పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం, ప్రభుత్వం మేడి పండు లాంటివని మరోసారి స్పష్టమైపోయింది.. అక్కడ ప్రధానమంత్రి పదవి కేవలం అలంకార ప్రాయం.. పాకిస్తాన్ను నియంత్రించేది సైన్యం, ఐఎస్ఐ మాత్రమే.. తమ దేశ పాలకులు భారత్తో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం వారికి ఏమాత్రం ఇష్టం లేదు.. ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియ సాగినప్పుడల్లా సైన్యం, ఐఎస్ఐ బరితెగించి సామరస్య వాతావరణాన్ని చెడగొడతాయి.. పఠాన్ కోట్ ఘటన ఇందుకు తాజా ఉదాహరణ..

భారత్తో వేయేళ్ల యుద్దానికైనా తాము సిద్దమని పాకిస్తాన్ సైనిక పాలకులు గతంలోనే ప్రకటించారు.. భారత్పై నిరంతర విషయం కక్కడంలోనే ఆ దేశ సైన్యం. ఐఎస్ఐల మనుగడ ఆధారపడి ఉంది..
ఉగ్రవాదం, కాశ్మీర్ అంశాలపై ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్న పాకిస్తాన్ ఇప్పటికే ప్రపంచ దేశాల ముందు ఏకాకిగా మారుతోంది.. ఈ దశలో పాకిస్తాన్ పౌర ప్రభుత్వంతో ఓ వైపు చర్చలు జరుపుతూనే, మరోవైపు ఆ దేశ సైన్యం నడ్డి విరిచే విషయంలో భారత్ వ్యూహాత్మకంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. లేకపోతే మన సామరస్యాన్ని వారు అసమర్ధతగా భావించి మరింత రెచ్చిపోతూనే ఉంటారు.. మన విదేశాంగ విధానానికి అసలు సవాల్ ఇదే..
No comments:
Post a Comment