Thursday, November 12, 2015

కెంపెగౌడ జోలికి వెళ్లి భంగపడ్డ కర్నాడ్

హిరియ కెంపెగౌడ (క్రీ.శ.1510-1569) యలహంకనాడు పాలకుడు.. శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో విజయనగర సామ్రాజ్య సామంతునిగా పని చేశారు. కెంపెగౌడ 1537సం.లో బెంగళూరు నగర నిర్మాణానికి పునాది వేశారు. విద్యావంతుడైన, సమర్ధపాలకుడిగా పేరు తెచ్చుకున్న కెంపెగౌడ అంటే కన్నడ ప్రజలు ఎంతో అభిమానిస్తారు.. బెంగళూరు విమానాశ్రయానికి ఆయన పేరే ఉంది.. కెంపెగౌడ పేరు తొలగించి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని గిరీష్ కర్నాడ్ సూచిస్తున్నారు.. దీంతో అన్ని వర్గాల ప్రజలు ఒక్కసారిగా ఆయనపై మండి పడ్డారు.. కొందరైతే బెదిరించారు.. ఆందోళనకు గురైన గిరీష్ కర్నాడ్, తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పుకోక తప్పలేదు.. చేతుల కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే..

No comments:

Post a Comment