Wednesday, March 12, 2014

ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు?

సంయుక్త ఆంధ్రప్రదేశ్ విడిపోకుండా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుకోవడంలో చేతులెత్తేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు..
ఇప్పుడు రాష్ట్రాన్ని తిరిగి ఒక్కటి చేస్తానంటూ కొత్త పార్టీని ప్రకటించారు..
సరే ఈయన పార్టీ విజయం సాధించి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారే అనుకుందాం..
తిరిగి సమైక్యాంధ్ర ప్రదేశ్ ఏర్పాటు  చేయగలరా?
ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాధ్యం కాలేని పని, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయితే ఎలా సాధ్యం అవుతుంది..
సమాధానం చెప్పగలరా కిరణ్ కుమార్ రెడ్డి గారూ?..

No comments:

Post a Comment