Monday, October 31, 2016

భారత జాతిని ఐక్య పరిచిన ఉక్కుమనిషి

బ్రిటిష్ వారు భారత దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చి వెళ్లారు.. ఉక్కుమనిషి భారత దేశాన్ని సమైక్య పరిచారు.. వారు ముక్కలుగా వదిలేసి పోతే, ఆయన అన్నింటికీ కలిపారు.. విశాల భారత దేశ విలీనాధీశునిగా చరిత్రలో శాశ్వత స్థానం దక్కించుకున్నారు.. నవ భారత దేశ నిర్మాత సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి అక్టోబర్ 31ని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నాం..
గుజరాత్ రాష్ట్రంలోని నదియాద్ లో 31 అక్టోబర్ 1875 నాడు జన్మించారు వల్లభాయ్ పటేల్.. ఇంగ్లాండ్ లో బారిస్టర్ చదువుకొని వచ్చి అహ్మదాబాద్ లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఈ క్రమంలో భారత స్వాతంత్ర్య పోరాటంలో చేరారు వల్లభాయ్.. సహాయ నిరాకరణ, బర్దోలీ సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకైన పాత్రను పోశించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను జైలు పాలు చేసింది.. 1931లో కరాచీలో జరిగిన ఆలిండియా కాంగ్రెస్ మహాసభల్లో పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు..
సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ స్వాతంత్ర్యం తర్వాత ఉప ప్రధానమంత్రి పదవి చేపట్టారు.. 565 స్వదేశీ సంస్థానాలను భారత దేశంలో సంపూర్ణంగా విలీనం చేయడం ద్వారా నవ భారతానికి బాటలు వేశారు.. విలీనం కావడానికి మొండికేసిన హైదరాబాద్ సంస్థానంపై పోలీస్ యాక్షన్ చేపట్టి నిజాం నవాబును దారికి తెచ్చారు.. ప్రధాని నెహ్రూ ద్వంద్వ వైఖరి కారణంగా జమ్మూ కాశ్మీర్ పూర్తిగా పాకిస్థాన్ కబ్జాలోకి వెళ్లకుండా కాపాటంలో పటేల్ పాత్ర విస్మరించలేనిది.. భారత రాజ్యాంగ రచనలో ప్రాథమిక హక్కుల కమిటీ ఛైర్మన్ గా వ్యవహరించారు.. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ప్రారంభించారు.. వల్లభాయ్ పటేల్ 15 డిసెంబర్, 1950లో మనకు శాశ్వతంగా దూరమయ్యారు..

కాంగ్రెస్ పార్టీలో గాంధీ, నెహ్రూలకు భిన్నంగా దేశ ప్రయోజనాలకు కాపాటంతో దృఢ వైఖరిని అవలంభించిన సర్దార్ పటేల్ ఉక్కు మనిషిగా పేరు తెచ్చుకున్నారు.. ఆయన తొలి ప్రధాని అయ్యుంటే భారత దేశ చరిత్ర మరింత మెరుగ్గా ఉండేదని చెప్పక తప్పదు.. పటేల్ కఠిన సంకల్పం కారణంగా ముక్కలు, చెక్కులుగా ఉన్న సంస్థానాలు దేశంలో పూర్తిగా కలిపిపోయాయి.. లేకపోతే జాతీయ సమైక్యతకు తీవ్ర విఘాతం కలిగేది.. అందుకే పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.. ముఖ్యంగా మన తెలంగాణ (హైదరాబాద్ స్టేట్) ప్రజలకు సర్దార్ పటేల్ ప్రాత స్మరణీయుడు..

No comments:

Post a Comment