Wednesday, December 9, 2015

అత్తను మించిన కోడలు..

తాను ఇందిరా గాంధీ కోడలినని, ఎవరికీ భయపడనని ప్రకటించుకున్నారు సోనియా గాంధీ.. ఈ విషయంలో ఎవరికీ అనుమానం లేదు.. రాజీవ్ గాంధీ భార్య నిస్సందేహంగా ఇందిరకు కోడలే అవుతుంది కదా?.. సోనియా ఎవరికీ భయపడనంటున్నారు.. అదే కదా దేశ ప్రజలకు భయం..
ఇందిరా గాంధీ ప్రధాని పదవిలో ఉన్నప్పుడు  అలహాబాద్ హైకోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే సహించలేక ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, పౌర హక్కులను కాలరాసి దేశంలో ఎమర్జెన్సీ విధించారు.. కొడుకు సంజయ్ గాంధీ అరాకచాలతో ఆమెకు అండగా నిలిచారు..  చరిత్రలో నియంతగా పేరు తెచ్చుకున్నారు ఇందిర..

ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ పత్రిక కుంభకోణంలో ఢిల్లీ హైకోర్టు తన ముందు హాజరు కమ్మని సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీలను ఆదేశించింది.. దీనికి గగ్గోలు పెడుతూ విషయం ఏమిటో చెప్పకుండా పార్లమెంటును అడ్డుకున్నారు కాంగ్రెస్ ఎంపీలు.. ఈ సందర్భంగా తాను ఇందిర కోడలినని గుర్తు చేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు సోనియా.. తాటాకు చప్పుళ్లకు మోదీ సర్కార్ భయపడుతుందంటారా?

No comments:

Post a Comment