Monday, November 9, 2015

ఎవరికీ అనుకూలం కాని బీహారీ తీర్పు..

బిహారీ ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా విలక్షణం.. నితిష్ కుమార్ సమర్ధ నాయకత్వంపై వారు మొగ్గు చూపారని ప్రచారం జరుగుతున్నా, అక్కడ కుల, మత ఓట్ల సమీకరణే ప్రధానంగా కనిపిస్తోంది.. మహాకూటమిలోని నితిష్ కుమార్ పార్టీ జేడీయూకు గతంలో కన్నా ఓట్ల శాతం, సీట్ల శాతం తగ్గడమే ఇందుకు ఉదాహరణ.. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ గణనీయంగా సీట్లను సాధించినా, ఓట్ల శాతం తగ్గింది.. అలాగే బీజీపీకి సీట్లు తగ్గినా ఓట్ల శాతం పెరిగింది.. కింగ్ మేకర్ లాలూ వల్ల నితిష్ కష్టాలు ఎదుర్కోక తప్పేట్లు లేదు..
బీజేపీకి స్థానికంగా సమర్ధ నాయకత్వం లేకపోవడం శాపంగా మారింది.. ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందే ప్రకటించి ఉంటే ఫలితాలు మెరుగ్గా ఉండేవి.. మరోవైపు బీజీపీలో శతృఘ్న సిన్హా లాంటి నాయకులు సైందవ పాత్ర పోశించి పార్టీకి నష్టం కలిగించారు. దీనికి తోడు బీజేపీ నేతల అతి వాగాడంబరం కూడా ఇబ్బంది కలిగించింది.. బిహారీలు ఢిల్లీ ఓటర్ల తరహాలోనే కేంద్రంలో మోదీ, స్థానికంగా నితిష్ ఉండాలని భావించారు..
కాంగ్రెస్ పార్టీ గతంలోకన్నా మెరుగ్గా రెండంకెల సీట్లు సాధించినా, అది మహాకూటమి దయాదాక్షిణ్యాల వల్లే.. దీనివల్ల ఆ పార్టీకి బిహార్లో దక్కే దీర్ఘకాల లాభం ఏదీ లేదు.. ఇక ఎంఐఎం ఎన్ని పగల్బాలు పలికినా ఓటర్ల ఆదరణ పొందలేదు.. ఎంఐఎం సఫలం అయ్యుంటే ఆలాభం బీజేపీకే సీట్లు రూపంలో దక్కేది..
సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ బల్ల గుద్ది చెబుతున్నట్లుగా జాతీయ రాజకీయాల ప్రభావం బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఏ మాత్రం కనిపించలేదు..

No comments:

Post a Comment