Friday, October 26, 2012

కమలం బురద తొలగేనా?




1980లో భారతీయ జనతా పార్టీ (గతంలో జన సంఘ్) ఏర్పడ్డప్పుడు బురదలో పుట్టిన పార్టీ అని ప్రత్యర్థులు ఎద్దేవా చేసారు.. ఎందుకంటే కమలం ఆ పార్టీ చిహ్నం.. కమలం బురదలో పుడుతుంది.. అప్పుడు అటల్ బిహారి వాజపేయి ఒక మాట చెప్పారు.. 'కమలం బురదలో బుట్టిన స్వచంగా ఉంటుంది.. అలాగే బురదగా మారిన రాజకీయాల్లో బి.జె.పి. తన ఆదర్శాలతో స్వచ్చమైన రాజకీయ పార్టీగా కొనసాగుతుంది..' 
కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి? కర్ణాటకలో అవినీతి అనే పందిలా పొర్లాడిన యడ్యురప్ప కారణంగా బిజెపి ప్రతిష్టకు మచ్చ పడింది.. అప్పను ఆలస్యంగా అయిన ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించినా, కొత్త పార్టీ పెట్టేందుకు సిద్దమై పక్కలో బల్లెంగా మారాడు.. కర్ణాటక యవ్వారం ఇలా ఉంటే ఇప్పుడు బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారి గతంలో చేసిన ఘన కార్యాలు బయట పడుతున్నాయి.. అవినీతి, అసమర్థ విధానాలతో కాంగ్రెస్ నేతృత్వ యు.పి.ఎ. ప్రభుత్వ ప్రతిష్ట దిగజారడంతో 2014లో అధికారం తమదే అని బి.జె.పి. ధీమాగా ఉంది.. కానీ ఇప్పుడు కేజ్రివాల్ గారి పుణ్యమా అని గడ్కారి బి.జె.పి.కి గుడి బండగా మారారు.. 
గడ్కారి అవినీతికి నిజంగా అవినీతికి పాల్పడ్డారా లేదా అన్నది తేల్చాల్సింది న్యాయస్థానమే అయినా, అది తేలేది 2014 ఎన్నికల తర్వాతే.. మరి ఈలోగా బి.జె.పి. ప్రజలకు ఏమి సమాధానం చెప్పుకుంటుంది? పార్టీ అద్వానితో సహా పార్టీ అగ్ర నాయకులంతా గడ్కారిని వెనుకేసుకు వస్తున్నారు.. కానీ బి.జె.పి. కార్యకర్తలు ఓటర్లకు ఏమి సమాధానం చెబుతారు? కాంగ్రెస్ కు, బి.జె.పి. మధ్య ఎలాంటి తేడా ఉందని నిరూపిస్తారు? 

గుడ్డిలో మెల్ల ఏమిటంటే.. కాంగ్రెస్ పార్టీకి సోకాల్డ్ గాంధీలు తప్ప ఇతరులు అధినాయకులు కాలేరు.. ప్రజాస్వామ్య విధానాలు ఉన్న బి.జె.పి.కి ఆ పరిస్థితి లేదు.. బి.జె.పి.కి నాయకత్వ సమస్య లేదు.. కానీ ఎవరు ఆధ్యక్ష పదవి చేపడతారు? ఎవరు ప్రధాని అభ్యర్థి అన్నదే సమస్య..  

No comments:

Post a Comment