Thursday, May 1, 2014

శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందట..

అలా ఉంది డిగ్గీరాజా యవ్వారం..
ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి రచ్చచేయడం ఇతడి నైజం.. పాపం ఇప్పడు తన విషయం వచ్చేసరికి మింగలేక కక్కలేక, చివరకు లీగలైజ్ చేసుకోక తప్పడం లేదు..
నరేంద్ర మోదీ తన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్ లో భార్య పేరు వెల్లడించగానే.. 'ఇదిగో చూశారా.. ' అంటూ గగ్గోలు పెట్టేశాడు దిగ్విజయ్ సింగ్.. అప్పుడే ఏం చెప్పాడో గమనించండి.. 'నేను మోదీలా నా వైవాహిక స్థితిని దాచను.. నా భార్య చనిపోయింది.. మళ్లీ పెళ్లి చేసుకుంటే అందరికీ చెబుతాను..'
అప్పడే అనిపించింది ' మళ్లీ పెళ్లి' ప్రస్థావన ఏమిటి?.. దాల్ మే కుచ్ కాలా హై అని.. దిగ్విజయ్ మరో పెళ్లి చేసుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు.. ఆయన జీవితం ఆయన ఇష్టం.. కానీ ఇంకా విడాకులు తీసుకోని మహిళతో యవ్యారాలు సాగించి, సోషల్ మీడియాలో రచ్చ అయితే కానీ ఆయనకు సోయి రాలేదా?.. అంటే సోషల్ మీడియా ఈ విషయం బయట  పెట్టకపోతే అనైతిక సంబంధాన్ని నిర్లజ్జగా కొనసాగించేవాడన్నమాట.. పాపం డిగ్గీ తాత తన మనవళ్లు, మనవరాళ్లకు.. నలుగుగు సంతానానికి ఏమి సమాధానం చెప్పుకుంటారో..
ఇలాంటి చిత్తకార్తె మనుషులకు సమాజమే తగిన బుద్ది చెప్పాలి..

No comments:

Post a Comment