Thursday, January 21, 2016

ఇతర విద్యార్థులవి ప్రాణాలు కాదా?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు ప్రయివేటు, కార్పోరేట్ కాలేజీల్లో నిత్యం ఏదో ఒక చోట విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. నాయకులెవరూ అటువైపు చూడరు.. ఏ మీఢియా పెద్దగా వాటిని పట్టించుకోదు.. దాదాపు ప్రతి యూనివర్సిటీలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. ఏదో తూతూ మంత్రంగా స్పందిస్తారు.. విద్యార్థులు సూసైడ్ నోట్లు చాలా క్లియర్ గా ఉన్నా పట్టించుకోరు.. యాజమాన్యాలు, పోలీసులు కుమ్మక్మై కేసులను తొక్కి పెడతారు.. ప్రభుత్వాలు కూడా చూసీ చూడనట్లుగానే వ్యవహరిస్తాయి..
మరి హైదరాబాద్ సెంట్రల్ యూనిర్సిటీలో జరుగుతున్నది ఏమిటి?.. వేముల రోహిత్ ఏ కారణం వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నాడో తన సూసైడ్ నోట్లో సరిగ్గా చెప్పలేదు.. అతను ఏ కులస్తుడో స్పష్టత లేదు.. కానీ దళిత విద్యార్థి చనిపోయాడంటూ కులం రంగు పులిమారు.. మీడియా, కుల-ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు గగ్గోలు పెట్టేశాయి..
అందరు విద్యార్థుల ఆత్మహత్యలను ఒకే కోణంలో ఎందుకు చూడరు.. హెచ్.సీ,యూ. విద్యార్థుల ప్రాణాలకు ఒక విలువ, మిగతా కాలేజీల విద్యార్థులకు మరో విలువ ఉంటుందా? రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, సీతారామ్ ఏచూరీ, జగన్ తదితరులు ఎందుకు శవ రాజకీయాలు చేస్తున్నారు.. ఈ యూనివర్సిటీలో గతంలో ఓ విద్యార్థిపై దాడి చేసినప్పుడు వీళ్లంతా ఎక్కడ దాక్కున్నారు.. దెబ్బలు తిన్న ఏబీవీపీ విద్యార్థి దురదృష్టవశాత్తు మరణించి ఉంటే వీళ్లు ఇలాగే పరామర్శలు, నిరసన ప్రదర్శనలు చేసేవారా?
ముంబై మారణకారణకు కారకుడైన దేశద్రోహి మెమన్ ఉరిశిక్షకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిపిన వారిని వ్యతిరేకించడం సుశీల్ కుమార్ తప్పా? అతనిపై దాడులు జరగడం ఒప్పా? యూనివర్సిటీల్లో జరుగుతున్న విద్రోహ రాజకీయాలను కేంద్ర మంత్రి దత్తాత్రేయ హెచ్.ఆర్.డీ.మంత్రికి ఫిర్యాదు చేయడం తప్పా? అందుకోసం ఆయనపై అట్రాసిటీ కేసు పెడతారా?

ప్రాణం విలువ ఎవరికైనా ఒకటే.. కులాన్ని, మతాన్ని బట్టి విలువ కట్టడం సమంజసం కాదు.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల విషయంలో కూడా దర్యాప్తు జరపండి..

No comments:

Post a Comment