Thursday, March 13, 2014

నమో థాలీ.. రాగా బాస్కెట్.

ఎన్నికల వేళ వ్యాపారాలకూ రాజకీయ రంగు అంటుకుంది.. ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ నగరంలో ఓ రెస్టారెంట్ వెరైటీ వంటకాలను వడ్డిస్తోంది..
నమో థాలీ.. రాగా బాస్కెట్..  బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్లు పెట్టి  మిషన్ మే 2014 పేరిట స్పెషల్ మెనూ ఇది.. నమో థాలీకి కాస్త డిమాండ్ ఎక్కువుందట. అందుకే రూ.110/- ధర నిర్ణయించారు.. ఇక రాగా బాస్కెట్ రూ.90 /-కే అందుబాటులో ఉంది.. ఈ మెనూ చూసి రెస్టారెంట్ కు కస్టమర్లు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారట.. బీజేపీ, కాంగ్రెస్ మద్దతుదార్లు లొట్టలేసుకుంటూ నమో థాలి, రాగా బాస్కెట్ రుచులను ఆస్వాదిస్తున్నారట..

అన్నట్లు మెనూ కింద పెట్టిన టాగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది.. అది ఈట్ కరెక్ట్.. థింక్ కరెక్ట్.. ఓట్ కరెక్ట్..ఎన్నికలను సొమ్ము చేసుకోవడంతో పాటు నీతి కూడానా.. అయినా ఇదీ ఆలోచించ తగినదే..

No comments:

Post a Comment