Tuesday, January 12, 2016

భారత దేశాన్ని మేల్కొల్పిన ఆధ్యాత్మిక గురువు

భారత దేశం అంటే పాములు, కోతులు ఆడించే దేశం.. పాశ్యాత్యుల దృష్టిలో ఆంగ్లేయులు సృష్టించిన దురభిప్రాయం ఇది.. ఒకనాడు ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టిన భారతదేశం, గత చరిత్రను మరచి బానిసత్వ పాలనలో మగ్గుతున్న రోజులు విని.. ఇలాంటి సమయంలో చికాగోలో వినిపించింది వివేక వాణి..
హిందూమత ఔన్నత్యాన్ని, భారత దేశ సాంస్కృతిక-చారిత్రిక వారసత్వం, వైభవాన్ని ప్రపంచ సర్వమత మహాసభలో చాటి చెప్పారు స్వామి వివేకానంద.. నిద్రిస్తున్న భారత జాతిని మేల్కొల్పారు.. దేశ యువతలో ఆత్మ విశ్వాసాన్ని నింపడంతో పాటు వారికి కర్తవ్యాన్ని బోధించారు స్వామీజీ.. ఆయన జీవించింది కేవలం 39 సంవత్సరాలే.. కానీ భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా నిలిచారు వివేకానంద.. స్వామీజీ జన్మదినోత్సవం సందర్భంగా వారి సందేశాన్ని సంక్షిప్తంగా గుర్తు చేసుకుందాం..
లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకూ విశ్రమించకండి.. లేవండిమేల్కొనండి!.. మిమ్మల్ని మీరు మేల్కొల్పుకొని ఇతరులను మేల్కొల్పండిఇకపై నిద్రించకండి!.. మీరు మరణించే లోపే జీవిత పరమావిధిని సాధించండి.. లేవండి!మేల్కొనండి!.. గమ్యం చేరేవరకూ ఎక్కడా నిలవకండి.. ఎప్పటికీ జాగృతంగానే ఉండండి.. బలమే జీవితం,బలహీనతే మరణం.. ఇనుప కండరాలుఉక్కు నరాలువజ్ర సంకల్ప మనసున్న యువత ఈ దేశానికి కావాలి.. 
ఆధునిక యువతపైనే నాకు విశ్వాసం ఉంది.. నేను నిర్మించిన ఆదర్శాన్ని దేశ మంతా వ్యాప్తి చేసేది యువతే.. యువత ముందు బలిష్టులుజవ సంపన్నులుఆత్మ విశ్వాసులరుజువర్తనులు కావాలి.. ఇలాంటి వారు వంద మంది ఉన్నా చాలుఈ ప్రపంచాన్నే మార్చేయ వచ్చు..
మీరంతా మహత్కార్యాలు సాధించడానికే జీవించామని విశ్వసించండి.. బలంశక్తి మీలోనే ఉన్నాయని గుర్తుంచుకోండి.. ఎంతో విశ్వాసంతో లేచి నిలబడండి.. ధైర్యంగా బాధ్యతను మీ భుజ స్కంధాలపై వేసుకోండి.. భవిష్యత్తుకు మీరే బాధ్యులమని తెలుసుకోండి.. ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడకండి.. క్రమంగా ఘనమైన ఫలితాలు వస్తాయి.. సాహసంగా పని చేయండి..’
తమ సర్వస్వాన్ని త్యాగం చేసిదేశం కోసం తమ జీవితాలను ఆహుతి చేసే యువత మనకు కొందరు కావాలి.. దేశ ప్రజలను ఉద్దరించే ఏకైక లక్ష్యంతో పని చేసే యవతను గుర్తించి పని చేయాలి.. త్యాగంఉత్సాహాలతో వారిని జాగృతం చేసి ఐక్యం చేయాలి.. మన స్థితికి మనమే బాధ్యులం.. లక్ష్యాన్ని సాధించే శక్తిఆపై శక్తి మనకే ఉంది..

(నేడు స్వామి వివేకానంద జయంతి)

No comments:

Post a Comment