Tuesday, January 19, 2016

విద్యాలయాల్లో విష బీజాలు..

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య ఎవరికైనా బాధ కలిగించేదే.. ఎన్నో ఆకాంక్షలతో ఉన్నత విద్యాభ్యాసం కోసం యూనివర్సిటీలో చేరిన ఈ విద్యార్థి అర్ధనంతంతరంగా తనువు చాలించడానికి దారితీసిన పరిణాలమాలపై ఆలోచించాలి.. యూనివర్సిటీ అన్న తర్వాత విద్యార్థి సంఘాలు, వాటి ఆధిపత్య పోరు సహజం.. కానీ కొంత కాలంలో విద్యార్థి సంఘాల పేరిట జరుగుతున్న కార్యకలాపాలు ఆందోళన కలిగిస్తున్నాయి..
రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుల రహిత, సమసమాజ నిర్మాణం కోసం కలలు కన్నారు.. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం రిజర్వేషన్లను ప్రతిపాదించారు.. బాబాసాహెబ్ కలలుకన్న ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన యాకూబ్ మెమన్ కు ఉరిశిక్ష అమలైంది.. ఈ శిక్షకు వ్యతిరేకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ASA ఆధ్వర్యంలో ఓ ప్రదర్శన జరిగింది..
ఈ ప్రదర్శనను వ్యతిరేకిస్తూ ABVP నాయకుడు సుశీల్ కుమార్ ఫేస్ బుక్ లో కామెంట్స్ పెట్టాడు.. ఇందుకు ఆగ్రహించిన కొందరు విద్యార్థులు అతనిపై దాడి చేశారు.. పోలీసులకు, యూనివర్సిరటీ అధికారులుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.. ఈ అంశాన్ని అక్కడి విద్యార్థులు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ దృష్టికి తీసుకెళ్లగా ఆయన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రికి లేఖ రాశారు.. మంత్రిత్వ శాఖ హెచ్.సీ.యూ. వైస్ ఛాన్సలర్ ను ఈ ఘటనపై ఆరా తీసింది.. దీంతో ప్రదర్శనకు కారకులైన విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు..
దురదృష్టవశాత్తు క్రమశిక్షణా చర్యలకు గురైన విద్యార్థుల్లో ఒకరైన రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు.. ఒక లేఖ కూడా రాశాడు.. యూనివర్సిటీలో జరిగిన పరిణామాలపై ఆయన ఎంతో వ్యధకు గురయ్యాడని ఆ లేఖ చెబుతోంది.. ఈ ఘటనల పరిణామక్రమంపై దర్యాప్తు జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి.. దీనిపై చట్టపరమైన చర్యలకు అవకాశం ఉంది..

దేశంలోని ప్రధాన యూనివర్సిటీలన్నింటిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.. మహనీయుల పేర్లతో సంఘాలను ఏర్పాటు చేసుకొని జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం సమంజసమేనా? వీరి వెనుక ఎవరున్నారు అనే అంశాలపై కూడా దర్యాప్తు జరగాలి.. 

No comments:

Post a Comment