Sunday, September 21, 2014

అమ్మ పెట్టదు.. అడుక్కు తిననీయదు..


కొద్ది వారాల క్రితం హైదరాబాద్ పాతబస్తీలో రెండు మైనారిటీ గ్రూపుల మధ్య మత ఘర్షణలు జరిగాయి.. ప్రాణ నష్టం జరిగినా పోలీసులు సమాచారం ఎక్కువ ప్రచారం కాకుండా జాగ్రత్తగా అదుపు చేశారు.. కర్ఫ్యూ విధించారు.. అక్కడి ప్రజలు రెక్కాడితే కానీ డొక్కాడని పేదలు.. ఒక స్వచ్ఛంద సంస్థ పోలీసుల ద్వారా వారికి బియ్యం తదితర నిత్యావసర వస్తువులు పంపిణీ చేసింది.. కానీ మరునాడే అక్కడి ప్రజలంతా తమకు ఇచ్చినవన్నీ పోలీసులకు తిరిగి ఇచ్చేశారు.. ఏమిటి అని ఆరా తీస్తే సాయం తీసుకున్నందుకు వారి మతానికి చెందిన నాయకులు బెదిరించారట.. పోనీ వారేమైనా సాయపడ్డారా అంటే అదీ లేదు..
ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లోనూ ఇదే జరుగుతోంది.. వరదల్లో సర్వస్వం కోల్పోయిన కాశ్మీరీ వాసులను ఆదుకునేందుకు దేశమంతా కదిలింది.. ముఖ్యంగా మన సైన్యంతో పాటు, స్వచ్చంద సంస్థలు రాత్రింబవళ్లు ప్రజలను రక్షించడంతో పాటు ఆహారం, బట్టలు ఇచ్చి ఆదుకుంటున్నారు.. అయితే ఇదంతా అక్కడి వేర్పాటు వాదులకు నచ్చడం లేదు.. భారత దేశం నుండి వచ్చే సాయం తీసుకోవద్దని బాధితులను బెదిరిస్తున్నారు.. సాయం చేసేవారిపై చేయి చేసుకొని అడ్డుకుంటున్నారు.. సాయం అందుకుంటున్న వారు భారత్ కు ఎక్కడ దగ్గర అవుతారో అని వేర్పాటు వాదుల ఆందోళన అట..  మరి వారేదైనా సాయం చేస్తున్నారా అంటే, ఏ మాత్రం లేదు..

ఇప్పుడు అర్థమైంది కదూ పై సామెతలోని ఆంతర్యం..

No comments:

Post a Comment