Thursday, September 17, 2015

పటేల్ గారిని స్మరించుకోవడం మన విధి..

హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో సంపూర్ణంగా విలీనమై ఇక్కడి ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు.. ఇందుకు కారణం ఎవరో తెలుసా?.. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్..
స్వతంత్ర భారత దేశ తొలి హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సర్ధార్ పటేల్, ముందుగా స్వదేశీ సంస్థానాలపై దృష్టి సారించారు.. బ్రిటిష్ వారు పోతూ పోతూ మెలిక పెట్టి పోయారు.. సంస్థానాలు భారత్, పాకిస్తాన్ ఎందులైనా విలీనం కావచ్చట.. లేదా స్వతంత్రంగా ఉండొచ్చట.. ఇది దేశ సమగ్రతకు మప్పు అని గ్రహించారు పటేల్.. ఐదు వందల పైచిలుకు సంస్థానాలను విలీనం చేయడలో విజయం సాధించారు.. ఈ క్రమంలో మొండి కేసిన హైదరాబాద్, జునాగడ్ లను సైనిక చర్య ద్వారా దారికి తెచ్చారు..
హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ ప్రాంతం కాలక్రమంలో ఆంధ్ర్రప్రదేశ్ లో కనిసింది.. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలోగా ఆవిర్భవించింది.. కానీ ఈ పరిణామాలన్నింటికీ మూలం ఉక్కు మనిషి సర్ధార్ పటేల్.. పటేల్ ఆ రోజున హైదరాబాద్ సమస్యను ప్రధాని నెహ్రూకు అప్పగించి ఉంటే?.. జమ్మూ కాశ్మీర్ సమస్యలా ఈనాటికీ రగులుతూనే ఉండేది.. హైదరాబాద్ విమోజన సందర్భంగా ఉక్కు మనిషిని స్మరించుకోవడం తెలంగాణ ప్రజల విధి..

1 comment:

  1. తెలంగాణను ఆంధ్రాలో కలుపుతారట..! మరిన్ని తెలంగాణ నేటి తాజా వార్తల కోసం..click here

    ReplyDelete