Monday, October 31, 2016

భారత జాతిని ఐక్య పరిచిన ఉక్కుమనిషి

బ్రిటిష్ వారు భారత దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చి వెళ్లారు.. ఉక్కుమనిషి భారత దేశాన్ని సమైక్య పరిచారు.. వారు ముక్కలుగా వదిలేసి పోతే, ఆయన అన్నింటికీ కలిపారు.. విశాల భారత దేశ విలీనాధీశునిగా చరిత్రలో శాశ్వత స్థానం దక్కించుకున్నారు.. నవ భారత దేశ నిర్మాత సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి అక్టోబర్ 31ని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నాం..
గుజరాత్ రాష్ట్రంలోని నదియాద్ లో 31 అక్టోబర్ 1875 నాడు జన్మించారు వల్లభాయ్ పటేల్.. ఇంగ్లాండ్ లో బారిస్టర్ చదువుకొని వచ్చి అహ్మదాబాద్ లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఈ క్రమంలో భారత స్వాతంత్ర్య పోరాటంలో చేరారు వల్లభాయ్.. సహాయ నిరాకరణ, బర్దోలీ సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకైన పాత్రను పోశించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను జైలు పాలు చేసింది.. 1931లో కరాచీలో జరిగిన ఆలిండియా కాంగ్రెస్ మహాసభల్లో పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు..
సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ స్వాతంత్ర్యం తర్వాత ఉప ప్రధానమంత్రి పదవి చేపట్టారు.. 565 స్వదేశీ సంస్థానాలను భారత దేశంలో సంపూర్ణంగా విలీనం చేయడం ద్వారా నవ భారతానికి బాటలు వేశారు.. విలీనం కావడానికి మొండికేసిన హైదరాబాద్ సంస్థానంపై పోలీస్ యాక్షన్ చేపట్టి నిజాం నవాబును దారికి తెచ్చారు.. ప్రధాని నెహ్రూ ద్వంద్వ వైఖరి కారణంగా జమ్మూ కాశ్మీర్ పూర్తిగా పాకిస్థాన్ కబ్జాలోకి వెళ్లకుండా కాపాటంలో పటేల్ పాత్ర విస్మరించలేనిది.. భారత రాజ్యాంగ రచనలో ప్రాథమిక హక్కుల కమిటీ ఛైర్మన్ గా వ్యవహరించారు.. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ప్రారంభించారు.. వల్లభాయ్ పటేల్ 15 డిసెంబర్, 1950లో మనకు శాశ్వతంగా దూరమయ్యారు..

కాంగ్రెస్ పార్టీలో గాంధీ, నెహ్రూలకు భిన్నంగా దేశ ప్రయోజనాలకు కాపాటంతో దృఢ వైఖరిని అవలంభించిన సర్దార్ పటేల్ ఉక్కు మనిషిగా పేరు తెచ్చుకున్నారు.. ఆయన తొలి ప్రధాని అయ్యుంటే భారత దేశ చరిత్ర మరింత మెరుగ్గా ఉండేదని చెప్పక తప్పదు.. పటేల్ కఠిన సంకల్పం కారణంగా ముక్కలు, చెక్కులుగా ఉన్న సంస్థానాలు దేశంలో పూర్తిగా కలిపిపోయాయి.. లేకపోతే జాతీయ సమైక్యతకు తీవ్ర విఘాతం కలిగేది.. అందుకే పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.. ముఖ్యంగా మన తెలంగాణ (హైదరాబాద్ స్టేట్) ప్రజలకు సర్దార్ పటేల్ ప్రాత స్మరణీయుడు..

Saturday, October 29, 2016

జాగ్రత్తలు పాటించండి.. ఆనందంగా దీపావళి జరుపుకోండి..

దీపావళి సందర్భంగా టపాకాయలు కాల్చండి ఆనందంగా, ఉత్సాహంగా.. అయితే టపాసులు కాల్చే సమయంలో మన అజాగ్రత్త కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. ప్రమోదం కాస్తా ప్రమాదంగా మారొద్దు.. కొద్దిపాటి జాగ్రత్తలను కచ్చితంగా పాటించి దివ్వ దీపావళిని మరింత సంతోషకరంగా మార్చుకోండి..

·       నాణ్యమైన టపాకాయలు మాత్రమే కొనుగోలు చేయండి.. నాసిరకం టపాసులతో ప్రమాదాలకు అవకాశం ఎక్కువ
·       టపాకాయలను భద్రమైన ప్రాంతంలోనే నిల్వ చేయండి.. వేడికి, మంటకు దూరంగా ఉంచండి.. ముఖ్యంగా వంటింటిలోకి టపాసులు తీసుకెళ్లకండి..
·       ఇళ్లలో, డాబా మీద, ఇరుకు వీధుల్లో, రోడ్లమీద టపాకాయలు కాల్చకండి.. వీలైనంత వరకూ ఆరుబయట, మైదానాల్లోనే కాల్చండి..
·       చిన్న పిల్లలను వంటరిగా టపాకాయలు కాల్చనీయకండి. పెద్దలు విధిగా వెంట ఉండాలి..
·       టపాకాయలు కాల్చే సమయంలో వదులైన దుస్తులు ధరించకండి.. శరీరానికి అతుక్కుపోయే నైలాల్ బట్టలు అసలే వద్దు.. కాటన్ దుస్తులు శ్రేయస్కరం..
·       టపాకాయలు కాల్చే సమయంలో విధిగా పాదరక్షలు ధరించాలి..
·       టపాకాయలు చేతిలో పట్టుకొని కాల్చడం చాలా ప్రమాదకరం. విష్ణు చక్రాలు, భూచక్రాలు, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు కూడా పేలే అవకాశం ఉంటుంది ఉంటుంది..
·       కాకరపువ్వొత్తులు, మెరుపు తీగలు కాల్చే సమయంలో జాగ్రత్తగా ఉండకపోతే చేతులు  కాలే ప్రమాదం ఉంది..
·       ఒకటికన్నా ఎక్కువ టపాకాయలు ఒకేసారి కాల్చే ప్రయత్నం చేయకండి..
·       చిన్న అగర్ బత్తితో టపాకాయలు కాల్చరాదు.. పొడువైన బత్తీని మాత్రమే వాడండి..
·       టపాకాయలపై మొహం పెట్టి కాల్చకండి.. ఇది చాలా ప్రమాదకరం.. కళ్లు కోల్పోయే అవకాశం ఉంది..
·       పేలని టపాసును మళ్లీ వెలిగించే ప్రయత్నం చేయకండి. ఈ క్రమంలో మీరు గాయపడే ప్రమాదం ఉంది..
·       టపాకాయలు వెలిగించేందుకు ఇబ్బంది పడేలా కంటి చూపు సరిగ్గా లేనివారు టపాకాయలకు దూరంగా ఉండటం మంచింది.. ఉత్సాహం ఆపు కోలేము తప్పదు అనుకుంటే కల్లద్దాలు సరిగ్గా పెట్టుకొని ప్రయత్నించండి..
·       వీలైనంత వరకూ పెద్ద శబ్దాలు వచ్చే టపాకాయలకు దూరంగా ఉండాలి.. ఈ శబ్దాల కారణంగా వృద్ధులు, రోగులకు ఇబ్బంది. అంతే కాదు చెవిపోటు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.. వినికిడి శక్తికి ఇలాంటి టపాకాయలు చాలా ప్రమాదకరం..
·       టపాకాయల శబ్దాలుకు పెంపుడు జంతువులు చిరాకుపడి కరిచే ప్రమాదం ఉంది..
·       ఎక్కువ ధ్వని, వాయు కాలుష్యాలకు కారణం అయ్యే టపాకాయలను అసలు ఉపయోగించకండి.. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది..
·       టపాకాయలు కాల్చడానికి ముందుగా బకెట్ నిండా నీరు, తడిపిన టవాల్, బర్నాల్ సిద్ధంగా ఉంచుకోండి.. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే గాయం అయిన బాగాన్ని నీటిలో పెట్టండి.. ప్రథమ చికిత్సతో పాటు ప్రమాదాల తీవ్రతను బట్టి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడం అతి ముఖ్యం..

పై జాగ్రత్తలన్నీ మీరు విధిగా పాటిస్తే ఆనందరకర దీపావళి సంతోషం మీ సొంతం.. అందరూ విధిగా పాటిస్తారని ఆశిస్తున్నాను..

Sunday, October 23, 2016

టపాకాయల బహిష్కరణ చైనాకు చెంప పెట్టు కావాలి

  చైనా మన భారత దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి.. భారత దేశ దిగుమతుల్లో ఆరో వంతు చైనా నుంచే వస్తున్నాయి.. చైనాకు మన ఎగుమతులకన్నా దిగుమతులే ఎక్కువ.. మన వాణిజ్య నిఘా, గణాంకాల డైరెక్టర్ జనరల్ నివేదిక ప్రకారం గత ఐదేళ్లలో చైనాకు మన ఎగుమతులు 18 బిలియన్ డాలర్ల నుండి 9 బిలియన్ డాలర్లకు పడిపోగా, ఇదే కాలంలో చైనా నిండి మనకు దిగుమతులు 61 డాలర్లకు చేరింది.. అంటే ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు 52 డాలర్లు..
చైనా నుండి కారు చౌకగా వస్తున్న ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, మెకానికల్, ఖనిజ, రసాయణ, గాజు, పింగాణి వస్తువుల కారణంగా మన దేశీయ పరిశ్రమలు తల్లడిల్లిపోతున్నాయి.. చైనా నిం ప్రధానంగా మన దేశానికి ప్రధారంగా సెల్ ఫోన్, లాప్ టాప్, సోలార్ సెల్ బ్యాటరీ, స్ప్రింగ్, బేరింగ్, టీవీ రిమోట్, సెటప్ బాక్స్, ఎల్ ఈ డీ, ఎల్ సీ డీలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి.. రకరకాల ఔషధాలు, పిల్లల ఆట వస్తువులు కూడా భారత మార్కెట్లను ముంచెత్తుతున్నాయి..
చైనాలో మానవ వనరులు, ముడి పదార్ధాలు కారు చౌర.. ఆ దేశంలో శ్రమదోపిడి ఎక్కువ.. ఎక్కువ సమయం పని చేయించుకొని, తక్కువ జీతాలు చెల్లిస్తారు.. పేరుకే కమ్యూనిస్టు దేశం.. కానీ పెట్టుబడి, దోపడిదారుకు ఉండాల్సిన అవలక్షణాలన్నీ కాస్త ఎక్కువే ఉన్నాయి.. ఈ కారణం వల్లే మన దేశంతో సహా ప్రపంచ మర్కెట్ ను కారు చౌక వస్తువులతో ముంచెత్తుతోంది చైనా..
ప్రతి ఏటా మనం దీపావళి పండుగను టపాకాయలతో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటాం.. శివకాశీలో పెద్ద సంఖ్యలో ఉన్న టపాకాయల పరిశ్రమలు లక్షలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాయి.. ఆ పరిశ్రమకు ఏటా 6000 వేల కోట్ల రూపాయల మేర జరిగే దీపావళి వ్యాపారమే ప్రధానం.. దురదృష్టవశాత్తు కారు చౌకగా మన దేశంలోకి వచ్చిపడుతున్న చైనా తయారీ టపాకాయల కారణంగా దేశీయ టపాకాయల పరిశ్రమకు ముప్పు ముంచుకొచ్చింది.. మన దేశీయ టపాకాయల్లో ఉపయోగించే రసాయణాలతో పెద్దగా ప్రమాదం ఉండదు.. కానీ చైనా తయారీ టపాకాయల్లో నైట్రేట్, సల్ఫర్ అధిక మోతాదులో ఉంటోంది.. చైనా మతాబులు కారు చౌకగా లభిస్తున్నా, మన పిల్లలకు అవి చాలా ప్రమాదకరం.. ఇటీవల కాలంలో చైనా టపాకాయలకు ప్రభుత్వం నిషేధించినా, అవి అక్రమ మార్గంలో దేశంలోకి వచ్చి పడుతున్నాయి..
మైత్రి అనేది ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి.. చైనాతో భారత్ ఎంతో ఉదారంగా వ్యవహరిస్తున్నా, ఆ దేశం మాత్రం ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోంది.. ముఖ్యంగా సరహద్దుల విషయంలో మన దేశంతో పేచీలు పడుతూ, మన శత్రు దేశం పాకిస్థాన్ కు అన్ని విషయాల్లోనూ అండగా నిలుస్తోంది.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ ను వెనుకేసుకు వస్తోంది.. అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ అనుకూల భారత్ వ్యతిరేక ధోరణి అవలంభిస్తున్న చైనాకు గుణపఠం చెప్పాల్సిన అవసరం ఉంది.. మన దేశం నుండి వ్యాపారపరంగా లాభ పడుతూ, మనకు వ్యతిరేకంగా పని చేస్తున్న చైనాతో కఠినంగానే వ్యవహరించాలి.
చైనా తయారీ వస్తువుల బహిష్కరణే మన ముందున్న ఏకైక మార్గం.. దేశీయ మధ్య, చిన్న తరహా పరిశ్రమలను కాపాడుకోడానికి ఇది తప్పని సరి.. చౌకగా దొరికే వస్తువులను వదులుకోవడం ఎందుకు అని కొందరు వినియోగదారు దృష్టితో ఆలోచిస్తారు.. కానీ దేశీయ పరిశ్రమలు కుదేలైపోతే మనకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎలా అనే కోణంలో కూడా ఆలోచించాలి..
మేకిన్ ఇండియా స్పూర్తితో దేశీయంగా పరిశ్రమలు ప్రారంభమై, వస్తూత్పత్తి క్రమంగా పెరుగుతోంది.. ఈ కారణంగా భవిష్యత్తులో చైనా దిగుమతులు గణనీయంగా తగ్గిపోతాయి.. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వ్యాపారులు, వినియోగదారులు చైనా వస్తువుల బహిష్కరణ ప్రారంభించారు.. మనం కూడా చైనా వస్తువుల బహిష్కరణను ఈ దీపావళి నుండి మొదలు పెడదాం.. ఇందుకు చైనా టపాకాయల బాయ్ కాట్ నాంది కావాలి.. 

Sunday, October 16, 2016

ఇంతకీ జిల్లాలు ఎన్ని?

తెలంగాణలో కొత్త జిల్లాలు ఉనికిలోకి వచ్చి ఆరు రోజులవుతోంది.. కానీ ఇప్పటి వరకూ ఏ పత్రిక కూడా పూర్తి జిల్లాల చిత్ర పటాన్ని ప్రచురించలేదు.. ప్రభుత్వం ముందుగా విడుదల చేసిన 27 జిల్లాల పటాన్నే పత్రికలు ప్రచురించాయి.. ఆ తర్వాత జిల్లాల సంఖ్య 31కి పెరిగినా పాత పటాన్నే వాడుతున్నాయి.. ఇప్పటి వరకూ ప్రభుత్వం కూడా సవరణలతో కూడిన చిత్ర పటాన్ని విడుదల చేయలేదు.. కొత్త జిల్లాలకు సంభంధించిన అధికారిక వెబ్ సైట్ http://newdistrictsformation.telangana.gov.in/FirstPage.do?status=maps  క్లిక్ చేస్తే పాత చిత్ర పటాలే కనిపిస్తున్నాయి.. ప‌రిజ్ఞానం జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దులు మారిపోవడంతో ఇంకా చిత్ర పటాల విషయంలో గందరగోళం కొనసాగుతోంది.. ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం అందుబాటులో ఉన్న తర్వాత కూడా కొత్త జిల్లాల తుది రూపాల చిత్ర పటాలను విడుదల చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటో ప్రభుత్వమే చెప్పాలి.. లేదా ఇంకా ఏమైనా మార్పులు,  చేర్పులు ఉంటే ఆ విషయాన్ని అయినా ప్రకటించాలి..

కొత్త జిల్లాల సందడి..

' ఏ జిల్లా.. ఏ జిల్లా.. పిల‌గా నీది ఏ జిల్లా.. రంగారెడ్డా?.. కామారెడ్డా?.. ' ద‌సరా వేళ తెలంగాణ అంత‌టా పాడుకుంటున్న పాట‌..


మా పూర్వీకుల ఊరు మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో ఉంటే, నేను పుట్టింది హైద‌రాబాద్‌, ఉంటున్న‌ది రంగారెడ్డి జిల్లా.. నీది ఏ జిల్లా అని ఎవ‌రైనా అడిగితే, వివ‌ర‌ణ ఇచ్చుకోలేక ఇబ్బంది ప‌డేవాన్ని.. ఇప్పుడా ఇబ్బంది త‌ప్పింది నాకు.. నేను రావ‌డం లేద‌ని ఊరు బెంగ పెట్టుకున్న‌దేమా?.. ఏకంగా నేనుంటున్న జిల్లాలో క‌లిసిపోయింది.. షాద్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం, కొత్తూరు మండ‌లం, పెంజ‌ర్ల గ్రామం ఇప్పుడు రంగారెడ్డిలోకి వ‌చ్చేశాయి..
ఇప్పుడు నేను రంగారెడ్డి అని చెప్పుకుంటానేమో.. కానీ మ‌ళ్లీ గంద‌ర‌గోల‌మే.. పాల‌నా ప‌రంగా మాది గ్రేట‌ర్ హైద‌రాబాద్‌.. మ‌ళ్లీ గంద‌ర‌గోల‌మే.. నేనిప్పుడు బాధ ప‌డుతున్న‌ది పాల‌మూరోడిని అని చెప్పుకునే అర్హ‌త కోల్పోయాన‌ని.. కృష్ణా, తుంగ‌భ‌ద్ర న‌దుల‌కు, న‌ల్ల‌మ‌ల అడ‌వుల‌కు  దూర‌మ‌య్యాన‌ని.. అఫ్ కోర్స్ మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా కూడా వాటిని కోల్పోయింది.. మ‌న పెద్ద‌లంటారు అన్నీ మ‌న‌వేన‌ని అనుకోవ‌ద్దు.. కొన్ని సాధించాలంటే, కొన్నింటిని కోల్పోవాలి.. ఏదేమైనా ప‌రిపాల‌నా సౌల‌భ్యం కోసం కొత్త జిల్లాల‌ను స్వాగ‌తిద్దాం..

Tuesday, October 11, 2016

చరిత్రలో తెలంగాణ పునర్వ్యవస్థీకరణలు ఎన్నో..

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మరో అధ్యాయం మొదలైంది.. ఇప్పటి వరకూ ఉన్న 10 జిల్లాలు ఇప్పుడు 31 అయ్యాయి.. గతంలోని 45 రెవెన్యూ డివిజన్లు ఇప్పుడు 68కి చేరాయి.. అలాగే మండలాల సంఖ్య 459 నుండి 584కు పెరిగింది..
తెలంగాణలోని ప్రస్తుత గ్రామాల సంఖ్య 10,966.. రాష్ట్రం మొత్తం విస్తీర్ణం 1,12,077 చ.కి.మీ.. మొత్తం జనాభా 3,50,03,674 మంది..
పరిపాలనా సౌలభ్యం కోసం జరిగిన పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు కొత్తేం కాదు.. చరిత్రలో ఇలాంటి చాలా మార్పులను గమనించవచ్చు..

మౌర్యులు, శాతవాహనులు, చాళుక్యులు, విష్ణుకుండినులు, రాష్ట్ర కూటులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీల కాలం నుండి ఇలాంటి మార్పులు ఎన్నో జరిగాయి.. అసఫ్ జాహీ (నిజామ్) పాలకుల కాలం నుండి చరిత్రను గమనిస్తే..
అప్పట్లో హైదరాబాద్ స్టేట్ ను  మొదటి పేరు ‘దక్కన్ సుభా’  అందులో నాలుగు డివిజన్లు, 16 జిల్లాలు.. తెలుగు ప్రాంతాలు గుల్షానాబాద్ డివిజన్, వరంగల్ డివిజన్ల కింద ఉండేవి..
గుల్షానాబాద్ డివిజన్లో ఆత్రాప్ బల్దా (హైదరాబాద్) మెదక్, మహబాబ్ నగర్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాలు, వరంగల్ డివిజన్లో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలను ఏర్పాటు చేశారు..
1948తో హైదరాబాద్ స్టేట్ భారత దేశంలో విలీనం అయింది.. ఆ తర్వాత 1953లో వరంగల్ జిల్లా నుండి ఖమ్మం జిల్లా ఏర్పాటు చేశారు.. 1956లో హైదరాబాద్ స్టేట్ లోని తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రంను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.. 1978లో హైదరాబాద్ నుండి గ్రామీణ ప్రాంతాన్ని విడదీసి రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేశారు.. 1985లో తాలూకాల స్థానంలో మండల వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది..
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.. 2016 దసరా రోజున తెలంగాణలో కొత్తగా 21 జిల్లాలను ఏర్పాటు చేశారు..
తెలంగాణలోని ప్రస్తుత జిల్లాలు: ఆదిలాబాద్, కొమురం భీం (ఆసిఫాబాద్), నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్, వరంగల్ రూరల్, జయశంకర్ (భూపాలపల్లి), మహబూబా బాద్, జనగామ, ఖమ్మం, భద్రాద్రి (కొత్తగూడెం), మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు, జోగులాంబ (గద్వాల)..
కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో వివాదాలు ఎన్ని ఉన్నా, పరిపాలనా సౌలభ్యం కోసం స్వాగతించాల్సిన అవసరం ఉంది.. కొత్త జిల్లాల ఏర్పాటుతో అధికార వికేంద్రీకరణ జరిగి, ప్రజలకు పరిపాలనా సౌకర్యాలు మరింత చేరువ కావాలని ఆశిద్దాం.

మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు


Sunday, October 9, 2016

తెలంగాణ అస్థిత్వానికి ప్రతీక బతుకమ్మ

తెలంగాణ అంతటా సంబురం.. పల్లె, పట్నం తేడా లేదు.. తొమ్మిది రోజుల పాటు అంతటా బతుకమ్మ ఆట పాటలు..
సంస్కృతి అంటే సినిమా పాటలు, డాన్సులు, కప్పగంతులే కనిపిస్తున్నాయి.. సాంప్రదాయ, జానపద కళలు క్రమంగా మరుగున పడుతున్నాయి.. ఇలాంటి రోజుల్లో కల్తీలేని అచ్చ తెలుగుదనం, సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా నిలిచి ఉన్నాయంటే, అది బతుకమ్మ రూపంలోనే అంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు.. కష్ట సుఖాలు, ఆనందం, ప్రేమ, ఆప్యాయత, ఉత్సాహం, చరిత్ర, పురాణాలు అన్నీ బతుకమ్మ పాటల రూపంలో కనిపిస్తాయి.. బతుకు అమ్మా అనే దీవనే బతుకమ్మగా మారింది..
ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ప్రజలకే పరిమితం.. ప్రభుత్వ పరంగా పెద్దగా గుర్తింపు లేదు.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలంలో బతుకమ్మ తెలంగాణ అస్థిత్వానికి ప్రతీక అయింది.. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పరంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.. అప్పట్లో పెద్దగా పట్టించుకోని మీడియా, ఇప్పుడు ప్రతి రోజూ పెద్ద ఎత్తున ప్రత్యక్ష ప్రసారాలు చేస్తోంది.. దేశ విదేశాల్లో తెలంగాణ వారు కాకుండా తెలుగువారు, ఇతర భారతీయులు కూడా ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు..
దురదృష్టవశాత్తు కొందరు వ్యక్తులు బతుకమ్మను కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు.. గతంలో ఓ పెద్దాయన హైదరాబాద్ ను తానే కట్టాను అన్నట్లుగా చెప్పుకునేవాడు.. ఇప్పుడు బతుకమ్మను తామే కనిపెట్టామన్నట్లుగా బిల్డప్పులు ఇస్తున్నారు కొందరు.. వీరికి మనవి ఏమిటంటే బతుకమ్మను ఇలాగే బతకనివ్వండి.. ప్రజలప పండుగగానే కొనసాగించండి..

బతుకమ్మ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు..

దేశ భద్రత విషయంలో ఈ లొల్లి ఏమిటి?

స్వాతంత్ర్యానంతర భారత దేశ చరిత్రను గమనించినట్లయితే సమర్థవంతవైన నాయకత్వం ఉన్నప్పుడే శత్రు దేశానికి గట్టి బుద్ధి చెప్పగలిగాం.. ఈ విజయాలకు కారకులైన మన దేశ ప్రధానులకు ప్రజలు జేజేలు కొట్టారు.. పాకిస్థాన్ తో జరిగిన యుద్ధాల ఫలితాలు విషయాన్నే చెబుతున్నాయి..
1965లో యుద్దానికి దిగిన‌ పాకిస్థాన్‌కు గ‌ట్టి బుద్ది చెప్ప‌డం ద్వారా లాల్ బ‌హ‌ద్దూర్ శాస్త్రి దేశ ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లందుకున్నారు.. 1971లో యుద్దంలో విజ‌యం ద్వారా తూర్పు పాకిస్థాన్‌ను విడ‌దీసి బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేయ‌డంతో కీల‌క పాత్ర పోశించిన ఇందిరాగాంధీ విజ‌యేందిర‌గా కీర్తింప‌బ‌డ్డారు.. 1999లో కార్గిల్ లో కాలు దువ్విన పాకిస్థాన్ వెన్ను విర‌చిన అట‌ల్ బిహారీ వాజ‌పేయి మ‌న దేశ పౌరుషాన్ని మ‌రోసారి గుర్తు చేశారు..
ఈ యుద్దాల‌న్నింటిలో భార‌త సైన్యం ఎంతో సమర్ధవంతంగా శత్రువుల‌ను చెండాడింది.. ఎంద‌రో వీర జ‌వానులు అమ‌రులై నిజ జీవిత హీరోలుగా దేశ ప్ర‌జ‌ల హృద‌యాల్లో శాశ్వ‌త స్థానం పొందారు.. యుద్దం చేసింది సైన్యం అయినా, ఇందుకు సంబంధించిన నిర్ణ‌యాల్లో దేశ నాయ‌క‌త్వమే కీల‌క పాత్ర పోషిస్తుంది.. తెగువైన నాయ‌క‌త్వం ద్వారానే అది సాధ్యం.. అందుకే శాస్త్రీజీ, ఇందిర‌, అట‌ల్జీలను దేశ ప్ర‌జ‌లు కీర్తించారు.. ప్రతిపక్షాలు కూడా వారికి అండగా నిలిచాయి..
తాజా విషయానికి వస్తే ఉరీ ఉదంతం త‌ర్వాత భార‌త సైనికులు పీవోకేలో స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్ చేప‌ట్టిన‌ప్పుడు దేశమంతా ఆనందోత్సాహాలు వెల్లి విరిశాయి.. ప్ర‌పంచ దేశాలు భార‌త్ చ‌ర్య‌ను సమర్ధించాయి.. ఇలాంటి కీలక త‌రుణంలో దేశానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి స‌హ‌జంగానే మంచి పేరు వ‌స్తుంది.. కానీ కొందరు సంకుచిత రాజ‌కీయ నాయకులు, సోకాల్డ్ మేతావులు దీన్ని స‌హించ‌డం లేదు.. నోటికి వ‌చ్చిన పిచ్చి కూత‌లు కూస్తున్నారు.. ఆధారాలు కావాలట ఒకాయనకు.. ఖూన్ దళాల్ అంటాడు ఇంకొకాయన.. యూపీ ఎన్నికల కోసమే సర్జికల్ స్ట్రయిక్స్ అని మరి కొందరి విసుర్లు.. ఇంకా నయం మోదీ, షరీఫ్ కుమ్మక్కై ఆడుతున్న నాటకం అనలేదు ఎవరూ?..
వీరంతా గ్ర‌హించాల్సిన విష‌యం ఒక‌టి ఉంది..  ఫ్రధాని మోదీపై అక్కసు తీర్చుకోవ‌డానికి ఇది తగిన సమయం కాదు.. రాజ‌కీయంగా చాలా అవ‌కాశాలు ఉన్నాయి.. మోదీపై కోపంతో దేశ గౌర‌వానికి భంగం క‌లిగిస్తూ మ‌న సైనికుల త్యాగాల‌ను, మ‌నోభావాల‌ను కించ ప‌రిస్తే ప్ర‌జ‌లు స‌హించ‌రు.. మ‌న దేశ స‌మ‌గ్ర‌త‌, సార్వ‌భౌమ‌త్వాన్ని కాపాడుకునేందుకు ఒక‌టిగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది..

Friday, October 7, 2016

దేశం పట్ల విధేయత ఇలాగేనా?

మన దేశంలో కొందరు నాయకులు, సెలబ్రిటీలు, మేతావులను చూస్తుంటే వీరు భారతీయులేనా అనే అనుమానం కన్నా, అసలు మనుషులేనా అనిపిస్తుంది.. వీరు తినేది అన్నమేనా అని కడిగేయాలనిపిస్తుంది.. అడ్డ గాడిదలు అని తిట్టాలనుకున్నా, వీరి కన్నా ఆ గాడిదలే నయం అని సరిపెట్టుకుంటున్నాను..
ఈ దేశంలో పుట్టి, ఇక్కడే పెరుగుతూ, ఇక్కడి తిండి, నీరు, గాలితో తెగ బలిసిపోయారు.. కండ కావరమెక్కి, మతి లేకుండా మాట్లాడుతున్నారు.. తల్లి పాలు తాగి రొమ్ముగుద్దే రకం వెధవలు వీరు..  తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ సార్వభమత్వాన్ని, సరిహద్దులను కాపాడుతున్న వీర జవాన్ల త్యాగాలను తక్కువ చేస్తూ, నోటికి ఏది తోచితే అది మాట్లాడే వీరిని ఏమి చేసినా తప్పులేదు..  చెప్పు దెబ్బలు, కొరడా దెబ్బలతో సత్కరిస్తూ, నడి రోడ్డులో ఉరి తీయాలనేంత కోపం వస్తోంది..
ఉరీ సెక్టార్ పై ఉగ్రవాదుల దాడి తర్వాత మన వీర జవాన్లు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో సర్జికల్ స్ట్రయిక్ జరిపి 40 మంది ఉగ్రవాదులను మట్టు పెట్టారు.. దేశ ప్రజలంతా సంబరాలు చేసుకున్నారు.. దాదాపు ప్రపంచ దేశాలన్నీ భారత్ చర్యను సమర్ధించాయి.. ఆత్మ గౌరవం ఉన్న ఏ దేశమైనా చేసే పని ఇదే.. రాజకీయాలకు అతీతంగా పార్టీలు, ప్రజలు ఏకతాటిపై నిలిచి ప్రభుత్వం తీసుకున్న చర్యను స్వాగతించారు..  ఇదే సమయంలో కొందరి నోట పాకీ పాటలు (పాకిస్థాన్ భాష) వినిపిస్తున్నాయి.. అసలు సర్జికల్ స్ట్రయిక్ జరిగిందా? అని ఒకడు ప్రశ్నిస్తే, ఆధారాలు చూపించాలంటాడు మరొకడు.. గతంలో మేమూ ఇలాగే చేశాం కానీ ప్రచారం చేసుకోలేదని సన్నాయి నొక్కలు నొక్కుతాడు ఇంకోడు.. తమ నీఛ రాజకీయాల కోసం దేశ ప్రయోజనాలను విస్మరించి మతి లేకుండా మాట్లాడుతున్న వీరిని పాకిస్థాన్ మీడియా కీర్తిస్తోందట..
రాజకీయ నాయకుల సంగతి ఇలా ఉంటే, ఊరంతా ఒకదారి అయితే ఉలిపిరి కట్టది మరోదారి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు కొందరు సెలబ్రిటీలు, మేతావులు.. కళాకారులకు సరిహద్దులు ఉండవంటూ వగలు పోతున్నారు.. పాకిస్థానీ కళాకారులను నిషేధించడం తగదంటూ చిలక పలుకులు పలుకుతున్నారు.. సింధూ నది జలాల విషయంలో కూడా పొరుగు దేశం పాట పాడుతున్నారు..
పార్లమెంటుపై దాడి చేసిన వారిని, ముంబైలో మారణ హోమం సృష్టించి అమాయక ప్రజలను హతమార్చినవారిని ఉరి తీస్తే తప్పు పడుతూ కొవ్వొత్తు వెలిగించి నిరసన ప్రదర్శనలు జరిపిన వారు, దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లను గౌరవిస్తారని ఆశించడం మనదే తప్పు..
చివరగా నాదొక్కటే మనవి మీకు పాకిస్థాన్ మీద ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లి చావండి.. ఇక్కేడే ఉంటూ కోట్లాది మంది ప్రజల మనోభావాలను కించ పరుస్తూ మాట్లాడతామంటే అది కుదరని పని.. ఈ దేశం ఉప్పుతింటూ నమ్మక ద్రోహం చేస్తామంటే ఎవరూ ఊరుకోరు..
సైనికులు శత్రువుల నుండి దేశ ప్రజలను కాపాడతారు.. రైతులు తమ పంటలకు సోకే చీడ పురుగులను నిర్మూలిస్తాడు.. కానీ అంతర్గత శత్రువుల సంగతి ఏమిటి?.. ప్రజలే ఇలాంటి వారిని ఏరేయాలి.. (05.10.2016)

Monday, October 3, 2016

భువన గజరాజం

తెలంగాణలోని కీలకమైన దుర్గాల్లో భువనగిరి ముఖ్యమైనది.. పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన ఆరవ త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు అతి పెద్ద ఏకశిలా పర్వతం మీద త్రిభువనగిరి కోటను నిర్మించాడు.. త్రిభువనగిరి కాస్తా భువనగిరిగా ప్రసిద్ధి పొందింది.. కాకతీయుల కాలంలో వైభవం సంతరించుకున్న భువనగిరి కుతుబ్ షాహులు, అసఫ్ జాహీల కాలానికి వచ్చే సరికి వాడుకలో భోనగిరిగా మారిపోయింది..
హైదరాబాద్ నుండి 47 కిలో మీటర్ల దూరంలో ఉన్న భువనగిరి దుర్గం ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో ఉంది.. కొద్ది రోజుల్లో యాదాద్రి జిల్లాలో భాగం కానుంది.. భువనగిరి కోట అందాలను కనులారా చూసి తీరాల్సిందే తప్ప వర్ణించలేం.
భువనగిరి కోట కొండ పడమటి దిక్కు నుండి నిద్రిస్తున్న ఏనుగులా కనిపిస్తుంది.. దక్షిణం వైపు నుండి తాబేలులా అగుపిస్తుంది.. హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్లుతుండగా 163వ జాతీయ రహదారి పక్కన కనిపించిన నిద్రిస్తున్న ఈ గజరాజును నా మొబైల్ ఫోన్లో బంధించాను.. మీరు చూస్తున్న చిత్రం అదే..

Sunday, October 2, 2016

శాస్త్రీజీ ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవి..

లాల్ బహద్దూర్ శాస్త్రి మరి కొంత కాలం దేశ ప్రధానమంత్రిగా కొనసాగి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవో ఊహించుకొండి.. 

*సోకాల్డ్ గాంధీ-నెహ్రూ వంశ పారంపర్య పాలనకు జీజం పడి ఉండేది కాదు..
*శాస్త్రీజీ క్యాబినెట్లో సమాచార శాఖ మంత్రిగా పని చేస్తున నెహ్రూ తనయ ఇందిరాగాంధీకీ మరింత కీలకమైన పదవి ఇచ్చేవారు..
*ఇందిరా గాంధీ పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీ ఎయిరిండియా పైలెట్ గా రిటైర్ అయ్యి *ఉండేవాడు.. ఆ తర్వాత తనకు ఎంతో ఇష్టమైన ఫోటోగ్రఫీ హ్యాబీని కొనసాగించేవాడు..
*ఇక చదువులో అంతగా రాణించని దుందుడుకు స్వభావం గల ఇందిర రెండో కొడుకు సంజయ్ గాంధీ బహుషా విఫల పారిశ్రామికవేత్తగా మిగిలి ఉండేవారు.. కాంగ్రెస్ పార్టీలో ఒక మొస్తారు పదవి కోసం ప్రయత్నాలు చేసి ఉండేవారు..
దురదృష్టవశాత్తు లాల్ బహద్దూర్ శాస్త్రీ అకాల మరణంతో కాంగ్రెస్ లో ప్రధాని పదవి కోసం అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి.. కొందరు పెద్దలు రాజీ మార్గంగా ఇందిరాగాంధీని ప్రధానమంత్రిని చేశారు.. ఆమెను అడ్డం పెట్టుకొని ప్రభుత్వంలో చక్రం తిప్పాలను కలలు కన్నారు..
వీరందరి ఆశలను వమ్ము చేస్తూ ఏకు మేకుగా మారింది ఇందిరా గాంధీ.. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తన కంట్రోల్ లోకి తెచ్చుకుంది.. క్రమంగా తన తనయులను పార్టీలోకి తెచ్చి వంశపారంపర్య పాలనకు తెరలేపింది.. ఆ తర్వాత చరిత్ర అందరికీ తెలిసిందే..
జవహర్ లాల్ నెహ్రూ మరణం తర్వాత దేశం కిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు లాల్ బహద్దూర్ శాస్త్రీ.. చైనా యుద్ద పరాజయ అవమానం, ఆహార సమస్య దేశాన్ని పీడిస్తున్నాయి.. ప్రధాని శాస్త్రీజీ దేశంలో హరిత విప్లవానికి నాంది పలికి రైతన్నలను అధిక ఆహార ఉత్పత్తి దిశగా ప్రోత్సహించారు..
ఇంతలో పాకిస్థాన్ తో యుద్దం వచ్చిపడింది.. లాల్ బహద్దూర్ శాస్త్రి దిశా నిర్దేశ్యంతో భారత సైన్యం ఘన విజయం సాధించింది..  దేశమంతా ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి.. ‘శాస్త్రీజీ ఇచ్చిన జై జవాన్.. జై కిసాన్..’ నినాదం ఒక మంత్రంలా పని చేసింది..
తాష్కెంట్ లో భారత్- పాకిస్తాన్ ల మధ్య ఒప్పందం జరిగిన రాత్రే అనుమానాస్పద పరిస్థితుల్లో కన్ను మూశారు శాస్త్రీజీ.. ఈ ఘటనపై సరైన విచారణ కూడా జరగలేదు..
లాల్ బహద్దూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా పని చేసింది కొద్ది కాలమే అయినా నీతి నిజాయితీ, పారదర్శక పాలన, వ్యక్తిత్వాలతో దేశ ప్రజల హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించారు.. ఆయన ఇంకా కొంత కాలం బతికే ఉంటే భారత దేశ చరిత్ర మరోలా ఉండేది..

భారత దేశ మహా పుత్రుడు..

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ.. భారతమాత గొప్ప పుత్రుడు.. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ప్రముఖుల్లో, 20వ శతాబ్దంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసి వ్యక్తుల్లో అగ్ర స్థానంలో నిలిచి మహాత్ముడయ్యారు.. సత్యం, అహింస ఆయన ఆయుధాలు.. సత్యాగ్రహం, సహాయ నిరాకరణ విధానాలను ఆచరణలో చూపించారు.. జాత్యహంకారం, అంటరానితనం, మద్యపానం, సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడారు గాంధీజీ..
రామరాజ్యం, గ్రామస్వరాజ్యం కోసం కలలు కన్నారు మహాత్మా గాంధీ.. గ్రామ సీమలు సస్యశ్యామంగా ఉంటే దేశం పచ్చగా ఉంటుందని చెప్పేవారు.. గో ఆధారిత ఆర్థిక వ్యవస్థపై సంపూర్ణ నమ్మకం ఉన్న గాంధీజీ, సంపూర్ణ గోవధ నిషేధానికి పిలుపునిచ్చారు..
స్వదేశీ, స్వావలంభన కోసం పిలుపునివ్వమే కాదు స్వయంగా నూలు వడికి అవే వస్త్రాలు ధరించారు గాంధీజీ.. ఆనాటి దేశ ప్రజల కష్టాలను చూసి ఒంటిపై రెండే వస్త్రాలు ధరించడం ద్వారా జీవితాంతం నిరాడంభరంగా జీవించారు.. మహిళలు అర్ధరాత్రి నిర్భయంగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని చెప్పారా మహాత్ముడు.. పరిసరాల పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన గాంధీ, స్వయంగా చీపురుపట్టి వీధులు ఊడ్చారు.. మరుగుదొడ్లను శుభ్రం చేశారు.. స్వచ్ఛ్ భారత్ అభియాన్ కు ఇదే స్పూర్తి..
గాంధీజీ బోధనలు ఆనాటి భారత దేశ కాలమాన పరిస్థితులకు అనుకూలమైనవని, నేటి తరం ఆచరించడం కష్టం అంటారు కొందరు వ్యక్తులు.. కాలానుగుణంగా మార్పులు సహజం.. కానీ గాంధీ బోధనలు, మూల సూత్రాలను స్పూర్తిగా తీసుకొని ఆచరించడం మంచిదే.. గాంధీజీ మాదిరిగా రెండు వస్త్రాలు ధరించాల్సిన అవసరం లేదు.. కానీ ఆయన నిరాడంబరత, నిజాయితీ, నిస్వార్ధం ఆచరణ యోగ్యమే కదా.. తన జీవితమే ఒక సందేశం అని ఆచరణలో చూపించిన గాంధీజీ అందరికీ ఆదర్శప్రాయం.

మహాత్మాగాంధీని జాతిపిత అనడం మహా అపరాధం.. కొందరు మిడిమిడి తెలివితో సృష్టించిన పదం ఇది.. గాంధీజీకన్నా 5000 సంవత్సరాల ముందు కాలం నుండే భారతదేశం ఉనికిలో ఉంది.. భారతమాత మహాపుత్రుడు అనడం సమంజసం.. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకొని, స్పూర్తిని నింపుకుందాం..

గట్టివాడు మన శాస్త్రీజీ..

‘జై జవాన్.. జై కిసాన్..’ ఎంత గొప్ప నినాదం ఇది.. దేశ సరిహద్దులను కాపాడే సైనికున్ని, అన్నం పెట్టే రైతన్నకు జై కొడుతూ ఇచ్చిన నినాదం.. ఈ నినాదం వినగానే ద్వితీయ ప్రధానమంత్రి లాల్ బహద్దూర్ శాస్త్రి గుర్తురాక మానరు..
చైనాతో జరిగిన యుద్దంలో పరాజయం తర్వాత జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం మన దేశం ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. ఇలాంటి సమయంలో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు లాల్ బహద్దూర్ శాస్త్రి.. ఇంతలోనే పాకిస్థాన్ తో మళ్లీ యుద్దం వచ్చింది.. శాస్త్రీజీ ఇచ్చిన స్పూర్తితో మన వీర జవానులు ఆ దేశాన్ని తక్కుగా ఓడించారు.. దేశం విజయగర్వంతో మళ్లీ తలెత్తుకుంది..
ఈ యుద్దం తర్వాత సోవియట్ యూనియన్ లోని తాష్కెంట్ లో భారత్, పాకిస్తాన్ ల మధ్య శిఖరాగ్ర చర్చలు జరిగాయి.. ప్రధాని లాల్ బహద్దూర్ శాస్త్రి, పాక్ నియంత అయూబ్ ఖాన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.. అదే రోజు రాత్రి అనుమానాస్పద పరిస్థితుల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో దివంగతులయ్యారు శాస్త్రీజీ.. 
నీతి, నిజాయితి నిరాడంబరతలకు ప్రతిరూపంగా నిలిచిన మహోన్నత వ్యక్తి లాల్ బహద్దూర్ శాస్త్రి.. ఆయన దేశానికి చాలా తక్కువ కాలం ప్రధానమంత్రిగా ఉన్నారు.. కానీ ప్రజల హృదయాల్లో తనదైన చెరగని ముద్ర వేశారు.. పొట్టి వాడైనా గట్టివాడినని నిరూపించుకున్నారు..  శాస్త్రీజీ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో నల్లగొండ జిల్లాలో ఒక రైలు ప్రమాదం జరిగింది.. ప్రయాణీకులకు భద్రత కల్పించడంలో విఫలం అయ్యాననే పశ్చాతాపంతో నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేశారాయన..
మహాత్మాగాంధీ సిద్దాంతాలను ఆచరించి చూపించారు లాల్ బహద్దూర్ శాస్త్రీజీ.. గాంధీజీ జన్మదినం రోజునే శాస్త్రీజీకూడా పుట్టారు..  ‘జై జవాన్.. జై కిసాన్..’ నినాదం ఇచ్చిన ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పిద్దాం.. (అక్టోబర్ 2, 1904 లాల్ బహద్దూర్ శాస్త్రి జయంతి)

Saturday, October 1, 2016

పాకిస్థాన్ కాలగర్భంలో కలుస్తుందా?

పాకిస్థాన్ భ‌విష్య‌త్తు ఏమిటి?.. ఇప్ప‌డు అంద‌రి ముందున్న ప్ర‌శ్న ఇది.. దీనికి స‌రైన స‌మాధానం ఏమిటంటే?.. స‌మీప భ‌విష్య‌త్తులో ఆ దేశం త‌న‌ ఉనికిని, ఎల్ల‌ల‌నూ కోల్పోనుంది.. ఇది స్వ‌ప్నం కాదు.. వాస్త‌వం..
పాకిస్థాన్ మ‌తం ఆధారంగా ఏర్ప‌డిన దేశం.. బ్రిటిష్ వారు పోతూ, పోతూ భార‌తదేశాన్ని విడ‌గొట్టి పాకిస్థాన్‌ను ఏర్పాటు చేశారు.. ఆ దేశానికి సొంత చ‌రిత్ర లేదు.. భార‌త దేశ చ‌రిత్రే వారి చ‌రిత్ర‌.. కానీ ఈ చ‌రిత్ర‌ను వారు త‌మ పిల్ల‌ల‌కు బోధించ‌రు.. ఎందుకంటే దేశ‌ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుల‌ను గుర్తు చేసుకోవ‌డం ఆ దేశ పాల‌కుల‌కు ఇష్టం ఉండ‌దు..


త‌మ సంస్కృతిక వార‌స‌త్వాన్ని మ‌ర‌చిపోవ‌డ‌మే పాకిస్థాన్ చేసుకున్న పెద్ద త‌ప్పిదం.. కేవ‌లం మ‌తం ఆధారంగా ఏర్ప‌డ్డా, ఆ భావ‌న వారిని ఒక‌టిగా ఉంచ‌లేక‌పోతోంది.. ఆ దేశంలో అంద‌రూ ముస్లింలే, అయినా నిత్యం కొట్టుకు చ‌స్తారు.. వ‌ర్గాలు, తెగ‌ల కుంప‌టిలో నిత్యం అశాంతితో ర‌గులిపోతోంది పాకిస్థాన్‌..
పాకిస్థాన్ అధికార భాష ఉర్ధూ.. విచిత్రం ఏమిటంటే ఉర్దూ మాట్లాడేవారు భార‌త దేశంలోనే అధికం.. పాకిస్థాన్‌లో ఏ ఒక్క‌రి మాతృభాష ఉర్దూ కాదు.. అక్కడ పంజాబీ, సిందీ, బ‌లూచి, ప‌ష్తో భాష‌లు మాట్లాడేవారు ఎక్కువ‌.. ఇవే కాకుండా స్థానికంగా అనేక భాష‌లు ఉనికిలో ఉన్నాయి.. ఉర్ధూ భాష‌ను బ‌ల‌వంతంగా రుద్దేందుకు పాకిస్థాన్ పాల‌కులు చేసిన ప్ర‌య‌త్నాలు బెడిసికొట్టాయి.. ఫ‌లితంగా 1971లో తూర్పు పాకిస్థాన్ విడిపోయి బంగ్లాదేశ్ ఆవిర్భ‌వించింది.. అయినా పాక్ పాల‌కుల‌కు బుద్ది రాలేదు.. స్థానిక భాష‌లు, తెగ‌లు, సంస్కృతుల‌ను కాల‌రాచేందుకు నిరంత‌రం ప్ర‌య‌త్నిస్తుంటారు..
అంత‌ర్గ‌త స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోలేని దుస్థితిలో ఉన్న  పాకిస్థాన్, త‌మ దేశ ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చేందుకు కశ్మీర్ స‌మ‌స్య‌ను ర‌గిలిస్తోంది.. మూడో వంతు క‌శ్మీర్ ను ఆక్ర‌మించుకొని అక్క‌డి ప్ర‌జ‌ల‌ను చిత్ర హింస‌ల‌కు గురి చేస్తోంది.. ఆక్ర‌మిత కాశ్మీర్ (గిల్గిత్-బాల్టిస్థాన్‌) మొత్తాన్ని వ‌ల‌స‌ల‌తో నింపేసింది.  అక్కడ ప్రజాస్వామ్యం అనేదే కనిపించదు.. మ‌రోవైపు క‌శ్మీర్‌లో వేర్పాటు వాదులను ప్రోత్స‌హిస్తోంది.. భార‌త దేశంలోకి ఉగ్ర‌వాదుల‌ను పంపి దాడులను జ‌రిపిస్తోంది.. మ‌న దేశంలో జ‌రిగిన అన్ని ఉగ్ర‌వాద ఘ‌ట‌న‌ల్లో పాకిస్థాన్ ప్ర‌మేయం స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నా, త‌మ‌కేమీ తెలియ‌ద‌ని బుఖాయించ‌డం పాకిస్థాన్ పాల‌కుల‌కు అల‌వాటైపోయింది..
ఇంత కాలం ఓర్పుతో వ్య‌వ‌హ‌రించిన బార‌త్ ఇప్పుడు పాకిస్థాన్‌కు వారి ప‌ద్ద‌తిలోనే బుద్ధి చెప్ప‌డానికి సిద్ద‌మైంది.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ బ‌లూచిస్తాన్ వ్య‌వ‌హారాన్ని ప్ర‌స్థావించ‌డంతో ఇర‌కాటంలో ప‌డిపోయిన పాక్‌.. దిక్కు తోచ‌ని స్థితిలో ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలు, స‌రిహ‌ద్దుల్లో కాల్పుల‌ను ముమ్మ‌రం చేసింది.. ఉరీ ఘ‌ట‌న త‌ర్వాత భార‌త సైన్యం అంతే ధీటుగా పాకిస్థాన్‌కు స‌మాధానం చెప్పింది..
1947
లో ఏర్ప‌డిన పాకిస్థాన్‌, 1971లో బంగ్దాదేశ్ (తూర్పు పాకిస్థాన్‌)ను కోల్పోయింది.. ఇక బ‌లూచిస్థాన్ ప్రావిన్స్  కూడా ఆ దేశం నుండి విడిపోయేందుకు సిద్ద‌మ‌వుతోంది.. సింధ్ ప్రావిన్స్‌లో సింధ్ దేశ్ కోసం పోరాటం జ‌రుగుతోంది.. అటు వాయువ్య స‌రిహ‌ద్దు ప్రావిన్స్‌లో గిరిజ‌న తెగ‌లు ప‌క్తూనిస్థాన్ కోసం ఎప్ప‌టి నుండో పోరాడుతున్నారు.. చివ‌ర‌కు పాకిస్థాన్ దేశం పంజాబ్ ప్రావిన్స్ (ప‌శ్చిమ పంజాబ్‌)కే ప‌రిమితం కానుందా?
'
వినాశకాలే విప‌రీత బుద్ది..' చెర‌ప‌కురా చెడేవు..' అన్నారు మ‌న పెద్ద‌లు.. పాకిస్థాన్ చేస్తున్న ప‌ని ఇదే.. త‌న గోరీని తానే త‌వ్వుకుంటోంది ఆ దేశం..