Thursday, May 29, 2014

సావర్కర్ గుర్తున్నారా?..

దేశం కోసం జీవితాన్నే సమర్పించుకున్న మహానుభావుడు.. స్వాతంత్ర్య సమర పోరాటంలో రెండు యావజ్జీవ కారాగార శిక్షలు పడి 27 ఏళ్లు అండమాన్ జైలులో మగ్గిపోయారు.. 1857లో జరిగింది సిపాయిల తిరుగుబాటు కాదు, ప్రథమ స్వాతంత్ర్య సమరమని బయటపెట్టిన చరిత్రకారుడు.. అంటరానితనం, అసమానతలు, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త.. హిందూ మహాసభ వ్యవస్థాపకుడు.. ఎంతో మంది సమరయోధులను తీర్చి దిద్దిన స్పూర్తి ప్రధాత.. ఇలా ఆయన గురుంచి ఎన్ని చెప్పినా తక్కువే..
వినాయక్ దామోదర్ సావర్కర్.. స్వాతంత్ర్య వీర సావర్కర్ పేరిట ప్రఖ్యాతుడు..
దేశం కోసం సర్వస్వాన్ని కోల్పోయిన ఈ మహనీయుడి జయంతిని మరోసారి దేశం గుర్తు తెచ్చుకుంది.. అటల్జీ ప్రధానిగా ఉన్నప్పుడు సావర్కర్ కు అధికారికంగా నివాళులు అర్పించినట్లు గుర్తు.. మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పుడే ఈ వేడుక జరిగింది..

No comments:

Post a Comment