రభుత్వ హయంలో రక్షణ మంత్రిగా పని చేసిన జార్జ్ ఫెర్నాండెజ్ ను ప్రతిపక్షాలు వెర్రి నాగన్నలా చూశాయి.. కానీ ఆయన చెప్పింది వాస్తవం అనే నిజం నిలకడమీదే అర్థం అవుతోంది..
చైనా యుద్దంలో మన దేశం కోసం పోరాడిన వీర జవానుల సేవలను గుర్తించేందుకు ఘనత వహించిన భారత ప్రభుత్వానికి 50 ఏళ్లు పట్టింది.. ఆనాటి జవాన్ల వీరోచిన పోరాటాన్ని గౌరవించి వారికి సల్యూట్ చేయడం భారతీయులుగా మన విధి.. అలాగే చైనాతో తస్మాత్ జాగ్రత్త..

No comments:

Post a Comment