Wednesday, February 17, 2016

మేధావులా? హిస్టీరియా పేషంట్లా?

నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుండి మన దేశంలో కొందరు మేతావులు హిస్టీరియా పేషంట్లయిపోయారు.. ఈ ప్రభుత్వాన్ని చేతబడి చేసైనా దించేయాలి అన్నంతగా పూనకంతో చెలరేగిపోతున్నారు..దేశంలో ఎక్కడ లేని అసహనం వారికే కనిపిస్తోంది.. దేశంలో పెరిగిపోతున్న జాతీయ వాదానికి దేశ ద్రోహమే సరైన విరుగుడు అని కనిపెట్టేశారు..

కిస్ ఆప్ లవ్, బీఫ్ ఫెస్టివల్ తదితర సాంస్కృతిక దాడులతో మొదలై.. ఇప్పుడు ఏకంగా దేశ అస్థిత్వాన్నే సవాలు చేసేంతగా బరితెగించారు. భారత పార్లమెంటుపై దాడి చేసిన, దేశ ప్రజలను పొట్టన పెట్టుకున్న టెర్రరిస్టులకు నివాళ్లర్పించే స్థాయికి దిగజారిపోయారు.. కుల, మతాలను అడ్డంపెట్టుకొని ఈ దేశాన్ని విచ్చిన్నం చేసేంత వరకూ నిద్రపోమంటూ భీకర ప్రతినలు చేస్తున్నారు..
తాజాగా ఓ మేతావి జాతీయత అనే పదానికి అర్థం లేదని తేల్చేశాడు.. దేశ ద్రోహులకు మద్దతుగా ప్రదర్శనలు జరిపితే వీటిని వ్యతిరేకించడం ఘోరమైన తప్పిదమన్నట్లు రాశాడీ పెద్ద మనిషి.. ఆయన రాతల్లో కోరుకున్న ప్రకారం ఆ దేశం ఐక్యంగా ఉండరాదు.. స్వాతంత్ర్య పూర్వ సంస్థానాల మాదిరిగానే విచ్చిన్నం కావాలి.. దేశం కుల, మతాల ప్రాతి పదికన విడిపోవాలి.. మోకాలికీ, బట్టతలకు ముడి పెట్టినట్లు రాజ్యాంగం, హక్కులు, బహుళ జాతి కంపెనీలు, ఉరిశిక్ష అంటూ తన వ్యాసంలో చెలరేగిపోయాడీ మేతావి.. విదేశీ సైద్దాంతిక భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్న ఈ పెద్ద మనిషి ఓ యూనివర్సిటీలో విచ్చిన్నకర శక్తులకు బీజాలు వేసిన వారిలో ఒకరట.. ఛీ ఛీ..

No comments:

Post a Comment