Tuesday, October 2, 2012

జై జవాన్.. జై కిసాన్

మిత్రులారా.. ఈ రోజు గాంధీజీతో పాటు శాస్త్రీజీని కూడా గుర్తు తెచ్చుకొండి.. లాల్ బహద్దూర్ శాస్త్రి భారత దేశ గొప్ప ప్రధానుల్లో ఒకరు.. జై జవాన్, జైకిసాన్ నినాదాన్ని అందించిన నాయకుడు.. పాకిస్తాన్ పై మన దేశం విజయం సాధించాక, తాష్కెంట్ ఒప్పందం సమయం...లో అనుమానాస్పద స్థితిలో మరణించారు.. గాంధీజీ సిద్దాంతాలను అసలు, సిసలు వారసుడాయన.. అవినీతికు దూరంగా నిరాడంబరంగా జీవించడం ఎలాగో ఆచరణలో చూపించారు శాస్త్రీజీ.. ఆయనే జీవించి ప్రధానిగా కొనసాగి ఉంటే భారత దేశం ఈ దుస్థితిలో ఉండేది కాదని నేను కచ్చితంగా చెప్పగలను.


No comments:

Post a Comment