Saturday, March 22, 2014

అవగాహన లేనిదెవరికి?

తన సోదరుడు పవన్ కల్యాణ్ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కలవటం కేంద్ర మంత్రి చిరంజీవిని ఆశ్చర్యానికి గురి చేసిందట... ఆయన విశాఖలో మీట్‑ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ గోద్రా నరమేధంలో మోడీ పాత్ర ఉందన్న అంశంపై పవన్‑కు అవగాహన ఉందో...లేదో అని చిరంజీవి అనుమానం వ్యక్తం చేశారు. 
అయ్యా చిరు జీవి.. తమరు ప్రజా రాజ్యం పార్టీ పెట్టినప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేయలేదా?.. దేవేందర్ గౌడ్ (అప్పడు పీఆర్పీలో ఉన్నారు) గారిని రాయబారం పంపలేదా? సీట్ల విషయంలో తేడా వచ్చి ఒప్పందం కుదరలేదనుకోండి..

నాకైతే ఈ అన్నయ్య కన్నా తమ్ముడికే ఒక విజన్, అవగాహన ఉన్నట్లనిపిస్తోంది.. చిరంజీవికి మార్కెటింగ్ చేసుకోవడం రాలేదు.. పవన్ కాస్త తెలివిగా ముందుకు వెళుతున్నాడు.. 

No comments:

Post a Comment