Sunday, October 21, 2012

పూరీల సినిమాల చిచ్చు

సినిమాలను సమాజంతో వేరు చేయలేం.. అందునా మన రాష్ట్రంలో.. సినిమాలే లోకంగా జీవించే వారెందరో ఉన్న రాష్ట్రం మనది.. దిన పత్రికలు సినిమా వార్తలకు ప్రత్యేకంగా పేజీని కేటాయించడమే ఇందుకు ఉదాహరణ.. ఇటీవల రెండు చిత్రాలు పెట్టిన చిచ్చు అంతా ఇంతా కాదు.. కెమెరామెన్ గంగతో రాంబాబు, ఎ ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజం సినిమాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి.. ఈ రెండు చిత్రాలు పూరీలవే కావడం విశేషం.. కెమెరామెన్ గంగతో రాంబాబు ద్వారా పూరీ జగన్నాధ్ తెలంగాణ వాదుల మనోభావాలను, ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజంతో జీటీ పూరీ బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బ తీశారు.. ఈ పూరీలు ఆశించిన సామాజిక ప్రయోజనం ఏమిటో తెలియదు కానీ అశాంతిని సృష్టించారు.. సమాజంలో ప్రతి ఒక్కరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది.. దీన్ని కాదనలేం.. కానీ ఈ స్వేచ్ఛకూ పరిమితులు ఉన్నాయి.. స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తాం అంటే కుదరదు.. నచ్చకపోతే తిరస్కరించే స్వేచ్ఛ కూడా అవతలి పక్షానికి ఉంటుంది.. అది ఏ రూపంలో అయినా ఉండొచ్చు..  తమ భాష, సంస్కృతి, కట్టుబొట్టులపై ప్రతి ఒక్కరికీ సెంటిమెంట్లు ఉంటాయి.. తమ వాదనే కరెక్టరనే మొండి వాదనతో తమ వ్యాపార ప్రయోజనాల కోసం తమ పెంటను అందరూ భరించాలంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి?

No comments:

Post a Comment