Tuesday, February 16, 2016

నేతాజీని వదలని కమ్యూనిస్టులు

చారిత్రిక తప్పిదాలు చేయడం, ఆ తర్వాత పశ్చాతాప్త పడటం కమ్యూనిస్టులకు అలవాటే.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పట్ల కూడా వారు ఇదే రకంగా వ్యవహరించారు..
బ్రిటిష్ వారిపై పోరాడేందుకు సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపించి శత్రువు శత్రువు మనకు మిత్రుడనే యుద్ద నీతిని పాటించారు.. ఇందులో భాగంగా బ్రిటిష్ వారి శత్రువు జపాన్ సహకారం తీసుకున్నారు ఆయన..
రెండో ప్రపంచ యుద్ద కాలంలో రష్యాకు సన్నిహితంగా ఉన్న బ్రిటిష్ వారిని సమర్ధించారు భారత కమ్యూనిస్టులు.. ఇందులో భాగంగా జపాన్ సహకారం తీసుకున్న సుభాష్ చంద్ర బోసును కించపరిచారు.. నేతాజీని జపాన్ ప్రధాని టోజో పెంపుడు కుక్క అంటూ నోరు పారేసుకున్నారు..  కమ్యూనిస్టు పార్టీకి చెందిన పీపుల్స్ వార్ పత్రిక బోసుబాబును గాడిదలా, ఆయనపై టోజో కూర్చొని స్వారీ చేస్తున్నట్లు కార్టూన్ ప్రచురించింది..

కాలక్రమంలో నేతాజీని తాము తప్పుగా అర్ధం చేసుకున్నామని వివరణ ఇచ్చుకున్నారు కమ్యూనిస్టులు.. చేతులు కాలిన తరువాతే ఆకులు పట్టుకోవడం కమ్యూనిస్టులకు అలవాటే కదా.. వారు ఎక్కే రైలు ఎప్పటికీ జీవిత కాలం లేటే...

No comments:

Post a Comment