Monday, May 26, 2014

నమో శకం ప్రారంభమైంది..

భారత దేశ 15వ ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రమాణ స్వీకారం చేశారు.. కోట్లాది మంది ప్రజల కోరిక నెరవేరింది.. దేశ ప్రజలంతా నరేంద్ర మోదీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు..
అవినీతి రహిత, సమర్ధవంతమైన, సుపరిపాలన కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు.. భారత దేశం ఆర్థికంగా, సైనికంగా శక్తివంతమైన దేశంగా ఎదగాలి.. అందరికీ సమాన అవకాశాలు రావాలి.. పేదరికం, నిరుద్యోగం అంతం కావాలి.. ప్రతి ఒక్కరికీ కూడు, గుడ్డ, నీడ, విద్య, ఉపాధి కావాలి.. ధరలపై నియంత్రణ ఉండాలి.. సంతృష్టీకరణ రాజకీయాలకు చెల్లు చీటీ పలకాలి.. ఇవన్నీ అత్యాశగా కనిపించవచ్చు.. కానీ నరేంద్ర మోదీ నెరవేరుస్తారని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు..

దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం నరేంద్ర మోదీకి సాధ్యమేనా అని అనుమానించడం సహజం.. కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకులతో పోలిస్తే ఇవన్నీఆయనకు సాధ్యమేనని నేను నమ్ముతున్నాను.. మోదీ శక్తి సామర్థ్యాలు ఏమిటో అందరికీ తెలుసు.. దేశ ప్రజలు ఆయనపై పెట్టుకున్న ఆశలు వమ్ముకావని కచ్చితంగా చెప్పగలను..

No comments:

Post a Comment