Sunday, January 24, 2016

సావన్ ప్రాణాలకు విలువ లేదా?

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతం బాధాకరమైన ఘటనే.. అతని సామాజిక వర్గ నేపథ్యం తెలుసుకోకుండానే శవ రాజకీయాలు చేశారు. ఏకంగా కేంద్ర మంత్రులపై అట్రాసిటీస్ కేసు పెట్టి రాజీనామాకు డిమాండ్ చేశాయి.. ఇదే సమయంలో పుణేలో చెత్త ఏరుకునే పేద కుర్రాడు సావన్ రాథోడ్ ను కొందరు ముష్కరులు అతని మతం ఏమిటో అడిగి మరీ తెలుసుకొని పెట్రోలు పోసి తగుల బెట్టారు.. రోహిత్ వేముల వార్తను తొలి పేజీలో ప్రచురించిన పత్రికలు, సావన్ రాథోడ్ వార్తను లోపలి పేజీల్లోకి తోసేసాయి.. చనిపోయిన ఇద్దరూ కుర్రాళ్లే.. ఒకరు ఆత్మహత్య చేసుకుంటే, ఒకరు హత్యకు గురయ్యారు.. మరి రోహిత్ వేముల ఉదయంతాన్ని రాజకీయానికి వాడుకున్న రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, అసదుద్దీన్ ఓవైసీ. సీతారామ్ ఏచూరి, జగన్ తదితర నాయకులు సావన్ రాథోడ్ ను ఎందుకు మరిచిపోయారు.. సావన్ మతానికి, కులానికి ఓటు బ్యాంకు లేకపోవడమే కారణమా?.. ప్రతి ఒకరూ రాజకీయ రాబందులను నిలదీయాల్సిన అవసరం ఉంది..

No comments:

Post a Comment