Sunday, November 15, 2015

ఈ పాపం ఎవరిది?

ప్రపంచంలో భద్రమైన చోటంటూ ఉందా?.. సురక్షితం అనుకున్న ప్రాంతాలే ఇప్పుడు టార్గెట్ అయిపోతున్నాయి..  పారిస్ నగరంలో ఉగ్రవాదులు దారుణ మారణకాండకు పాల్పడటం ప్రపంచాన్ని మరోసారి భయపడిపోయింది.. ముంబైతో పాటు ఎన్నో ఉగ్రదాడులను చూసిన మనకు ఇవి కొత్తగా కనిపించకపోవచ్చు.. ప్రపంచాన్ని శాసించాలని చూస్తున్న సోకాల్డ్ అగ్ర దేశాలన్నీ ఇప్పుడు ఉగ్ర భూతాలను చూసి జడుసుకుంటున్నాయి.. మరి ఇవన్నీ వారు పోషించిన పాములే కదా?.. అందుకే అంటారు మన పెద్దలు, చేసుకున్న వారికి చేసుకున్నంత అని..
రెండు ప్రపంచ యుద్దాల తర్వాత వలసవాద దేశాలు స్వాతంత్ర్యం పొందాయి.. కానీ అగ్రరాజ్యాలుగా అవిర్భవించిన అమెరికా, సోవియట్ యూనియన్ల చుట్టూ ప్రపంచ దేశాలు చేరిపోయాయి.. నడుమ అలీన విధానమంటూ హడావిడి చేసిన మన నెహ్రూ మహానుభావుడు, మధ్యలోనే జెండా ఏత్తేసి బలవంతంగా మన దేశాన్ని సోవియట్ శిబిరంలో దించాడు.. దీంతో మన దాయాది పాకిస్తాన్ అమెరికా పంచన చేరింది.. ఈ రెండు అగ్ర దేశాలు తమ ప్రాభల్యం, ప్రయోజనాల కోసం మధ్యప్రాచ్య దేశాల్లో చిచ్చు పెట్టాయి.. కాలక్రమంలో సోవియట్ యూనియన్ పతనం తర్వాత అమెరికా కేంద్రంగా ఏకదృవ ప్రచంచం ఏర్పడింది.. ఒకప్పడు అమెరికా మిత్ర దేశాలు రగిల్చిన ఆ చిచ్చు ఫలితమే ఈ ఉగ్ర భూతాలు..

తన దాకా వస్తే కాని తెలియదన్నట్లు, ట్విన్ టవర్లపై దాడి తర్వాత ఉగ్రవాదంపై యుద్దం అంటూ చెలరేగిపోయింది అమెరికా.. వారి స్థావరాలపై దాడులకు దిగింది.. చల్లా చెదురైన ఈ మూకలే ఇప్పుడు ప్రపంచ దేశాలపై పడ్డాయి.. చంపిన కొద్దీ పుట్టుకొస్తున్నాయీ పాములు.. నిన్న అల్ ఖైదా, ఇవాళ ఐఎస్ఐఎస్.. రేపు మరో సంస్థ ఏదైనా రావచ్చు.. మన దేశం విషయానికి వస్తే ఓటు బ్యాంకు రాజకీయాలు ఉగ్రవాదులకు వరంగా మారాయి.. సమస్యను మతం కోణంలో చూస్తూ, టాడా, పోటా వంటి కఠిన చట్టాలను నీరు గారుస్తున్నాం.. మన దేశంలో ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్న పాకిస్తాన్ కు సాయం చేస్తున్నది ఎవరు?.. సోవియట్ శిబిరాన్ని వదిలి, అమెరికా పంచన చేరితే సమస్య పరిష్కారం కాదు.. మన దేశం స్వతంత్ర శక్తిగా ఎదగాలి.. హనుమంతునిలా మన శక్తిని మనం గుర్తించక పోవడమే అసలు సమస్య.. ఆలోచించండి..

No comments:

Post a Comment