Wednesday, February 3, 2016

పాత బస్తీ జబర్దస్తీ తెలిసొచ్చిందా?

పాముకు పాలు పోసి పెంచితే ఏమవుతుందనేది కాంగ్రెస్ పార్టీకి తెలిసొచ్చింది.. ఇది టీఆర్ఎస్ పార్టీకి కూడా గుణపాఠమే..
జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలో ఏకంగా పీసీసీ అధ్యక్షడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షడు షబ్బీర్ అలీపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలో ఎంఐఎం నాయకులు కార్యకర్తలు దాడులకు దిగారు.. ఏకంగా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇంటిపై దాడి చేసి ఆయన కుమారున్ని కొట్టారు ఎంఐఎం ఎమ్మెల్యే బలాల..
పాతబస్తీకి ఎందుకు వచ్చారని కాంగ్రెస్ నేతలను బెదిరించారు ఓవైసీ.. అవును మరి వారి తాత గారి జాగీరుగా రాసిచ్చింది కాంగ్రెస్ పార్టీయే కదా.. పాతబస్తీలో మజ్లిస్ ఈ స్థాయిలో ఎదిగిందంటే కాంగ్రెస్ పార్టీయే కారణం. కాంగ్రెస్ పాలకులు పాతబస్తీలో దశాబ్దాలుగా మజ్లిస్ ను పెంచి పోషించారు.. ఆ పార్టీ నాయకుల ఆగడాలకు వత్తాసు పలికారు.. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ ప్రాభవం కోల్పోవడంతో మజ్లిస్ అధికార తెరాసతో దోస్తీకి దిగింది..

తాము చేసిన తప్పుకు కాంగ్రెస్ నేతలు తమను తాము నిందించుకొని ఉండాలి.. అధికార  టీఆర్ఎస్ ఇకనైనా ఎంఐఎంను అదుపులో పెట్టాలి.. వారికి ఉన్మాదం తప్ప దోస్తీకి, దుష్మనీకి తేడా తెలియదు.. కిరణ్ కుమార్ రెడ్డే వీరికి సరైన మొగుడు..

No comments:

Post a Comment