Thursday, December 17, 2015

వదంతులు ప్రచారం చేయకండి

నమ్మే వాడుంటే చేవిలో పువ్వు పెట్టేవాడు ఎప్పుడూ సిద్దంగానే ఉంటాడు. ఇటీవల వాట్సప్, ఫేస్ బుక్, తరతర సోషల్ మీడియా మెసెంజర్ సర్వీసుల్లో వస్తున్న వదంతులు ఈ తరహాలోనివే.
నరేంద్ర మోదీ ప్రభుత్వం డిజిటల్ ఇండియా పథకం కోసం 12 జీబీ డాటా, రూ.1029 టాక్ టైమ్ ఇస్తోంది.. దీన్ని 10 మంది మిత్రులకు షేర్ చేయాలి.. 5 నిమిషాల తర్వాత బ్యాలన్స్ వస్తుంది. ఇందు కోసం కింది మొబైట్ నెట్ వర్క్ నెంబర్స్ డయల్ చేయండి. ఇది చూసి నేను కూడా షాక్ అయ్యాను.. కానీ ఇది నిజం. ప్రయత్నించండి..
ఈ మెసేజ్ చూసి వారంతా నిజమేనని గుడ్డిగా నమ్మేస్తూ అందరికీ ఫార్వర్డ్ చేస్తున్నారు. కనీసం నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. ప్రధాని మోదీ ప్రజలకు ఏమైనా లబ్ది చేకూర్చే పథకం ప్రారంభిస్తే బహిరంగంగా ప్రకటిస్తారు.. పత్రికల్లో, టీవీల్లో ప్రకటనలు ఇచ్చి అందరికీ తెలిసేలా చేస్తారు. కానీ ఇలా రహస్యంగా సోషల్ మీడియాలో మెజేజ్ వదంతులు వ్యాపింపజేయరు. కాస్త ఇంగితంతో ఆలోచించండి. మీకు ఇలాంటి మెజేస్ వస్తే పంపిన వాడిని నిలదీయండి.. కనీసం వాడు ప్రయత్నించి చూశాడా అపి ప్రశ్నించడండి.. ప్రయత్నించలేదని చెబితే, మరి ఎందుకు మెజేస్ పంపావని అడగండి..

ఇలాంటి వదంతులను కట్టడి చేయడానికి ఇదొక్కటే మార్గం..

No comments:

Post a Comment