Thursday, December 17, 2015

స్నేహ హస్తం వెనుక మతలబు ఇదేనా?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీతో సంబంధాల విషయంలో వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు.. ఇటీవలి కాలంలో రెండు సార్లు విజయవాడ వెళ్లడం, ఏపీ సీఎం చంద్రబాబును తాను తలపెట్టిన యాగానికి ఆహ్వానించడం పక్కా స్కెచ్ ప్రకారమే జరిగింది.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఉంది కేసీఆర్ ఎత్తుగడ.. స్నేహ హస్తం అందించడం ద్వారా ఆంధ్రా ప్రజలను సంతోషపరచడమే కాదు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్లోని సీమాంధ్రుల ఓట్లు సాధించాలని ఆయన భావించినట్లు తెలుస్తోంది.. పొరుగు రాష్ట్రంతో సఖ్యతగా మెలగాలని కేసీఆర్ భావిస్తే మంచిదే.. అది జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కూడా కొనసాగాలి..

No comments:

Post a Comment