Sunday, February 14, 2016

ఉగ్రవాదుల మద్దతు కేంద్రంగా JNU

' ఇండియా డౌన్ డౌన్..
పాకిస్తాన్ జిందాబాద్..
కాశ్మీర్ విముక్తి పొందేదాక యుద్ధం కొనసాగుతుంది..
భారత దేశం నాశనం అయ్యే వరకు ఈ యుద్ధం..'
అమరవీరుడా అఫ్జల్ గురు.. నీ ఆశయాన్ని నెరవేరుస్తాం..
ఇండియా గో బ్యాక్‌..
జమ్మూకాశ్మీర్ కు స్వతంత్ర్యం ఇవాల్సిసిందే..’
ఈ స్లోగన్స్ పాకిస్థాన్లో చేసినవి కాదు.. మన దేశ రాజధాని ఢిల్లీలోని JNUలో వినిపించిన నినాదాలు ఇవి.. మన దేశంలో పుట్టి.. మన దేశంలో పెరిగి.. దేశ ప్రజలు కట్టిన ట్యాక్స్ ద్వారా.. సబ్సిడీ ద్వారా ఉన్నత చదువులు చదుకుంటున్న విద్యార్థులు ఇలా ప్రవర్తించడం దారుణం..

మన దేశంలో అమాయక ప్రజలను పొట్టన బెట్టుకుంటున్న పాకిస్థాన్‌ను.. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను మద్దతిస్తున్న ఈ విద్యార్థులు అసలు మనుషులేనా? యాకుబ్‌ మెమెన్‌.. అఫ్జల్ గురు లాంటి వారి మీద ఇంత ప్రేమ చూపిస్తున్న వీళ్లు.. మరి వీరి అరాచకాల కారణంగా.. వందలాది మంది భారతీయులు మీద చనిపోయారన్న స్పృహ ఏమాత్రం వీళ్లకు ఉందా..
ఒక్క JNUలొనే కాదు.. HCUతో సహా దేశంలోని యూనివర్సిటిల్లో కొన్ని విద్యార్థి సంఘాలు ఇంత నీచాతినీచంగా ప్రవర్తిస్తున్నారు.
ఇది ఒక మతానికో, కులానికో సంబంధించిన విషయం కాదు.. భారత దేశ స్వతంత్రం, సార్వభౌమత్వం, రాజ్యాంగం, ప్రజల మనోభావాలను సవాలు చేస్తున్న కొన్ని విదేశీ శక్తులు యూనివర్సిటీలను విద్రోహ కార్యకలాపాలకు వాడుకుంటున్నాయి..
దేశ ప్రజలంతా అప్రమత్తం కావాలి.. ఇలాంటి శక్తులను, వారికి మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలు, సంస్థలను దేశం నుండి తరిమి కొట్టాలి..

No comments:

Post a Comment