Sunday, January 31, 2016

గాంధీజీని అవమానిన రాహుల్ వ్యాఖ్యలు..

రాహుల్ గాంధీ తెలిసి చేశాడో, తెలియక చేశాడో కానీ ఈ వ్యాఖ్యలు గాంధేయవాదులు, నిజమైన కాంగ్రెస్ వాదులు ఇంకా మన దేశంలో బతికి ఉంటే వారికి మనస్థాపం కలిగించి ఉండాలి.. రోహిత్ వేములను ఏకంగా మహాత్మాగాంధీతో పాల్చాడు రాహుల్..
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ విద్యార్థి అనుమానాస్పద మృతికి అసలు కారణాలు ఇంకా తెలిసి రాలేదు.. అతని కులం విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండానే దళిత రంగు పులిమేశారు.. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇదే యూనివర్సిటీలో 9 మంది దళిత విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోని రాహుల్, రోహిత్ వ్యవహారంలో ఇప్పటికి రెండు సార్లు ఈ యూనివర్సిటీకి వచ్చాడు.. రోహిత్ జన్మదిన వేడుకలకు ఆయన కుటుంబం పిలిస్తే వచ్చానని చెబుతున్నాడు.. శవాలపై పేలాలు ఏరుకోవడానికి, క్షుద్ర రాజకీయాలకు ఇంత కన్నా మంచి సందర్భం ఏముంటుంది ఆయనకు..

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భారత రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో ఏర్పడిన విద్యార్థి సంఘం ముంబై మారణకాండకు బాధ్యుడైన యాకుబ్ మెమన్ ఉరి శిక్షకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడం ప్రస్తుత వివాదానికి మూల కారణం.. తాజాగా తమిళనాడులో మరో అరాచక మూక రోహిత్ వేములకు మద్దతు అంటూ జాతీయ పతాకాన్ని తగులబెట్టింది.. మహనీయుల పేర్లు పెట్టుకొని కుల సంఘాల ముసుగులో దేశ విద్రోహక కార్యకలాపాలకు పాల్పడుతున్న శక్తులకు రాహుల్ గాంధీ మద్దతు ప్రకటించినందుకు కాంగ్రెస్ పార్టీ సిగ్గు పడాల్సిన అవసరం ఉంది.. దేశ ప్రజలకు ప్రాతస్మరణీయులైన అంబేద్కర్, గాంధీజీ పేర్లను విద్రోహ కార్యకలాపాల కోసం వాడుకుంటున్న వారు బహిరంగంగా క్షమాపణలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.. ఇలాంటి వ్యక్తులను, వారికి మద్దతు ఇస్తున్న వారిని కఠినంగా శిక్షించాలి..

No comments:

Post a Comment