Thursday, November 5, 2015

ఏమిటీ అసహనం?..

దేశంలో అసహనం పెరిగిపోతోందా?.. ఇదెప్పటి నుండి?.. ప్రధానిగా నరేంద్ర మోదీ అధికారం చేపట్టినప్పటి నుండే ఈ అసహనం మొదలైందా?.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అసహనం లేదా?.. అసహన ఘటనలన్నీ బీజేపీలో జరిగాయా?. కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో అంతా సవ్యంగా ఉందా?.. ఇంతకీ నరేంద్ర మోదీపై వీరికి ఎందుకు అంత అసహనం?.. ఇప్పుడు యాగీ చేస్తున్నా వారంతా కాంగ్రెస్ హయాంలో ఎందుకు నోరు మెదపలేదు?.. అప్పుడు గాఢ నిద్రలో ఉండి ఇప్పుడే నిద్ర లేచారా?.. సోకాల్డ్ మేధావులంతా తమ పురస్కారాలను ఎందుకు తిరిగి ఇచ్చేస్తున్నారు?.. అవార్డులు మాత్రమే ఇచ్చేసి దాని వెంట వచ్చిన నగదు మాత్రం ఎందుకు దాచుకుంటున్నారు?.. ఇంతకీ వీరంతా ఎవరు?.. అవార్డులు ఎలా వచ్చాయి?.. వీరి భావజాలం ఏమిటి?.. ఎవరు ప్రేరేపిస్తున్నారు?.. వీరికి ఎందుకింత పబ్లిసిటీ కల్పిస్తున్నారు?.. అసహన ప్రచారం వెనుక కుట్ర కోణం ఉందా?..

ఈ అంశాలన్నింటిపై సమగ్ర విచారణ జరగాలి.. ఈ అసహన దుమారం వెనుక అసలు వాస్తవాలు ఏమిటో నిగ్గు తేలాల్సిందే.. 

No comments:

Post a Comment