Tuesday, May 20, 2014

ఇంకా ఎంత కాలం ఈ డ్రామాలు?

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి జ్ఞానోదయం అయినట్లు లేదు.. ఎన్నికల ఫలితాలను సమిక్షించేందుకు సమావేశమైన సిడబ్ల్యుసి   ఎప్పటి లాగే సోకాల్డ్ గాంధి పరివార భజనకే పరిమితమైంది..  ఓటమిని భాద్యత వహిస్తూ సోనియా, రాహుల్ రాజీనామా (ఉత్తుత్తినే) సిద్దపడగా మిగతా నేతలంతా ఒద్దొద్దు అంటూఅడ్డుపడ్డారట.. ఓటమికి సమిష్టి భాద్యత వహిస్తారట.. అంటే అంటా తప్పుకొని కొత్త కమిటి వేయాలి.. అంత సాహసం చేయగలరా?ఇంకా ఎంత కాలం ఈ డ్రామాలు?
ఓటమికి ప్రజా తిరస్కారమే కారణమని తెలుస్తున్నా, ఫలితా విశ్లేషణకు ఓ కమిటి వేస్తారట.. ఎందుకు టైం పాస్కా.. అవినీతి, ధరల పెరుగుదల, అసమర్ధతే కాంగ్రెస్ ఘోర పరాజయానికి కారణమని చిన్న పిల్లోడికి కూడా తెలుసు.. ఆమాత్రం బుర్రకెక్కలేదా వీరికి?
కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం రావాలంటే సోకాల్డ్ (నకిలీ) గాంధీ పరివారం తప్పుకోవాలి.. వంశ పారంపర్య పాలనే కాంగ్రెస్ పార్టీకి పెద్ద గుది బండగా మారినిది.. ఆ సాహసం చేయగలదా కాంగ్రెస్?

No comments:

Post a Comment