Monday, September 29, 2014

ఒక అమెరికా.. ఇద్దరు నరేంద్రులు

121 సంవత్సరాల క్రితం అమెరికాలోని షికాగో నగరంలో భారత దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడో నరేంద్రుడు... ఇన్నాళ్ల తర్వాత అదే అమెరికా గడ్డపై న్యూయార్క్ లో ఈ శతాబ్దం భారత దేశానిదేనని ప్రకటించారు మరో నరేంద్రుడు.. యాదృచ్చిరంగా ఇద్దరి పేర్లు ఒకటే.. నెలలు కూడా సెప్టెంబరే..

1893వ సంవత్సరంలో జరిగిన షికాగో సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద చేసిన ప్రసంగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.. అమెరిక్లను అత్యంత ఆకట్టుకున్న తొలి భారతీయడు స్వామీజీయే.. మహాత్మా గాంధీ సత్యం, అహింస సిద్దాంతాలు మార్టిన్ లూథర్ కింగ్ లాంటి యోధులకు స్పూర్తిని ఇచ్చాయి.. కానీ గాంధీజీ తన జీవిత కాలంలో అమెరికా వెళ్లేకపోయారు.. ఇన్నాళ్లకు ఆ ఘనత నరేంద్ర మోదీకి దక్కడం భారతీయులందరికీ గర్వకారణం..

14 ఏళ్ల క్రితం తమ దేశానికి రాకుండా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి వీసాను నిరాకరించింది అమెరికా.. కానీ అదే మోదీ ఇప్పుడు భారతీయులంతా అఖండ మెజారిటీతో ఎన్నుకున్న ప్రధానమంత్రి.. భారతీయుల ప్రియతమ నాయకున్ని ఇక ఎలా అడ్డుకోగలదు అమెరికా?.. అమెరికా గడ్డపై ఇప్పటి వరకూ ఏ విదేశీ నాయకునికి లభించనంత ప్రజాధరణ నరేంద్ర మోదీకి లభించిందంటున్నారు విశ్లేషకులు.. ప్రవాస భారతీయులు మోదీకి బ్రహ్మరథం పట్టారు.. మోదీ బస చేసిన హాటల్ దగ్గర, ఆయన ప్రసంగించిన మాడిసన్ స్క్వేర్ దగ్గర వేలాదిగా తరలి వచ్చిన ప్రవాస భారతీయులను కంట్రోల్ చేయడానికి అమెరికన్ పోలీసులకు తల ప్రాణం తోకకు వచ్చిందట..

No comments:

Post a Comment