Saturday, December 26, 2015

ప్రజాస్వామ్యం, వారసత్వ రాజకీయాలకు తేడా..

2014లో భారత్, బ్రిటన్ దేశాల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి.. బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీ పరాజయం పాలైంది.. అంతకు ముందు ఎన్నికల్లో ఆ పార్టీకి 256 సీట్లు రాగా, తాజ ఎన్నికల్లోల 24 సీట్లు క్షీణించి 232 సాట్లు వచ్చాయి..
భారత దేశంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది.. ఆ పార్టీకి గతంలో 206 సీట్లు ఉంటే 2014 ఎన్నికల్లో ఘోరంగా 44కి పడిపోయాయి..
ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తే బ్రిటన్ లేబర్ పార్టీ అధ్యక్ష పదవికి తక్షణ రాజీనామా చేశారు.. మరి ఇండియాలో?.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పదవి పదిలం..
మన దేశంలో 2004, 2009 ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలైనప్పుడు ఆ పార్టీ అధ్యక్షులు రాజీనామా చేశారు.. ప్రధాని అభ్యర్ధిగా ఉన్నఅగ్ర నాయకుడు లాల్ కృష్ణ అడ్వానీ సైతం ప్రజాభిప్రాయానికి తలొంచక తప్పలేదు..
అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న  రాజకీయ పార్టీలకు, వారసత్వ రాజకీయ పార్టీలకు ఉన్న తేడా ఇదే.. 

No comments:

Post a Comment