Thursday, February 11, 2016

మేడారం స్పెషల్ బస్సులకు అధనపు బాదుడు ఎందుకు?

పూర్వం తీర్థయాత్రలకు వెళ్లే యాత్రీకుల నుండి జిజియా పన్ను వసూలు చేసేవారు.. దారిలో బందిపోట్లు దోచుకునేవారు.. ఇప్పుడు ఈ బాధ్యతను సెక్యులర్ ప్రభుత్వాలు, ఆర్టీసీ స్వీకరించాయి..
ముస్లింల హజ్ యాత్రలకు ప్రభుత్వాలు భారీగా సబ్సిడీలు ఇస్తున్నాయి.. హజ్ హౌస్ నుండి ఎయిర్ పోర్టుకు ఉచితంగా ఏసీ బస్సుల్లో తీసుకుళుతున్నారు.. కానీ హిందువుల పండుగలు, ఉత్సవాలు జరిగినప్పుడు బస్సు ఛార్జీలు భారీగా పెంచేసి దోచుకుంటున్నారు..
తాజాగా సమ్మక్క సారలమ్మ జాతర విషయానికి వద్దాం.. కరీంనగర్ నుండి వరంగల్ మీదుగా మేడారం వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో మామూలు రోజుల్లో టికెట్ ధర రూ.130 మాత్రమే.. ఇప్పుడు మేడారం స్పెషల్ పేరుతో రూ.250 వసూలు చేసేందుకు సిద్దమైంది ఆర్టీసీ..
హిందూ పర్వదినాలు అంటే ప్రభుత్వానికి ఎందుకు చులకన?.. హిందూ తీర్ధయాత్రికులపై ఆర్టీసీ ఎందుకు వివక్ష చూపుతోంది?.. జాగో బంధూ ప్రభుత్వాన్ని, ఆర్టీసీని గట్టిగా నిలదీయండి.. సబ్సిడీ ఇచ్చి తక్కువ ఛార్జీలు తీసుకోవాలని డిమాండ్ చేయండి..

No comments:

Post a Comment