Monday, January 25, 2016

యాకుబ్ ను శిక్షించొద్దా..

యాకుబ్ మెమన్ ఉరి శిక్షను వ్యతిరేకించే హక్కు హెచ్.సీ.యూ. విద్యార్థులకు ఉందట.. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు జైపాల్ రెడ్డి వాక్రుచ్చారు.. మరి ముంబై వాసులపై మొమన్ సోదరుల మారణకాండకు మీరు మద్దతు ఇస్తున్నట్లే కదా?.. ఇలాంటి దేశ ద్రోహికి ఉరి తీయడం తప్పు అని రెడ్డి గారు  పరోక్షంగా అంగీకరించారన్నమాట.. సిగ్గుండాలి ఇలాంటి కూతలు కూయడానికి.. అఫ్జల్ గురు, కసబ్ లాంటి ఉగ్రవాదులకు ఉరి శిక్షలు పడ్డా కాపాడుతూ, జైళ్లలో ఇంటి అల్లుళ్లలా చూసుకుంటూ బిర్యానీలు తినిపించిన కాంగ్రెస్ నాయకుల నుండి ఇంత కన్నా మంచి ప్రకటనలను ఏం ఆశించగలం? అందుకే ఉగ్రవాదుల తరపున వకాల్తా పుచ్చుకునే మిమ్మల్ని దేశ ప్రజలు వీరిని చిత్తుగా ఓడించారు.. 

No comments:

Post a Comment