Sunday, September 28, 2014

స్వామికి చిక్కితే అంతే,,

అవి ఎమర్జెన్సీ రోజులు.. ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రతిపక్ష నాయకులందరినీ జైలుకు పంపింది.. కానీ ఓ కీలక పార్లమెంట్ సభ్యుడు మాత్రం దొరకలేదు.. అప్పటికే విదేశాలకు వెళ్లిపోయాడు.. పార్లమెంట్ సమావేశాలు ప్రతిపక్షం లేకుండానే సాగుతున్నాయి..
ఒక శుభోదయాన ఒక వ్యక్తి ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగాడు.. నేరుగా పార్లమెంట్ వెళ్లాడు.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రశ్న వేశారు.. అందరూ ఆశ్చర్యంగా చూశారు.. ఓహ్ సుబ్రహ్మణ్య స్వామి.. ప్రభుత్వం అలర్ట్ అయింది.. ఆయనను అరెస్ట్ చేయడానికి ఆదేశాలు జారీ అయ్యాయి.. కానీ మన చిక్కడూ దొరకడు గారు నేరుగా మళ్లీ ఎయిర్ పోర్ట్ వెళ్లి ఫ్లైట్ ఎక్కేశారు.. ఇక ఎవరికీ చిక్కలేదు..
సుబ్రహ్మణ్య స్వామి.. జాతీయ భావాలు ఉన్న వ్యక్తి.. గణితం, న్యాయ శాస్త్రాల్లో దిట్ట.. హార్వార్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసి అదే వర్సిటీకి అసోసియేట్ ఫ్రొఫెసర్ అయ్యారు.. స్వామి సర్వోదయ ఉద్యమం ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.. భారతీయ జన సంఘ్ లో చేరారు.. జన సంఘ్ ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీలో కలిసిపోయాక, అదే పార్టీలో కొనసాగారు.. కేంద్ర మంత్రిగా సేవలు అందించారు.. గత ఏడాది జనతా పార్టీని బీజేపీలో విలీనం చేశారు.. స్వామి మొదటి నుండి ఎవరికీ అంతు చిక్కని నాయకుడు.. పార్టీల్లో ఇమడలేని స్వతంత్ర వ్యక్తిత్వం..

సుబ్రహ్మణ్య స్వామి బహుముఖ ప్రజ్ఞాశాలి. రాజకీయ నాయకునిగా, ఆర్థికవేత్తగా, అధ్యాపకునిగా, రచయితగా ఏక కాలంలో పని చేయడం ఆయనకే చెల్లింది.. స్వామికి అవినీతి పరులంటే మంట.. ఆయన దృష్టిలో పడితే ఎంత గొప్పవారైనా న్యాయ స్థానాలకు లాగి ఓ ఆటాడేస్తాడు.. అందుకే మన నాయకులు ఆయనతో పెట్టుకోవాలంటే భయపడి చస్తారు.. పాపం జయలలిత ఆయన బారిన పడింది ఏమి చేస్తాం.. తమిళ రాజకీయాలను అవినీతిమయం చేసిన జయ, కరుణలను ఏకకాలంలో మూడు చెరువుల నీరు తాగిస్తున్నారు స్వామి.. 2జీ స్పెక్ట్రమ్ కేసు కూపీ లాగి డీఎంకే కరుణానిధి సతీమణి దయాళు అమ్మాల్, కూతురు కణిమొళి, మారన్ సోదరులు, రాజా తదితరులను ఒకాట ఆడుకున్నాడు.. ఈ ఒకే ఒక్కడు మున్ముందు ఇంకేం చేస్తాడో చూడాలి..

No comments:

Post a Comment