Sunday, January 31, 2016

జాగో బంధూ.. దేశ్ బచావో..

కొంత కాలంగా మన దేశంలో జాతి వ్యతిరేక శక్తులు ఎలా రెచ్చిపోతున్నాయో చూడండి.. కొన్ని సంస్థలు మహనీయులకు కులం, మతం, ప్రాంతం ముసుగు వేసుకొని బాహటంగా దేశ ద్రోహ కార్యాకలాపాలకు పాల్పడుతున్నాయి. ముఖ్యంగా తమిళనాట ఈ విష సంస్కృతి వెర్రి తలలు వేస్తోంది. ద్రవిడ వాదం ముసుగులో దేశ ద్రోహులు చెలరేగిపోతున్నారు... ఈ విష ప్రభావంతో ఓ కుర్రాడు జాతీయ పతాకానికే నిప్పు పెట్టాడు.. మార్క్స్, పెరియార్, అంబేద్కర్ వారికి ఇదే బోధించారా?
మరోవైపు మతం ముసుగులో ఉగ్రవాద శక్తులు దేశ భద్రతను సవాలు చేస్తున్న వేళ, గణతంత్ర దినోత్సవం నాడు దేశంలోని పలువురు ముస్లింలు ఇలాంటి శక్తులను వ్యతిరేకిస్తూ సగర్వంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.. మతాన్ని దేశభక్తితో ముడిపెట్టడాన్ని వారు సవాలు చేశారు..


No comments:

Post a Comment