Monday, January 18, 2016

రామారావు గారికి శ్రద్ధాంజలి

సౌమ్యులు, గురుతుల్యులు, మేధావి వి.రామారావు గారు ఇక లేరనే వార్త విచాకరం.. న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించిన రామారావు గారు జనసంఘ్ (బీజేపీ) ద్వారా రాజకీయ జీవితాన్నిప్రారంభించారు.. హైదరాబాద్ పట్టభద్రుల స్థానం నుండి నాలుగు సార్లు శాసనమండలికి ఎన్నికైన అరుదైన ఘనత వీరిది.. శాసనమండలిలో బీజేపీ పక్ష నాయకునిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షునిగా పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ సెనెట్ సభ్యునిగా సేవలు అందించారు.. రామారావు గారు సిక్కిం రాష్ట్ర గవర్నర్ గా సని చేశారు..

రామారావు గారిని అనేక సందర్భాల్లో నేను కలిసినప్పుడు ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు.. పలు అంశాలపై అపారమైన పరిజ్ఞానం ఉన్న వారితో ఎంత సేపు మాట్లాడినా కాలం తెలియదు.. హోదాలు, వయసులతో సంబంధం లేకుండా అందరితో కలుపుకోరుగా ఉండే రామారావు రాజకీయాలు విలువలను ఆచరణలో చూపించారు.. వారికి నా శ్రద్ధాంజలి.. ఓం శాంతి..

No comments:

Post a Comment