Tuesday, May 20, 2014

మోదీ అంతర రూపం..

ఎదిగిన కొద్దీ వదగాలని మన పెద్దలు చెబుతుంటారు.. నరేంద్ర మోదీ కారణంగా బీజేపీ గతంలో ఎన్నడూ లేనంతగా సొంత మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది.. అయినా ఆ ఘనతను స్వీకరించడానికి ఇబ్బంది పడ్డారాయన.. అగ్రనేత అద్వానీ ప్రశంసలకు కరిగిపోయాడు.. భావోద్వేగంతో కంటతడి పెట్టేశారు.. పార్టీ తనకు తల్లిలాంటిదని, తల్లికి సేవ చేయడం తన బాధ్యతగా, అదృష్టంగా భావిస్తానని స్పష్టం చేశారు మోదీ.. అద్వానీ సైతం ఇలాంటి భావోద్వేగానికే లోనయ్యారు..
అంతకు ముందు పార్లమెంట్ భవనానికి వచ్చినరేంద్ర మోదీ, వస్తూనే భారత ప్రజాస్వామ్యానికి గౌరవ సూచకంగా మెట్లపై తలవంచి ప్రణామం చేశారు..ఈ అరుదైన సన్నివేశాలను దేశ ప్రజలంతా లైవ్ ద్వారా చూశారు..

No comments:

Post a Comment