Friday, January 1, 2016

పెరిగిన పార్లమెంట్ క్యాంటీన్ రేట్లు..

ఎంపీ: అన్యాయం.. అక్రమం.. మోదీ డౌన్ డౌన్..
విలేఖరి: ఏమైంది సార్?
ఎంపీ: ఏం తినేట్టు లేదు.. ఏం కొనేట్లు లేదు..
విలేఖరి: ఇంతకీ విషయం ఏమిటి సార్?..
ఎంపీ: ధరలు ఇంతలా పెంచేస్తారా?
విలేఖరి: ధరలు ఎప్పుడూ పెరగలేదు గనుక?.. మీకు వచ్చిన కష్టం ఏమిటో చెప్పండి..
ఎంపీ: మొన్న గ్యాస్ సబ్సిడీ వదులుకోమన్నాడు.. ఇవాళ నోటికాడి తిండికే ఎసరు పెట్టాడు..
విలేఖరి: అవునా ఎలా?
ఎంపీ: పార్లమెంట్ క్యాంటీన్ రేట్లు పెంచుతాడా? ఎంత అన్యాయం..
విలేఖరి: ఓ.. అదా మీ బాధ.. ఇంత కాలం దేశ ప్రజల పన్నుల సొమ్ము తిన్నది చాలదా?..
జనవరి ఒకటో తేదీ నుండి పార్లమెంట్ క్యాంటీన్లో సబ్సిడీపై అందిస్తున్న ఆహార పదార్ధాలకు కోత పడింది.. ఇకపై ఎంపీలంతా వాస్తవంగా తయారయ్యే ధరకే ఆహార పదార్ధాలు కొనుకోలు చేసి తినక తప్పదు.. నిన్నటి దాకా ₹18కి దొరికిన శాఖాహార భోజనం ఇకపై ₹30.. మాంసాహార భోజనం ₹33 నుండి ₹60కి పెరిగింది.. కోడి మాంసం కూర ₹29 నుండి ₹40కి పెంచేశారు.. గత ఐదేళ్లుగా పార్లమెంట్ సభ్యుల తిండి కోసం ప్రభుత్వం ₹69.7 కోట్ల సబ్సిడీ భరించిందట.. మున్ముందు పార్లమెంట్ క్యాంటీన్ సబ్సిడీని మరింత ఎత్తేస్తారట..

No comments:

Post a Comment