Friday, February 12, 2016

ఇష్రత్ వ్యవహారంలో తప్పటడుగు

నిజం నిప్పులాంటిది.. దాస్తే దాగ‌దు.. వాస్త‌వాలు ఏనాటికైనా బ‌య‌ట‌కు వ‌స్తాయి..
ఇష్ర‌త్ జ‌హాన్ విష‌యంలో ఇప్పుడు తేలింది అదే.. 2004లో నాటి గుజ‌రాత్ సీఎం న‌రేంద్ర మోదీని హ‌త్య చేసేందుకు వెళ్లిన బృందంలో ఆమె కూడా స‌భ్యురాలు..గుజ‌రాత్ పోలీసులు ఎన్ కౌంట‌ర్‌లో వీరిని మ‌ట్టుపెట్టిన‌ప్పుడు కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాల‌తో స‌హా ప‌లు పార్టీలు, సంఘాలు, మీడియా నానా యాగి చేశాయి.. ఇది బూట‌క‌పు ఎన్ కౌంట‌ర్ అని, అమాయ‌కురాలిని అన్యాయంగా హ‌త్య చేశార‌ని ఆరోప‌ణ‌లు గుప్పించారు..
తాజాగా ముంబైపై దాడి కుట్ర‌దారుల్లో ఒక‌రైన డేవిడ్ హేడ్లీని విచారించ‌గా, ఇష్ర‌త్ జ‌హాన్ అస‌లు రంగు నిగ్గు తేలింది.. ఆమె మాన‌వ బాంబు అని హేడ్లీ తేట‌తెల్లం చేశారు..
ఓటు బ్యాంకు రాజ‌కీయాల‌ను దేశ భ‌ద్ర‌తతో ముడి పెట్టే రాజ‌కీయ పార్టీల‌కు ఇష్ర‌త్ జ‌హాన్ వ్య‌వ‌హారం క‌నువిప్పు క‌లిగించాలి..

No comments:

Post a Comment